Political News

మొంథా తుపాను… అంచనాలను మించిన నష్టం

మొంథా తుపాను రాష్ట్రంలో అంచ‌నాల‌కు మించి అపార న‌ష్టం క‌లిగించింద‌ని, కేంద్ర ప్ర‌భుత్వం ఉదార‌త చూపి ఆదుకోవాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్ర బృందాన్ని కోరింది. మొంథా తుపాను వ‌ల్ల రూ.6384 కోట్ల న‌ష్టం వాటిల్లిందని, రూ.901.4 కోట్లు త‌క్ష‌ణ సాయం చేసి ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేసింది. మొంథా తుపాన్ వ‌ల్ల వాటిల్లిన న‌ష్టం మ‌దింపు వేయ‌డానికి కేంద్ర బృందం రాష్ట్రానికి వ‌చ్చింది.

కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్ర‌ట‌రీ పాసుమీబ‌సు, కేంద్ర వ్య‌వ‌సాయ‌, రైతుల సంక్షేమ శాఖ సంచాల‌కులు డాక్ట‌ర్ కె. పొన్నుస్వామీల నేతృత్వంలోని 8 మంది స‌భ్యుల‌తో కూడిన కేంద్ర బృందం సోమ‌వారం ముందుగా అమ‌రావ‌తిలోని స‌చివాల‌యానికి వ‌చ్చింది. బృందానికి స‌చివాల‌యంలోని ఆర్టీజీఎస్ లో అధికారులు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా వివ‌రించారు. మొంథా తుపాన్ రాష్ట్రంలోని 24 జిల్లాల్లో విధ్వంసం సృష్టించింద‌ని తెలిపారు.  

రాష్ట్ర ప్ర‌భుత్వం తుపాను ఎదుర్కోవ‌డానికి ఎంతో ముంద‌స్తు ప్ర‌ణాళిక‌తో వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్ల పెద్ద‌గా ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌కుండా నివారించ‌గ‌లిగామ‌ని అధికారులు వివ‌రించారు. స‌హాయ‌క కార్య‌క్ర‌మాలు కూడా యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చేప‌ట్టామ‌ని తెలిపారు. బుడ‌మేరు వ‌ర‌ద‌ల అనుభ‌వంతో ఈ సారి వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం 680 డ్రోన్లు ఉప‌యోగించామ‌ని చెప్పారు. అక్టోబ‌రు 27-29 వ తేదీల మ‌ధ్య 82.3 మిల్లీ మీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంద‌ని ఇది సాధార‌ణ వ‌ర్ష‌పాతం కంటే 9 రెట్టు ఎక్కువ‌న్నారు.

443 మండ‌లాల్లో ఈ తుపాన్ ప్ర‌భావం చూపించింద‌ని, ఈ విప‌త్తు కార‌ణంగా 3 మృతి చెందార‌ని, 9,960 ఇళ్లు నీట మునిగాయ‌ని, 1,11,402 మంది నిరాశ్ర‌యుల‌య్యార‌ని తెలిపారు. తుపాను స‌హాయ‌క చ‌ర్య‌ల్లో 12 ఎన్డీఆర్ ఎఫ్‌, 13 ఎస్డీఆర్ ఎఫ్ బృందాల‌ను, 1,702 వాహ‌నాల‌ను, 110 మంది ఈత‌గాళ్ల‌ను వినియోగించామ‌ని వెల్ల‌డించారు. 22 జిల్లాల్లో 2,471 పున‌రావాస కేంద్రాల‌ను ఏర్పాటు చేసి1,92,441 మందికి పున‌రావాసం క‌ల్పించామ‌న్నారు.

This post was last modified on November 10, 2025 10:35 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Montha loss

Recent Posts

దాగుడుమూతల దృశ్యానికి మోక్షం దక్కింది

మోహన్ లాల్ దృశ్యం 3 మరోసారి రిలీజ్ డేట్ ప్రకటించింది. మే 21 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అధికారికంగా…

9 minutes ago

మనసు మారిందా వీరభద్రుడా

బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత సూర్య సినిమాలు వరసగా రాబోతున్నాయి. వాటిలో మొదటిది వీరభద్రుడు. తమిళంలో కరుప్పుగా రూపొందిన…

1 hour ago

తప్పు చేస్తే చంద్రబాబుకి ఎవరైనా ఒకటే

సొంత పార్టీ నాయ‌కుడు త‌ప్పు చేస్తే ఒక‌విధంగా.. ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌లు త‌ప్పులు చేస్తే మ‌రో విధంగా మారి పోయిన…

2 hours ago

సింహాన్ని దాచకుండా మంచి పని చేశారు

మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…

3 hours ago

చరణ్ యష్ అనుకుంటే సత్యదేవ్ వస్తున్నాడు

వెనకటికి పాత కథ ఒకటుంది. ఒక రొట్టె కోసం రెండు పిల్లులు పోట్లాడుకుంటే తీర్పు చెప్పడానికి వచ్చిన కోతి దాన్ని…

4 hours ago

సాయిపల్లవికి ‘ఒక రోజు’ షాక్ ఇస్తుందా

చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసే సాయిపల్లవి కాంబోల కన్నా ఎక్కువగా కంటెంట్ కి ప్రాధాన్యం ఇవ్వడం అందరికీ తెలిసిన…

6 hours ago