రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎలాంటి సందేహాలు అవసరం లేదని సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా గురువారం ఉదయం ఆయన విశాఖలో యూరప్ దేశాలకు చెందిన పెట్టుబడి దారులతో ఓ హోటల్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతు.. అనేక మందికి రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుందేమోనన్న సందేహం ఉందని.. అలాంటి దేమీ జరగదని.. దీనికి తాను గ్యారెంటీ ఇస్తానని తెలిపారు.
“ప్రస్తుతం .. ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు. వారికి తెలుసు.. ఏ ప్రభుత్వం ఉంటే అభివృద్ధి జరుగుతుందో. ఎట్టి పరిస్థితిలోనూ ప్రభుత్వం మారదు. మీరు నిశ్చింతగా పెట్టుబడులు పెట్టండి“ అని చంద్రబాబు వివరించారు. పెట్టుబడులు పెట్టేవారికి తక్షణమే అనుమతులు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు సీఎం తెలిపారు. బలమైన ప్రభుత్వం ఉందని.. మళ్లీ మళ్లీ కూడా అధికారంలోకి వస్తుందని.. ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేస్తున్నట్టు సీఎం తెలిపారు. పెట్టుబడులు పెట్టేవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని చెప్పారు. భూములు, నీళ్లు, విద్యుత్, పన్నులు సహా.. అనేక విషయాల్లో రాయితీలు కల్పిస్తున్నామన్నారు. విద్యావంతులైన యువత అందుబాటులో ఉన్నారని.. మ్యాన్ పవర్ కు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో అపారమైన వనరులు ఉన్నాయని వివరించారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సంపూర్ణ సహకారం అందుతోందన్న సీఎం చంద్రబాబు.. ప్రభుత్వం మారుతుందేమోనన్న సందేహాన్ని ఈ క్షణమే వదిలి వేయాలని సూచించారు. ప్రజల్లో వచ్చిన మార్పులను గమనించాలన్నారు. ఇండియా-యూరప్ దేశాల మధ్య అనేక సంబంధాలు కొనసాగుతున్నాయన్న సీఎం.. ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా.. అనేక రూపాల్లో ఇరు పక్షాలకు మేలు జరుగుతుందన్నారు. వినూత్న ఆవిష్కరణలు, ఆలోచనలతో ముందుకు వచ్చేవారికి అన్ని విధాలా ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు.
This post was last modified on November 13, 2025 12:13 pm
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…