వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపినట్లు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ తేల్చింది. ఈ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దానిపై ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా స్పందించారు.
“పాలు లేని కల్తీ నెయ్యిలో మతోన్మాదాన్ని కలపకుండా, కల్తీ రాజకీయం చేయకుండా ఇప్పటికైనా తప్పు చేసిన వాడిని శిక్షించే పని చూడండి” అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. “ఎందుకు ప్రతి దాంట్లో మతోన్మాదం, జాతి ద్వేషం మాత్రమే మీకు కనిపిస్తాయో ఆలోచించండి” అంటూ ఒకరు రిప్లై ఇచ్చారు.
గతంలోనూ కల్తీ నెయ్యి వ్యవహారం బయటకు వచ్చినప్పుడు ప్రకాష్ రాజ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. “ప్రియమైన పవన్ కల్యాణ్, మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే ఈ ఘటన జరిగింది. దయచేసి దానిపై దర్యాప్తు చేసి, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోండి. దేశవ్యాప్తంగా భయాందోళనలు రేకెత్తించేలా విషయాన్ని ప్రచారం చేయడం ఎందుకు? దేశంలో ఇప్పటికే మత సామరస్యానికి భంగం కలిగించే పరిస్థితులు తలెత్తుతున్నాయి” అని పేర్కొన్నారు.
ఈ కామెంట్లపై కూడా అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. కల్తీ నెయ్యి నిజమేనని ఇప్పుడు సిట్ తేల్చింది. మరి కల్తీ రాజకీయం ఎవరిది? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
This post was last modified on November 12, 2025 7:45 am
నిజమే… ఒక్క యువతిని ఇద్దరు స్నేహితులు ప్రేమించిన వ్యవహారం చిలికి చిలికి గాలి వానలా మారి… గురువారం రాత్రి బెజవాడ…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా 'మెగా 158' ప్రారంభోత్సవ వేడుక నిన్న ఎంత గ్రాండ్ గా జరిగిందో చూశాం.…
ఇంకో పన్నెండు రోజుల్లో పెద్ది విడుదల కానుంది. ప్రీమియర్ షోలు ఉంటాయో లేదో, అసలు అప్లై చేశారో లేదోననే క్లారిటీ…
పాకిస్థాన్ దేశంలో మన సినిమాల విషయానికి వచ్చేసరికి మాత్రం క్లాష్ లెక్కలు పూర్తిగా మారిపోతాయి. ముఖ్యంగా మన సౌత్ సినిమాలకు,…
నిన్నటితో కరుప్పు అలియాస్ వీరభద్రుడు 200 కోట్ల గ్రాస్ దాటినట్టు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. గ్రౌండ్ రియాలిటీలో ఈ…
ఏముందిలే.. అని లైట్ తీసుకుంటే.. రాజకీయాల్లో కుదిరే పనికాదు. ఏ విషయాన్నయినా.. సీరియస్గానే తీసుకోవాలి.. సిన్సియర్గానే ఆలోచించాలి. లేకపోతే.. ఇబ్బందులు…