Political News

మొంథా తుపాను… అంచనాలను మించిన నష్టం

మొంథా తుపాను రాష్ట్రంలో అంచ‌నాల‌కు మించి అపార న‌ష్టం క‌లిగించింద‌ని, కేంద్ర ప్ర‌భుత్వం ఉదార‌త చూపి ఆదుకోవాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్ర బృందాన్ని కోరింది. మొంథా తుపాను వ‌ల్ల రూ.6384 కోట్ల న‌ష్టం వాటిల్లిందని, రూ.901.4 కోట్లు త‌క్ష‌ణ సాయం చేసి ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేసింది. మొంథా తుపాన్ వ‌ల్ల వాటిల్లిన న‌ష్టం మ‌దింపు వేయ‌డానికి కేంద్ర బృందం రాష్ట్రానికి వ‌చ్చింది.

కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్ర‌ట‌రీ పాసుమీబ‌సు, కేంద్ర వ్య‌వ‌సాయ‌, రైతుల సంక్షేమ శాఖ సంచాల‌కులు డాక్ట‌ర్ కె. పొన్నుస్వామీల నేతృత్వంలోని 8 మంది స‌భ్యుల‌తో కూడిన కేంద్ర బృందం సోమ‌వారం ముందుగా అమ‌రావ‌తిలోని స‌చివాల‌యానికి వ‌చ్చింది. బృందానికి స‌చివాల‌యంలోని ఆర్టీజీఎస్ లో అధికారులు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా వివ‌రించారు. మొంథా తుపాన్ రాష్ట్రంలోని 24 జిల్లాల్లో విధ్వంసం సృష్టించింద‌ని తెలిపారు.  

రాష్ట్ర ప్ర‌భుత్వం తుపాను ఎదుర్కోవ‌డానికి ఎంతో ముంద‌స్తు ప్ర‌ణాళిక‌తో వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్ల పెద్ద‌గా ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌కుండా నివారించ‌గ‌లిగామ‌ని అధికారులు వివ‌రించారు. స‌హాయ‌క కార్య‌క్ర‌మాలు కూడా యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చేప‌ట్టామ‌ని తెలిపారు. బుడ‌మేరు వ‌ర‌ద‌ల అనుభ‌వంతో ఈ సారి వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం 680 డ్రోన్లు ఉప‌యోగించామ‌ని చెప్పారు. అక్టోబ‌రు 27-29 వ తేదీల మ‌ధ్య 82.3 మిల్లీ మీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంద‌ని ఇది సాధార‌ణ వ‌ర్ష‌పాతం కంటే 9 రెట్టు ఎక్కువ‌న్నారు.

443 మండ‌లాల్లో ఈ తుపాన్ ప్ర‌భావం చూపించింద‌ని, ఈ విప‌త్తు కార‌ణంగా 3 మృతి చెందార‌ని, 9,960 ఇళ్లు నీట మునిగాయ‌ని, 1,11,402 మంది నిరాశ్ర‌యుల‌య్యార‌ని తెలిపారు. తుపాను స‌హాయ‌క చ‌ర్య‌ల్లో 12 ఎన్డీఆర్ ఎఫ్‌, 13 ఎస్డీఆర్ ఎఫ్ బృందాల‌ను, 1,702 వాహ‌నాల‌ను, 110 మంది ఈత‌గాళ్ల‌ను వినియోగించామ‌ని వెల్ల‌డించారు. 22 జిల్లాల్లో 2,471 పున‌రావాస కేంద్రాల‌ను ఏర్పాటు చేసి1,92,441 మందికి పున‌రావాసం క‌ల్పించామ‌న్నారు.

This post was last modified on November 10, 2025 10:35 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Montha loss

Recent Posts

లక్షన్నర ఫ్లైట్ టికెట్ ఇప్పుడు 9 లక్షలు ఎందుకుంది?

ఎవడో యుద్దం చేసుకోవటం.. మరెవరో దానికి సంబంధించిన మూల్యాన్ని చెల్లించాల్సి రావటం. నిజానికి యుద్దంతో ఇదే తంటా. మనకు ఏ…

2 hours ago

అప్పుడు వైసీపీ.. ఇప్పుడు టీడీపీ… ఎవరీ న‌త్వానీ?

ప‌రిమ‌ళ్ న‌త్వానీ. ఈ పేరు పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు. కానీ, ఈయ‌న పెద్ద పారిశ్రామిక వేత్త‌. ఉత్త‌రాది రాష్ట్రాల్లో ఈయ‌న…

9 hours ago

చాంపియన్ అవుతారనుకుంటే చెత్తగా ఓడారు..

టీ20 వరల్డ్ కప్ 2026 మొదటి సెమీఫైనల్‌లో సౌతాఫ్రికా ప్రయాణం ముగిసింది. అజేయంగా సెమీస్‌కు వచ్చిన ఆ జట్టు.. కీలక…

10 hours ago

ఇండస్ట్రీ చర్చగా మారిన టైటిల్స్ వ్యవహారం

హే భగవాన్ కంటెంట్ చూసి హే బలవంత్ గా మార్చమన్నారు. కపుల్ ఫ్రెండ్లి టైటిల్ లో వేరే అర్థం ఉందని…

10 hours ago

`చిరంజీవి` ఎఫెక్ట్‌… అక్క‌డి పాలిటిక్స్ మార‌తాయా ..!

చిరంజీవి అంటే.. మెగాస్టార్ చిరంజీవి కాదు. ఉత్త‌రాంధ్ర‌లోని ఆముదాల‌వ‌ల‌స మాజీ ఎమ్మెల్యే, మాజీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం కుమారుడు తమ్మినేని…

11 hours ago

శివాజీ జంటని ప్రేక్షకులు అంగీకరిస్తారా

ఒకప్పుడు హీరోగా మంచి మార్కెట్ ఎంజాయ్ చేసిన నటుడు శివాజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయి చాలా సంవత్సరాలయ్యింది. చిరంజీవి…

12 hours ago