Political News

ఎట్టకేలకు కోర్టు మెట్లెక్కనున్న జగన్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఏళ్ళ తరబడి కొనసాగుతుందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా, కోర్టుకు రాకుండా వ్యక్తిగత హాజరు నుంచి జగన్ మినహాయింపు కోరుతూ ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఐదేళ్లు గడిపేశారని కూడా వైసీపీ హయాంలో ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. అయితే, ప్రస్తుతానికి ప్రతిపక్ష నేత కాని సాధారణ ఎమ్మెల్యే అయిన జగన్ ఇంకా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతుండడంపై పలువురు విమర్శలు గుప్పించారు.

ఈ క్రమంలోనే ఈ నెల 14 లోపు జగన్ వ్యక్తిగతంగా హాజరు కావాలని హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు ఆదేశించింది. అయితే, వ్యక్తిగతంగా విచారణకు హాజరుకాలేనని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు అనుమతివ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ క్రమంలోనే జగన్ పిటిషన్ పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రకారం సీబీఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే జగన్ కు సీబీఐ కోర్టు షాకిచ్చింది. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని సీబీఐ కోర్టు తేల్చి చెప్పింది.

దీంతో, దిగి వచ్చిన జగన్ వ్యక్తిగత హాజరుకు మరో వారం రోజులు గడువు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 21 లోపు వ్యక్తిగతంగా జగన్ కోర్టుకు హాజరు కావాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. జగన్ తరఫు లాయర్ల అభ్యర్థన మేరకు వారం రోజుల గడువునిచ్చింది. చాలా ఏళ్ల విరామం అనంతరం జగన్ మళ్లీ కోర్టు మెట్లు ఎక్కబోతున్నారు.

This post was last modified on November 11, 2025 7:18 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

2 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

3 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

3 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

4 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

6 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

6 hours ago