మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 72వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి లోకేష్ ను కలిసేందుకు రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన ప్రజలు, తెలుగు దేశం కార్యకర్తలు తమ సమస్యలు చెప్పుకొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ప్రతిఒక్కరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సమస్యలు మీవి కావు.. నావి.. అని వారికి భరోసా కల్పించారు.
ఆయా సమస్యలపై ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి.. ప్రతి అర్జీని క్షుణ్ణంగా చదివి బాధితుల నుంచి కూడా వివరాలు సేకరించారు. ఆర్థేకతర అంశాలకు సంబంధించిన పలు సమస్యల పరిష్కారం కోసం అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. విజ్ఞప్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి అండగా ఉంటామని బాధితులకు భరోసా ఇచ్చిన మంత్రి లోకేష్.. బాధితుల యోగ క్షేమాలు కూడా అడిగి తెలుసుకున్నారు.
కొందరిని.. ప్రభుత్వ పథకాలు, పింఛన్ల పంపిణీ గురించి ఆరా తీశారు. ఎవరైనా లబ్ధి దారులు అయి ఉండి .. పథకాలు లభించనివారు.. వెంటనే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలని.. ఈ మేరకు స్థానికంగా ఉన్న వారికి కూడా సూచించాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం ప్రజల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. ఈ సందర్భంగా పలువురు సీఎంఆర్ ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకోగా.. వారికి సంబంధించిన పత్రాల పై స్వయంగా సంతకాలుచేసి పంపించారు.
కాగా.. మంత్రినారా లోకేష్.. నిర్వహిస్తున్న ప్రజాదర్బార్కు ప్రజలు పోటెత్తడం గమనార్హం. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. నిజానికి క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గంలోనూ కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నారు. కానీ.. కొందరు ఎమ్మెల్యేలు లైట్ తీసుకుంటున్నారు. దీంతో నారా లోకేష్ కోసం ప్రజలు క్యూ కట్టడం గమనార్హం. తాజాగా నిర్వహించిన ప్రజాదర్బార్లో 3000 మంది ప్రజలు హాజరయ్యారు.
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…
ఈ రోజు జనసేన తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం' సభకు తెలంగాణ పోలీసులు, హైకోర్టు…
దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నిర్వహించతలపెట్టిన నవ నిర్మాణ…
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ది ఎప్పుడూ సాహసోపేత ప్రయాణమే. కెరీర్ ఆరంభంలోనే ‘బాల రామాయణం’తో పెద్ద రిస్క్ చేశారాయన. దర్శకుడిగా తన…
బాలీవుడ్ హీరోయిన్లు పెద్ద పెద్ద బిజినెస్మ్యాన్లను పెళ్లాడి వ్యక్తిగత జీవితంలో స్థిరపడడం మామూలే. కొందరేమో కొన్నేళ్లు రిలేషన్షిప్లు ఉండి ఆర్థిక…