రేపు ఉదయం భారీ ప్రకటన అంటూ నిన్న ట్వీట్ చేసి సస్పెన్స్ క్రియేట్ చేసిన లోకేష్.. దానిని రివీల్ చేశారు. అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ కంపెనీ పేరును ప్రకటించారు. 2019లో కొత్త ప్రాజెక్టులను నిలిపివేసిన ఆ కంపెనీ… రేపు ఆంధ్రప్రదేశ్లో దూసుకురానుంది!.. అని లోకేష్ చెప్పినట్లుగానే ఓ భారీ కంపెనీ ఏపీకి తిరిగి రానుంది. ఆంధ్రప్రదేశ్లో రీన్యూ కంపెనీ భారీ పెట్టుబడి పెట్టనుంది. ఐదేళ్ల తర్వాత ఏపీలో తిరిగి అడుగుపెడుతున్న రీన్యూ, రాష్ట్రంలో పునరుత్పాదక శక్తి రంగంపై భారీ పెట్టుబడి పెట్టనుంది.
రూ. 82,000 కోట్ల పెట్టుబడితో రీన్యూ సంస్థ సౌర ఇంగాట్, వాఫర్ తయారీ, ప్రాజెక్ట్ అభివృద్ధి నుంచి గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ మాలిక్యూల్స్ వరకు హైటెక్ రంగాల్లో పెట్టుబడి పెట్టనున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ సందర్భంగా సుమంత్ సిన్హా, రిన్యూ క్రాప్ బృందానికి విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో హృదయపూర్వక స్వాగతం తెలిపినట్లు లోకేష్ పేర్కొన్నారు.
విభజిత ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారి అధికారంలోకి వచ్చిన టీడీపీ గవర్నమెంట్ లోనే పెట్టుబడులు పెట్టాలని రిన్యూ సంస్థ భావించింది. అప్పట్లో ఒప్పందాలు కూడా జరిగాయి. ఆ ప్రక్రియ పూర్తికాక ముందే వైసీపీ ప్రభుత్వం కొలువు తీరింది. అప్పటికి ఆ సంస్థ కొంత మొత్తం నిధులు వెచ్చించి పనులు ప్రారంభించేందుకు ఏర్పాటు చేసుకున్నా.. వైసీపీ ప్రభుత్వం వారికి సహకరించలేదు.
ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ సంస్థ వెళ్ళిపోయింది. తిరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రిన్యూ సంస్థతో సంప్రదింపులు జరిగాయి. తమ ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బంది రాదని, కేంద్రం నుంచి కూడా గ్యారెంటీ పెంచడంతో తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ ముందుకు వస్తోంది. ఏపీ నుంచి వెళ్లిపోయిన ప్రతిష్టాత్మక, అంతర్జాతీయ సంస్థను తిరిగి రప్పించడంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కృషిని అంతా ప్రశంసిస్తున్నారు.
This post was last modified on November 13, 2025 12:04 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…