Political News

`ఎర్ర‌చంద‌నం`పై ప‌వ‌న్ భేషైన ఆలోచ‌న‌… బాబు కితాబు!

ఎర్ర‌చంద‌నం.. ఏపీలో మాత్ర‌మే.. అది కూడా తిరుప‌తి జిల్లాలోని శేషాచ‌లం అడ‌వుల్లో మాత్ర‌మే ల‌భించే అరుదైన వృక్షాలు. అయితే.. వీటిని అక్ర‌మార్కులు తెగ‌న‌రికి పెద్ద ఎత్తున ర‌వాణా చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి అమాయ‌కులైన ఏపీ, తెలంగాణ పౌరుల‌ను, కూలీల‌ను కూడా వినియోగించుకుంటున్నారు. ఇక‌, అట‌వీ శాఖ అధికారులు ఎర్ర‌చంద‌నం.. అక్ర‌మ ర‌వాణాపై ఉక్కుపాదం మోపి ప‌ట్టుకున్న దుంగ‌లు కూడా ట‌న్నుల కొద్దీ తిరుప‌తి గోడౌన్ల‌లో పేరుకుపోయాయి. వీటిని ఏం చేయాలన్న విష‌యం కూడా స‌ర్కారుకు పెద్ద స‌మ‌స్య‌గా మారింది.

క‌రోనాకు ముందు చెనా, జ‌పాన్ స‌హా ప‌లు దేశాల‌కు చెందిన వ్యాపారులు వ‌చ్చి వీటిని కొనుగోలు చేసేవారు. అయితే.. క‌రోనా అనంత‌రం.. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఎర్ర‌చంద‌నం కొనుగోలు, విక్ర‌యాలు మంద‌గించాయి. దీంతో ప్ర‌భుత్వం వేలం వేసేందుకు ప్ర‌య‌త్నించినా.. కొనుగోలు దారులు ముందుకు రావ‌డం లేదు. గ‌తంలో వైసీపీ ప్ర‌భుత్వం కూడా వేలం ప్ర‌క్రియ‌ను ప్రారంభించి వెన‌క్కి తీసుకుంది. ఈ ప‌రిణామాల‌తో దాదాపు నాలుగు సంవ‌త్స‌రాలుగా ఈ వేలం ప్ర‌క్రియ ముందుకు సాగ‌డం లేదు. మ‌రోవైపు ఎర్ర‌చంద‌నం వృక్షాల‌కు భ‌ద్ర‌త కూడా క‌రువైంది. ఇటీవ‌ల తిరుప‌తి జిల్లాలో ప‌ర్య‌టించిన డిప్యూటీ సీఎం, అట‌వీ శాఖ మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అక్ర‌మ ర‌వాణాదారుల‌కు గ‌ట్టివార్నింగ్ ఇచ్చారు.

ఇదేస‌మ‌యంలో ఆయ‌న తిరుప‌తిలోని గోడౌన్ల‌ను కూడా ప‌రిశీలించారు. భారీ ఎత్తున పేరుకున్న దుంగ‌లను ప‌రిశీలించి వాటి వివ‌రాల‌ను తెలుసుకున్నారు.. వాటి విలువ ఎంత ఉంటుంద‌న్న విష‌యాన్ని కూడా అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా అధికారులు వేలానికి సంబంధించిన స‌మ‌స్య‌లు, అంత‌ర్జాతీయ త‌గ్గిన ధ‌ర‌లు వంటివాటిని వివ‌రించారు. క‌ట్ చేస్తే.. తాజాగా ఈవిష‌యాన్ని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మంత్రివ‌ర్గ స‌మావేశంలో ప్ర‌స్తావించారు.

అంత‌ర్జాతీయంగా వేలం వేసే బ‌దులు.. ప్ర‌స్తుతం ప‌ట్టుకున్న, గోడౌన్ల‌లో ఉన్న ఎర్ర‌చంద‌నం.. దుంగ‌ల‌తో రాష్ట్రంలోని క‌ళాకారుల‌తో బొమ్మ‌లు త‌యారు చేయించాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌తిపాదించారు. వాటిని దేశీయంగానే కాకుండా.. అంత‌ర్జాతీయంగా కూడా.. విక్ర‌యించ‌డం ద్వారా సాధార‌ణ ముడి దుంగ‌ల‌ను విక్ర‌యిస్తే.. వ‌చ్చే సొమ్ముల క‌న్నా రెండింత‌లు సంపాయించుకునే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. అదేస‌మ‌యంలో రాష్ట్రంలోని క‌ళాకారుల‌కు కూడా ప‌నిక‌ల్పించిన‌ట్టు అవుతుంద‌ని సూచించారు. ఈ సూచ‌న‌ల‌కు సీఎం చంద్ర‌బాబు కితాబునిచ్చారు. బాగుంద‌న్నారు. దీనిపై మ‌రింత అధ్య‌య‌నం చేసి నిర్ణ‌యం తీసుకుందామ‌ని వ్యాఖ్యానించారు.

Kumar

Recent Posts

కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో…

33 minutes ago

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

6 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

7 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

9 hours ago

నేను హోమ్ మినిస్టర్ కాకపోవడమే నేరస్తుల అదృష్టం: పవన్

ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…

10 hours ago

సెన్సార్ చిక్కులు చిన్న సినిమాలకేనా

వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…

11 hours ago