Political News

న‌న్ను 420 అన్నారు.. వాళ్లే 420 అయ్యారు: చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో త‌న‌ను 420 అంటూ విమ‌ర్శించిన వారే(వైసీపీ నేత‌లు).. ఇప్పుడు 420 అయ్యార‌ని అన్నారు. అన్ని విధాలా.. రాష్ట్రాన్ని ప్ర‌జ‌లను కూడా మోసం చేశార‌ని బాబు విమ‌ర్శించారు. దీంతో రాష్ట్రం వెనుక‌బ‌డి పోయింద‌న్నారు. ప్ర‌జ‌ల‌ను అన్ని విధాలా న‌మ్మించి ఒక్క ఛాన్స్ అంటూ వ‌చ్చి.. 420 ప‌నులు చేసి.. ప్ర‌జ‌లు ప‌క్క‌న పెట్టే ప‌రిస్థితిని తెచ్చుకున్నార‌ని వ్యాఖ్యానించారు. కూట‌మి పార్టీల‌కు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టార‌ని తెలిపారు.

ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని మ‌రింత పెంచుకునేందుకు ఎంతో కృషి చేస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. వ‌చ్చే 10 సంవ‌త్స‌రాల పాటు.. ముఖ్య‌మంత్రిగా సేవ చేసేందుకు త‌న‌కు ఓపిక ఉంద‌ని.. ప్ర‌జ‌ల‌కు మేలు చేయ‌డ‌మే త‌ప్ప‌.. మ‌రో ఆలోచ‌న త‌న‌కు లేద‌న్నారు. గ‌తంలో ఐటీని ప్రోత్స‌హించాన‌ని.. ఇప్పుడు పారిశ్రామిక వేత్త‌లుగా ప్ర‌తి ఇంటి నుంచి ఒక‌రు కావాల‌ని కోరుకుంటున్న‌ట్టు చెప్పారు. అదేస‌మ‌యంలో ఏఐకి ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు తెలిపారు. ప్ర‌తి ఇంటి నుంచి ఏఐ నిపుణులు రావాల‌ని కోరుకుంటున్న‌ట్టు చెప్పారు.

“కేంద్రంలోని మోడీ.. రాష్ట్రంలోని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌హ‌కారం ఎంతో ఉంది. దీంతో ప‌నులు వేగంగా సాగుతున్నాయ‌న్నారు. ప్ర‌కాశం జిల్లాను సస్య‌శ్యామ‌లం చేసేందుకు ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేస్తామ‌న్న సీఎం.. వెనుక‌బ‌డిన ప్రాంతాల‌కు మ‌రింత ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని తెలిపారు. క‌రువు ప్రాంతాల్లోనూ తాగునీరు ఇస్తున్నామ‌న్నారు. రాయ‌ల‌సీమ ఒక‌ప్పుడు .. రాళ్ల సీమ‌గా మారుతుంద‌ని కొంద‌రు వ్యాఖ్యానించారు. కానీ, ఇప్పుడు ర‌త‌నాల సీమగా మారుస్తున్న‌ట్టు చెప్పారు.

లోకేష్ బాగా క‌ష్ట‌ప‌డుతున్నార‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. ఏచిన్న ఐడియా ఇచ్చినా.. లోకేష్ వెంట‌నే కార్యాచ‌ర‌ణ‌కు దిగుతున్నార‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో రోజుల త‌ర‌బ‌డి కూడా క‌ష్ట‌ప‌డుతున్నార‌ని చెప్పారు. ఆయ‌న క‌ష్టంతోనే అనేక ప‌రిశ్ర‌మ‌లు కూడా వ‌స్తున్నాయ‌ని తెలిపారు. విశాఖ‌లో భారీ ఎత్తున నిర్వ‌హిస్తున్న పెట్టుబ‌డుల స‌ద‌స్సు దీనికి వేదిక కానుంద‌న్నారు. క‌నిగిరి, మార్కాపురం, గిద్ద‌లూరు త‌దిత‌ర ప్రాంతాల‌కు.. గోదావ‌రి-కృష్ణా న‌దుల జ‌లాల‌ను పారించి.. ఇక్క‌డివారికి తాగు, సాగునీరు అందిస్తామ‌న్నారు.

This post was last modified on November 11, 2025 2:46 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Chandrababu

Recent Posts

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

33 minutes ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

2 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

3 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

3 hours ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

4 hours ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

5 hours ago