Political News

నారా ఫ్యామిలీ.. ఇంటి ముఖం చూడట్లేదా..!

టీడీపీ అధినేత‌, సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబం ఇంటి ముఖం చూసి వారం రోజులు అయిందట. ఈ వారం రోజులుగా వారు ప్రజల మధ్యే ఉంటున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అయితే వారం కాదు, పది రోజులుగా ఇంటి ముఖం చూడలేదని అంటున్నారు.

ఎంత బిజీగా ఉన్నప్పటికీ, విదేశాల్లో ఉంటే తప్ప ఏపీలో ఉన్నప్పుడు వారాంతంలో సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌లు హైదరాబాదుకు వెళ్లి కుటుంబంతో ఒక్కరోజైనా గడుపుతారు. కానీ ఈసారి గత పది రోజులుగా చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు ఇంటి ముఖం కూడా చూడలేదని పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక నారా భువనేశ్వరి కూడా గత వారం కేవలం రెండు రోజులపాటు మాత్రమే ఇంటికి వెళ్లారట. మరి వారు ఏం చేశారన్నది ఆసక్తిగా మారింది. లండన్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు దంపతులు తిరిగి వచ్చాక ఇంటికి వెళ్లాలని అనుకున్నారు. కానీ రాష్ట్ర రాజకీయ పరిణామాలు, వైసీపీ చేసిన విమర్శలు, రైతులకు వచ్చిన నష్టం వంటి పరిణామాల కారణంగా చంద్రబాబు లండన్ నుంచి నేరుగా ఉండవల్లికి వచ్చేశారు.

ఆ వెంటనే ఆయన సచివాలయానికి వెళ్లి పలు సమీక్షలు నిర్వహించారు. అనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఇదే సమయంలో భువనేశ్వరి కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా కుప్పంలో జరిగిన కార్యక్రమాలకు కూడా హాజరయ్యారు. దీంతో వారిద్దరూ వారం రోజులుగా దాదాపు ఇంటి ముఖం చూడలేదు.

ఇక నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని వచ్చాక ఇంటికి వెళ్లి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామనుకున్నారు. కానీ అదే రోజు కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటన జరిగి, వెంటనే శ్రీకాకుళానికి వెళ్లారు. ఆ తర్వాత కూడా ఇంటికి వెళ్లే అవకాశం రాలేదు. పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించిన తర్వాత అనంతపురంలో పర్యటనకు వెళ్లి రెండు రోజులు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఇలా గత పది రోజులుగా నారా లోకేష్ సహా చంద్రబాబు కుటుంబం ఇంటి ముఖం చూడకుండానే ప్రజల మధ్యే ఉండటం గమనార్హం.

This post was last modified on November 12, 2025 7:49 am

Share

Recent Posts

సాలిడ్ కంటెంట్ పడితే రవితేజ స్టామినా ఇది

టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…

1 hour ago

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

3 hours ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

4 hours ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

4 hours ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

4 hours ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

5 hours ago