వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపినట్లు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ తేల్చింది. ఈ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దానిపై ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా స్పందించారు.
“పాలు లేని కల్తీ నెయ్యిలో మతోన్మాదాన్ని కలపకుండా, కల్తీ రాజకీయం చేయకుండా ఇప్పటికైనా తప్పు చేసిన వాడిని శిక్షించే పని చూడండి” అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. “ఎందుకు ప్రతి దాంట్లో మతోన్మాదం, జాతి ద్వేషం మాత్రమే మీకు కనిపిస్తాయో ఆలోచించండి” అంటూ ఒకరు రిప్లై ఇచ్చారు.
గతంలోనూ కల్తీ నెయ్యి వ్యవహారం బయటకు వచ్చినప్పుడు ప్రకాష్ రాజ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. “ప్రియమైన పవన్ కల్యాణ్, మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే ఈ ఘటన జరిగింది. దయచేసి దానిపై దర్యాప్తు చేసి, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోండి. దేశవ్యాప్తంగా భయాందోళనలు రేకెత్తించేలా విషయాన్ని ప్రచారం చేయడం ఎందుకు? దేశంలో ఇప్పటికే మత సామరస్యానికి భంగం కలిగించే పరిస్థితులు తలెత్తుతున్నాయి” అని పేర్కొన్నారు.
ఈ కామెంట్లపై కూడా అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. కల్తీ నెయ్యి నిజమేనని ఇప్పుడు సిట్ తేల్చింది. మరి కల్తీ రాజకీయం ఎవరిది? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
This post was last modified on November 12, 2025 7:45 am
మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ ఫలితాన్ని విశ్వంభర క్యాష్ చేసుకునే దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగకపోవడం అభిమానులను బాధ…
గత కొన్నేళ్లలో మోస్ట్ అన్ పాపులర్ ఇండియన్ క్రికెటర్ ఎవరు అంటే మరో మాట లేకుండా హార్దిక్ పాండ్య పేరు…
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ సువార్తీకుడు కేఏ పాల్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ…
తమ్ముడు తమ్ముడే.. రాజకీయం రాజకీయమే.. బీజేపీ విషయంలో ఇది అక్షరాలా నిజం. తనకు అవకాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…
ఏపీలో మతపరమైన వివాదాలకు కేంద్రంగా మారిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఆదివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.…
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మించే సినిమా దర్శకుడి ఎంపిక విషయంలో ఎంత తలనొప్పి ఎదురైందో…