రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎలాంటి సందేహాలు అవసరం లేదని సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా గురువారం ఉదయం ఆయన విశాఖలో యూరప్ దేశాలకు చెందిన పెట్టుబడి దారులతో ఓ హోటల్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతు.. అనేక మందికి రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుందేమోనన్న సందేహం ఉందని.. అలాంటి దేమీ జరగదని.. దీనికి తాను గ్యారెంటీ ఇస్తానని తెలిపారు.
“ప్రస్తుతం .. ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు. వారికి తెలుసు.. ఏ ప్రభుత్వం ఉంటే అభివృద్ధి జరుగుతుందో. ఎట్టి పరిస్థితిలోనూ ప్రభుత్వం మారదు. మీరు నిశ్చింతగా పెట్టుబడులు పెట్టండి“ అని చంద్రబాబు వివరించారు. పెట్టుబడులు పెట్టేవారికి తక్షణమే అనుమతులు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు సీఎం తెలిపారు. బలమైన ప్రభుత్వం ఉందని.. మళ్లీ మళ్లీ కూడా అధికారంలోకి వస్తుందని.. ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేస్తున్నట్టు సీఎం తెలిపారు. పెట్టుబడులు పెట్టేవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని చెప్పారు. భూములు, నీళ్లు, విద్యుత్, పన్నులు సహా.. అనేక విషయాల్లో రాయితీలు కల్పిస్తున్నామన్నారు. విద్యావంతులైన యువత అందుబాటులో ఉన్నారని.. మ్యాన్ పవర్ కు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో అపారమైన వనరులు ఉన్నాయని వివరించారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సంపూర్ణ సహకారం అందుతోందన్న సీఎం చంద్రబాబు.. ప్రభుత్వం మారుతుందేమోనన్న సందేహాన్ని ఈ క్షణమే వదిలి వేయాలని సూచించారు. ప్రజల్లో వచ్చిన మార్పులను గమనించాలన్నారు. ఇండియా-యూరప్ దేశాల మధ్య అనేక సంబంధాలు కొనసాగుతున్నాయన్న సీఎం.. ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా.. అనేక రూపాల్లో ఇరు పక్షాలకు మేలు జరుగుతుందన్నారు. వినూత్న ఆవిష్కరణలు, ఆలోచనలతో ముందుకు వచ్చేవారికి అన్ని విధాలా ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు.
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…