Political News

స‌మ‌స్య‌లు మీవి కావు.. నావి: లోకేష్ భ‌రోసా

మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 72వ రోజు ప్రజాదర్బార్ నిర్వ‌హించారు. మంత్రి లోకేష్ ను కలిసేందుకు రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన ప్రజలు, తెలుగు దేశం కార్యకర్తలు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి లోకేష్ ప్రతిఒక్కరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న స‌మ‌స్య‌లు మీవి కావు.. నావి.. అని వారికి భ‌రోసా క‌ల్పించారు.

ఆయా సమస్యలపై ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి.. ప్ర‌తి అర్జీని క్షుణ్ణంగా చ‌దివి బాధితుల నుంచి కూడా వివ‌రాలు సేక‌రించారు. ఆర్థేకతర అంశాల‌కు సంబంధించిన‌ పలు సమస్యల పరిష్కారం కోసం అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. విజ్ఞప్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి అండగా ఉంటామని బాధితులకు భరోసా ఇచ్చిన మంత్రి లోకేష్.. బాధితుల యోగ క్షేమాలు కూడా అడిగి తెలుసుకున్నారు.

కొంద‌రిని.. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, పింఛ‌న్ల పంపిణీ గురించి ఆరా తీశారు. ఎవ‌రైనా ల‌బ్ధి దారులు అయి ఉండి .. ప‌థ‌కాలు ల‌భించ‌నివారు.. వెంట‌నే ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని.. ఈ మేర‌కు స్థానికంగా ఉన్న వారికి కూడా సూచించాల‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల కోసం అనేక కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తోంద‌ని చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే బాధ్య‌త‌ను తాను తీసుకుంటాన‌న్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు సీఎంఆర్ ఎఫ్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. వారికి సంబంధించిన ప‌త్రాల పై స్వ‌యంగా సంత‌కాలుచేసి పంపించారు.

కాగా.. మంత్రినారా లోకేష్‌.. నిర్వ‌హిస్తున్న ప్ర‌జాద‌ర్బార్‌కు ప్ర‌జ‌లు పోటెత్త‌డం గ‌మ‌నార్హం. ఎక్క‌డెక్క‌డి నుంచో వ‌స్తున్నారు. నిజానికి క్షేత్ర‌స్థాయిలో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని కోరుతున్నారు. కానీ.. కొంద‌రు ఎమ్మెల్యేలు లైట్ తీసుకుంటున్నారు. దీంతో నారా లోకేష్ కోసం ప్ర‌జ‌లు క్యూ క‌ట్ట‌డం గ‌మ‌నార్హం. తాజాగా నిర్వ‌హించిన ప్ర‌జాద‌ర్బార్‌లో 3000 మంది ప్ర‌జ‌లు హాజ‌ర‌య్యారు.

1 / 12

This post was last modified on November 11, 2025 7:14 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

కవిత ఫస్ట్ టార్గెట్ కారు వీరులే

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నోట నుంచి వస్తున్న వ్యాఖ్యలు... తాను వదిలేసి వచ్చిన బీఆర్ఎస్…

47 minutes ago

‘ఉత్తరాది’పై ‘దక్షిణాది’దే విజయం!

డీలిమిటేషన్, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులు లోక్ సభలో వీగిపోయిన నేపథ్యంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఆ విశ్లేషణలన్నింటిలో ఒకటి మాత్రం…

2 hours ago

హార్ముజ్ ఓపెన్‌: ఊపిరి పీల్చుకున్న ప్ర‌పంచం!

ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న ఉద్రిక్త‌త‌లు.. త‌మ‌పై చేస్తున్న యుద్ధం నేప‌థ్యంలో కీల‌క‌మైన హోర్ముజ్ జల‌సంధిని ఇరాన్ మూసివేసిన విష‌యం తెలిసిందే. ఈ…

2 hours ago

వీగిపోయిన బిల్లులు… ఓట్లు ఇంత తక్కువా?

దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసిన నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లకు ఉద్దేశించిన బిల్లులకు పార్లమెంటులో చుక్కెదురైంది. డీలిమిటేషన్, మహిళా బిల్లులకు ఆమోదం…

3 hours ago

మ‌త ప‌ర‌మైన రిజ‌ర్వేష‌న్లు ఉంటాయా?

మ‌త‌ప‌రంగా రిజ‌ర్వేష‌న్ల‌ను క‌ల్పించేది లేద‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్ల‌మెంటులో తెగేసి చెప్పారు. మ‌హిళా బిల్లు…

3 hours ago

సంబరాలకు ఇంకెంత సమయం కావాలి

సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కొత్త మూవీ సంబరాల ఏటిగట్టు ఇప్పటిదాకా విడుదల తేదీ ఖరారు చేసుకోలేదు. ఫిలిం…

3 hours ago