Political News

ప్రతీ పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేరబోతుంది

రాష్ట్రంలో సొంతిల్లులేని ప్ర‌తి పేద కుటుంబాన్నీ ఆదుకుంటామ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. 2029 నాటికి.. రాష్ట్రంలో ఉన్న పేద‌ల‌ను గుర్తించి.. వారికి సొంత‌గా ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్య‌త‌ను స్వ‌యంగా తాను తీసుకుంటాన‌ని హామీ ఇచ్చారు. తాజాగా అన్న‌మ‌య్య జిల్లా రాజంపేట నియోజ‌క‌వ‌ర్గంలోని చిన మండెం అనే గ్రామంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో సీఎం పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 3 ల‌క్ష‌ల 192 ఇళ్ల‌ను పేద‌లకు ఆయ‌న అందించారు.

ఒకే స‌మ‌యంలో సామూహిక గృహ ప్ర‌వేశాల‌ను కూడా చేయించారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన ప్ర‌జా వేదిక స‌భ‌లో చంద్ర‌బాబు మాట్లాడుతూ.. పేద‌లను అత్యున్న‌త స్థాయికి తీసుకురావాల‌న్న ల‌క్ష్యంతో త‌మ ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌న్నారు. తాను.. ఎక్క‌డున్నా.. ఏం చేస్తున్నా త‌న ఆలోచ‌న‌ల‌న్నీ పేద‌ల కోసమేన‌ని వెల్ల‌డించారు. ముఖ్యంగా పేద కుటుంబాల్లోని వారిని ఆదుకునేందుకునిరంత‌రం అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలిపారు. ఈ క్ర‌మంలో వారికి సొంతిల్లు నిర్మించాల‌న్న సంక‌ల్పాన్ని తీసుకున్న‌ట్టు చెప్పారు.

ప్ర‌స్తుతం 3 ల‌క్ష‌ల పైచిలుకు ఇళ్ల‌ను పేద‌ల‌కు ఇస్తున్నామ‌న్న చంద్ర‌బాబు.. వ‌చ్చే ఉగాది నాటికి మ‌రో 5 ల‌క్ష‌ల ఇళ్ల‌ను నిర్మించి.. వారికి అందిస్తామ‌న్నారు. అప్పుడు కూడా సామూహికంగా గృహ ప్ర‌వేశాలు చేయిస్తామ‌న్నారు. మ‌హిళ‌ల‌ను ఆర్థికంగా ప్రోత్స‌హిస్తున్న‌ట్టు తెలిపారు. ఎంఎస్ ఎంఈల‌కు నాంది ప‌ల‌క‌డం ద్వారా.. మ‌హిళా పారిశ్రామిక వేత్త‌ల‌ను రూపొందించాల‌న్న నిర్ణయం సాకారం చేసుకునే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు చంద్ర‌బాబు వివ‌రించారు. అదేవిధంగా ప్ర‌తి ఇంటి నుంచి ఒక పారిశ్రామిక వేత్త‌ను అభివృద్ధి చేయ‌నున్న‌ట్టు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా మ‌రోసారి ఆయ‌న వైసీపీ పాల‌న‌ను టార్గెట్ చేశారు. గ‌తంలో పేద‌ల‌ను మ‌భ్య‌పెట్టార‌న్న చంద్ర‌బాబు.. తాము కేవ‌లం 17 మాసాల్లోనే ఇళ్ల‌ను పేద‌ల‌కు అందిస్తున్నామ‌న్నారు. ఇది మంచి ప్ర‌భుత్వం అనే మాట ప్ర‌జ‌ల నోటి నుంచి వినిపిస్తోంద‌ని తెలిపారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని డెవ‌ల‌ప్ చేయాల‌న్న సంక‌ల్పంతో ముందుకు సాగుతున్నామ‌ని.. అనేక అవాంత‌రాలు వ‌చ్చినా.. అధిగ‌మిస్తున్నామని వెల్ల‌డించారు.

This post was last modified on November 12, 2025 6:16 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Chandrababu

Recent Posts

భోజనంలో పురుగులు… వందేభారత్ రామానుజం ఏం చేశాడు?

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…

23 minutes ago

చిరు బాబీ మిస్… వెంకీ అనిల్ ఫిక్స్

వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…

56 minutes ago

వెయ్యి కోట్ల విధ్వంసం వారం రోజుల్లోనే

అంచనాలకు మించి దురంధర్ ది రివెంజ్ అరాచకం చేస్తోంది. సరిగ్గా వారం రోజులు కావడం ఆలస్యం వెయ్యి కోట్ల క్లబ్బులోకి…

2 hours ago

మంగళగిరిని లోకేశ్ వీడాల్సిందేనా…?

లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఖరారైన నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆయా పరిణామాలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ…

4 hours ago

ప్రభాస్ ప్రేమిస్తే ఇంతే

నేటి తరం కుర్ర హీరోల్లో సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ సోదరులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే వీరిద్దరి…

4 hours ago

ఘోర బస్సు ప్రమాదం 10 మంది సజీవదహనం

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు…

6 hours ago