Political News

ప్రతీ పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేరబోతుంది

రాష్ట్రంలో సొంతిల్లులేని ప్ర‌తి పేద కుటుంబాన్నీ ఆదుకుంటామ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. 2029 నాటికి.. రాష్ట్రంలో ఉన్న పేద‌ల‌ను గుర్తించి.. వారికి సొంత‌గా ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్య‌త‌ను స్వ‌యంగా తాను తీసుకుంటాన‌ని హామీ ఇచ్చారు. తాజాగా అన్న‌మ‌య్య జిల్లా రాజంపేట నియోజ‌క‌వ‌ర్గంలోని చిన మండెం అనే గ్రామంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో సీఎం పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 3 ల‌క్ష‌ల 192 ఇళ్ల‌ను పేద‌లకు ఆయ‌న అందించారు.

ఒకే స‌మ‌యంలో సామూహిక గృహ ప్ర‌వేశాల‌ను కూడా చేయించారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన ప్ర‌జా వేదిక స‌భ‌లో చంద్ర‌బాబు మాట్లాడుతూ.. పేద‌లను అత్యున్న‌త స్థాయికి తీసుకురావాల‌న్న ల‌క్ష్యంతో త‌మ ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌న్నారు. తాను.. ఎక్క‌డున్నా.. ఏం చేస్తున్నా త‌న ఆలోచ‌న‌ల‌న్నీ పేద‌ల కోసమేన‌ని వెల్ల‌డించారు. ముఖ్యంగా పేద కుటుంబాల్లోని వారిని ఆదుకునేందుకునిరంత‌రం అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలిపారు. ఈ క్ర‌మంలో వారికి సొంతిల్లు నిర్మించాల‌న్న సంక‌ల్పాన్ని తీసుకున్న‌ట్టు చెప్పారు.

ప్ర‌స్తుతం 3 ల‌క్ష‌ల పైచిలుకు ఇళ్ల‌ను పేద‌ల‌కు ఇస్తున్నామ‌న్న చంద్ర‌బాబు.. వ‌చ్చే ఉగాది నాటికి మ‌రో 5 ల‌క్ష‌ల ఇళ్ల‌ను నిర్మించి.. వారికి అందిస్తామ‌న్నారు. అప్పుడు కూడా సామూహికంగా గృహ ప్ర‌వేశాలు చేయిస్తామ‌న్నారు. మ‌హిళ‌ల‌ను ఆర్థికంగా ప్రోత్స‌హిస్తున్న‌ట్టు తెలిపారు. ఎంఎస్ ఎంఈల‌కు నాంది ప‌ల‌క‌డం ద్వారా.. మ‌హిళా పారిశ్రామిక వేత్త‌ల‌ను రూపొందించాల‌న్న నిర్ణయం సాకారం చేసుకునే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు చంద్ర‌బాబు వివ‌రించారు. అదేవిధంగా ప్ర‌తి ఇంటి నుంచి ఒక పారిశ్రామిక వేత్త‌ను అభివృద్ధి చేయ‌నున్న‌ట్టు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా మ‌రోసారి ఆయ‌న వైసీపీ పాల‌న‌ను టార్గెట్ చేశారు. గ‌తంలో పేద‌ల‌ను మ‌భ్య‌పెట్టార‌న్న చంద్ర‌బాబు.. తాము కేవ‌లం 17 మాసాల్లోనే ఇళ్ల‌ను పేద‌ల‌కు అందిస్తున్నామ‌న్నారు. ఇది మంచి ప్ర‌భుత్వం అనే మాట ప్ర‌జ‌ల నోటి నుంచి వినిపిస్తోంద‌ని తెలిపారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని డెవ‌ల‌ప్ చేయాల‌న్న సంక‌ల్పంతో ముందుకు సాగుతున్నామ‌ని.. అనేక అవాంత‌రాలు వ‌చ్చినా.. అధిగ‌మిస్తున్నామని వెల్ల‌డించారు.

This post was last modified on November 12, 2025 6:16 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Chandrababu

Recent Posts

పవన్ చొరవతో క్షేమంగా ఇల్లు చేరిన ముస్లిం మహిళ

బతుకుదెరువు కోసం విదేశం వెళ్లిన ఏపీకి చెందిన ముస్లిం మహిళ అక్కడ విష వలయంలో చిక్కుకుంది. ఆ ఉచ్చు నుంచి…

6 hours ago

రిస్క్ ఉన్నా ముందుకెళ్తున్న అబ్బవరం

ఇటీవలే కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి తిమ్మరాజుపల్లి టీవీ తీశారు. మొదటి మూడు రోజులు తెగ హడావిడి చేశారు. గొప్ప…

7 hours ago

ఎల్లమ్మ సమస్యకు ఏది ముగింపు

దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత దిల్ రాజు ప్రకటించిన ఎల్లమ్మ ఇప్పటికీ రెగ్యులర్ షూటింగ్ కు…

8 hours ago

దేవిశ్రీ.. అంత:కరణశుద్ధితో..

సంగీత దర్శకులు హీరోలు కావడం తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే చూశాం. విజయ్ ఆంటోనీ, జి.వి.ప్రకాష్ కుమార్ లాంటి వాళ్లు సినీ…

9 hours ago

ఇక కాంగ్రెస్ వాళ్లతో కూర్చోలేం

ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్తో డీఎంకే పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే అయితే కేవలం ఐదు సీట్లు…

10 hours ago

అనుష్క సినిమాకు మళ్ళీ మౌనవ్రతం

అదేంటో అనుష్క సినిమాలు నిర్మాణంలోనే కాదు విడుదలలోనూ తెగ ఆలస్యానికి గురవుతున్నాయి. మలయాళంలో తను నటించిన ప్యాన్ ఇండియా మూవీ…

11 hours ago