ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్లో ఒక పోస్ట్తో సస్పెన్స్ క్రియేట్ చేశారు. “ఉదయం 9 గంటలకు భారీ ప్రకటన!” అంటూ ఆసక్తి రేకెత్తించారు. విశాఖలో ఈనెల 14, 15 తేదీల్లో ఏపీ ప్రభుత్వం – సీఐఐ ఆధ్వర్యంలో భాగస్వామ్య సదస్సు నిర్వహించనున్నారు. దేశ, విదేశాల నుంచి వివిధ సంస్థల ప్రతినిధులు హాజరు కానున్నారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెరగడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో లోకేష్ ఈ రోజు ఆసక్తికర ట్వీట్ చేశారు. “2019లో కొత్త ప్రాజెక్టులను నిలిపివేసిన ఆ కంపెనీ… రేపు ఆంధ్రప్రదేశ్లో దూసుకురానుంది! ఆ సంస్థ ఏమిటో తెలుసా..? రేపు ఉదయం 9 గంటలకు భారీ ప్రకటన! ఆసక్తిగా ఎదురుచూడండి!!” అంటూ ఆయన ట్వీట్ చేశారు.
2019లో వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక కంపెనీలు ఏపీని వదిలి వెళ్లిపోయాయని టీడీపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు తగ్గడంతో విశాఖలో ఐటీ రంగం కుదేలైందనే ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయ భవనాలు ఖాళీగా మారి, ఉన్న కంపెనీలు మూతపడినా అప్పటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని చెబుతున్నారు.
గత ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలన వల్ల రాష్ట్రం 25 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందనేది టీడీపీ వాదన. అటువంటి పరిస్థితుల్లో, గతంలో వెళ్లిపోయిన ఒక పెద్ద కంపెనీ తిరిగి ఏపీకి వస్తోందని లోకేష్ తెలిపారు. “భారీ ప్రకటన వస్తోంది” అంటూ ఆయన సూచించారు.
This post was last modified on November 12, 2025 7:00 pm
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…