Political News

న‌న్ను 420 అన్నారు.. వాళ్లే 420 అయ్యారు: చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో త‌న‌ను 420 అంటూ విమ‌ర్శించిన వారే(వైసీపీ నేత‌లు).. ఇప్పుడు 420 అయ్యార‌ని అన్నారు. అన్ని విధాలా.. రాష్ట్రాన్ని ప్ర‌జ‌లను కూడా మోసం చేశార‌ని బాబు విమ‌ర్శించారు. దీంతో రాష్ట్రం వెనుక‌బ‌డి పోయింద‌న్నారు. ప్ర‌జ‌ల‌ను అన్ని విధాలా న‌మ్మించి ఒక్క ఛాన్స్ అంటూ వ‌చ్చి.. 420 ప‌నులు చేసి.. ప్ర‌జ‌లు ప‌క్క‌న పెట్టే ప‌రిస్థితిని తెచ్చుకున్నార‌ని వ్యాఖ్యానించారు. కూట‌మి పార్టీల‌కు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టార‌ని తెలిపారు.

ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని మ‌రింత పెంచుకునేందుకు ఎంతో కృషి చేస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. వ‌చ్చే 10 సంవ‌త్స‌రాల పాటు.. ముఖ్య‌మంత్రిగా సేవ చేసేందుకు త‌న‌కు ఓపిక ఉంద‌ని.. ప్ర‌జ‌ల‌కు మేలు చేయ‌డ‌మే త‌ప్ప‌.. మ‌రో ఆలోచ‌న త‌న‌కు లేద‌న్నారు. గ‌తంలో ఐటీని ప్రోత్స‌హించాన‌ని.. ఇప్పుడు పారిశ్రామిక వేత్త‌లుగా ప్ర‌తి ఇంటి నుంచి ఒక‌రు కావాల‌ని కోరుకుంటున్న‌ట్టు చెప్పారు. అదేస‌మ‌యంలో ఏఐకి ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు తెలిపారు. ప్ర‌తి ఇంటి నుంచి ఏఐ నిపుణులు రావాల‌ని కోరుకుంటున్న‌ట్టు చెప్పారు.

“కేంద్రంలోని మోడీ.. రాష్ట్రంలోని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌హ‌కారం ఎంతో ఉంది. దీంతో ప‌నులు వేగంగా సాగుతున్నాయ‌న్నారు. ప్ర‌కాశం జిల్లాను సస్య‌శ్యామ‌లం చేసేందుకు ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేస్తామ‌న్న సీఎం.. వెనుక‌బ‌డిన ప్రాంతాల‌కు మ‌రింత ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని తెలిపారు. క‌రువు ప్రాంతాల్లోనూ తాగునీరు ఇస్తున్నామ‌న్నారు. రాయ‌ల‌సీమ ఒక‌ప్పుడు .. రాళ్ల సీమ‌గా మారుతుంద‌ని కొంద‌రు వ్యాఖ్యానించారు. కానీ, ఇప్పుడు ర‌త‌నాల సీమగా మారుస్తున్న‌ట్టు చెప్పారు.

లోకేష్ బాగా క‌ష్ట‌ప‌డుతున్నార‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. ఏచిన్న ఐడియా ఇచ్చినా.. లోకేష్ వెంట‌నే కార్యాచ‌ర‌ణ‌కు దిగుతున్నార‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో రోజుల త‌ర‌బ‌డి కూడా క‌ష్ట‌ప‌డుతున్నార‌ని చెప్పారు. ఆయ‌న క‌ష్టంతోనే అనేక ప‌రిశ్ర‌మ‌లు కూడా వ‌స్తున్నాయ‌ని తెలిపారు. విశాఖ‌లో భారీ ఎత్తున నిర్వ‌హిస్తున్న పెట్టుబ‌డుల స‌ద‌స్సు దీనికి వేదిక కానుంద‌న్నారు. క‌నిగిరి, మార్కాపురం, గిద్ద‌లూరు త‌దిత‌ర ప్రాంతాల‌కు.. గోదావ‌రి-కృష్ణా న‌దుల జ‌లాల‌ను పారించి.. ఇక్క‌డివారికి తాగు, సాగునీరు అందిస్తామ‌న్నారు.

This post was last modified on November 11, 2025 2:46 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Chandrababu

Recent Posts

చరణ్‌పై మచ్చ పడనివ్వని అల్లు శిరీష్

మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…

2 hours ago

టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి?

జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…

2 hours ago

దురంధర్ టీమ్ భలే స్ట్రోక్ ఇచ్చింది

ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన…

2 hours ago

మెక్సికన్ డాన్ ను గర్ల్ఫ్రెండ్ పట్టించిందా..

మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' కథ ముగిసింది.…

4 hours ago

రోమియో రక్తంలో ఏం చూపించబోతున్నారు

న్యాచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ని ఏ దిశగా తీసుకెళ్తున్నాడో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. దసరాతో తెచ్చుకున్న…

5 hours ago

కల్కి 2 ప్లానింగ్… ఒక పద్ధతి ఒక ప్రణాళిక

ప్రభాస్ సినిమాలు సెట్స్ మీద ఎన్ని ఉన్నా ముందుగా ఏది విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. ఆదిపురుష్…

5 hours ago