వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపినట్లు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ తేల్చింది. ఈ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దానిపై ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా స్పందించారు.
“పాలు లేని కల్తీ నెయ్యిలో మతోన్మాదాన్ని కలపకుండా, కల్తీ రాజకీయం చేయకుండా ఇప్పటికైనా తప్పు చేసిన వాడిని శిక్షించే పని చూడండి” అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. “ఎందుకు ప్రతి దాంట్లో మతోన్మాదం, జాతి ద్వేషం మాత్రమే మీకు కనిపిస్తాయో ఆలోచించండి” అంటూ ఒకరు రిప్లై ఇచ్చారు.
గతంలోనూ కల్తీ నెయ్యి వ్యవహారం బయటకు వచ్చినప్పుడు ప్రకాష్ రాజ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. “ప్రియమైన పవన్ కల్యాణ్, మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే ఈ ఘటన జరిగింది. దయచేసి దానిపై దర్యాప్తు చేసి, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోండి. దేశవ్యాప్తంగా భయాందోళనలు రేకెత్తించేలా విషయాన్ని ప్రచారం చేయడం ఎందుకు? దేశంలో ఇప్పటికే మత సామరస్యానికి భంగం కలిగించే పరిస్థితులు తలెత్తుతున్నాయి” అని పేర్కొన్నారు.
ఈ కామెంట్లపై కూడా అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. కల్తీ నెయ్యి నిజమేనని ఇప్పుడు సిట్ తేల్చింది. మరి కల్తీ రాజకీయం ఎవరిది? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
This post was last modified on November 12, 2025 7:45 am
అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ అంటే తెలుగులో అంతకుమించిన బంపరాఫర్ లేదన్నట్లే. హిట్ మెషీన్గా పేరు తెచ్చుకున్న అనిల్.. ఇప్పటిదాకా…
ఏఐని వాడుకుని ఇప్పుడు హీరోయిన్ల మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియా జనాలు ఎలా రెచ్చిపోతున్నారో.. ఇంటర్నెట్ ఎంత విశృంఖలంగా తయారైందో చూస్తూనే…
ఏపీకి సంబంధించి అందరూ ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి భోగాపురం ఎయిర్ పోర్టు. భారీగా చేపట్టిన ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే..…
ఎంత గ్యాప్ వచ్చినా పర్లేదు క్వాలిటీనే ముఖ్యమనే హీరో అడివి శేష్ కొత్త సినిమా డెకాయిట్ ఈ శుక్రవారం ఏప్రిల్…
మొన్న శుక్రవారం రిలీజైన బైకర్, రాకాస మొదటి వీకెండ్ పూర్తి చేసుకున్నాయి. నిన్న ఐపీఎల్ లో సన్ రైజర్స్, సూపర్…
ఒక పవన్ కళ్యాణ్ సినిమా ఇంత వేగంగా ఫేడవుట్ అవ్వడం ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలోనే జరిగిందని చెప్పాలి. గతంలో…