Political News

ఎట్టకేలకు కోర్టు మెట్లెక్కనున్న జగన్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఏళ్ళ తరబడి కొనసాగుతుందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా, కోర్టుకు రాకుండా వ్యక్తిగత హాజరు నుంచి జగన్ మినహాయింపు కోరుతూ ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఐదేళ్లు గడిపేశారని కూడా వైసీపీ హయాంలో ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. అయితే, ప్రస్తుతానికి ప్రతిపక్ష నేత కాని సాధారణ ఎమ్మెల్యే అయిన జగన్ ఇంకా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతుండడంపై పలువురు విమర్శలు గుప్పించారు.

ఈ క్రమంలోనే ఈ నెల 14 లోపు జగన్ వ్యక్తిగతంగా హాజరు కావాలని హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు ఆదేశించింది. అయితే, వ్యక్తిగతంగా విచారణకు హాజరుకాలేనని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు అనుమతివ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ క్రమంలోనే జగన్ పిటిషన్ పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రకారం సీబీఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే జగన్ కు సీబీఐ కోర్టు షాకిచ్చింది. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని సీబీఐ కోర్టు తేల్చి చెప్పింది.

దీంతో, దిగి వచ్చిన జగన్ వ్యక్తిగత హాజరుకు మరో వారం రోజులు గడువు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 21 లోపు వ్యక్తిగతంగా జగన్ కోర్టుకు హాజరు కావాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. జగన్ తరఫు లాయర్ల అభ్యర్థన మేరకు వారం రోజుల గడువునిచ్చింది. చాలా ఏళ్ల విరామం అనంతరం జగన్ మళ్లీ కోర్టు మెట్లు ఎక్కబోతున్నారు.

This post was last modified on November 11, 2025 7:18 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

2 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

2 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

3 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

3 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

6 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

7 hours ago