Political News

`ఎర్ర‌చంద‌నం`పై ప‌వ‌న్ భేషైన ఆలోచ‌న‌… బాబు కితాబు!

ఎర్ర‌చంద‌నం.. ఏపీలో మాత్ర‌మే.. అది కూడా తిరుప‌తి జిల్లాలోని శేషాచ‌లం అడ‌వుల్లో మాత్ర‌మే ల‌భించే అరుదైన వృక్షాలు. అయితే.. వీటిని అక్ర‌మార్కులు తెగ‌న‌రికి పెద్ద ఎత్తున ర‌వాణా చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి అమాయ‌కులైన ఏపీ, తెలంగాణ పౌరుల‌ను, కూలీల‌ను కూడా వినియోగించుకుంటున్నారు. ఇక‌, అట‌వీ శాఖ అధికారులు ఎర్ర‌చంద‌నం.. అక్ర‌మ ర‌వాణాపై ఉక్కుపాదం మోపి ప‌ట్టుకున్న దుంగ‌లు కూడా ట‌న్నుల కొద్దీ తిరుప‌తి గోడౌన్ల‌లో పేరుకుపోయాయి. వీటిని ఏం చేయాలన్న విష‌యం కూడా స‌ర్కారుకు పెద్ద స‌మ‌స్య‌గా మారింది.

క‌రోనాకు ముందు చెనా, జ‌పాన్ స‌హా ప‌లు దేశాల‌కు చెందిన వ్యాపారులు వ‌చ్చి వీటిని కొనుగోలు చేసేవారు. అయితే.. క‌రోనా అనంత‌రం.. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఎర్ర‌చంద‌నం కొనుగోలు, విక్ర‌యాలు మంద‌గించాయి. దీంతో ప్ర‌భుత్వం వేలం వేసేందుకు ప్ర‌య‌త్నించినా.. కొనుగోలు దారులు ముందుకు రావ‌డం లేదు. గ‌తంలో వైసీపీ ప్ర‌భుత్వం కూడా వేలం ప్ర‌క్రియ‌ను ప్రారంభించి వెన‌క్కి తీసుకుంది. ఈ ప‌రిణామాల‌తో దాదాపు నాలుగు సంవ‌త్స‌రాలుగా ఈ వేలం ప్ర‌క్రియ ముందుకు సాగ‌డం లేదు. మ‌రోవైపు ఎర్ర‌చంద‌నం వృక్షాల‌కు భ‌ద్ర‌త కూడా క‌రువైంది. ఇటీవ‌ల తిరుప‌తి జిల్లాలో ప‌ర్య‌టించిన డిప్యూటీ సీఎం, అట‌వీ శాఖ మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అక్ర‌మ ర‌వాణాదారుల‌కు గ‌ట్టివార్నింగ్ ఇచ్చారు.

ఇదేస‌మ‌యంలో ఆయ‌న తిరుప‌తిలోని గోడౌన్ల‌ను కూడా ప‌రిశీలించారు. భారీ ఎత్తున పేరుకున్న దుంగ‌లను ప‌రిశీలించి వాటి వివ‌రాల‌ను తెలుసుకున్నారు.. వాటి విలువ ఎంత ఉంటుంద‌న్న విష‌యాన్ని కూడా అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా అధికారులు వేలానికి సంబంధించిన స‌మ‌స్య‌లు, అంత‌ర్జాతీయ త‌గ్గిన ధ‌ర‌లు వంటివాటిని వివ‌రించారు. క‌ట్ చేస్తే.. తాజాగా ఈవిష‌యాన్ని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మంత్రివ‌ర్గ స‌మావేశంలో ప్ర‌స్తావించారు.

అంత‌ర్జాతీయంగా వేలం వేసే బ‌దులు.. ప్ర‌స్తుతం ప‌ట్టుకున్న, గోడౌన్ల‌లో ఉన్న ఎర్ర‌చంద‌నం.. దుంగ‌ల‌తో రాష్ట్రంలోని క‌ళాకారుల‌తో బొమ్మ‌లు త‌యారు చేయించాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌తిపాదించారు. వాటిని దేశీయంగానే కాకుండా.. అంత‌ర్జాతీయంగా కూడా.. విక్ర‌యించ‌డం ద్వారా సాధార‌ణ ముడి దుంగ‌ల‌ను విక్ర‌యిస్తే.. వ‌చ్చే సొమ్ముల క‌న్నా రెండింత‌లు సంపాయించుకునే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. అదేస‌మ‌యంలో రాష్ట్రంలోని క‌ళాకారుల‌కు కూడా ప‌నిక‌ల్పించిన‌ట్టు అవుతుంద‌ని సూచించారు. ఈ సూచ‌న‌ల‌కు సీఎం చంద్ర‌బాబు కితాబునిచ్చారు. బాగుంద‌న్నారు. దీనిపై మ‌రింత అధ్య‌య‌నం చేసి నిర్ణ‌యం తీసుకుందామ‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on November 10, 2025 10:32 pm

Share

Recent Posts

ఇరుముడిని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉందా

ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…

3 minutes ago

టాక్సిక్ ఓపెనింగ్స్ ఏ స్థాయిలో ఉంటాయి

రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…

43 minutes ago

లిక్కర్ సొమ్ముతో విదేశాల్లో రియల్ ఎస్టేట్?

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…

2 hours ago

కొండా వివాదాన్ని అధిష్టానానికి వదిలేసిన రేవంత్

``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్క‌టే. పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ విష‌యంలో అంద‌రూ స‌మాన‌మే. ఎవ‌రు ఏం చేశార‌న్న‌ది పార్టీ…

4 hours ago

ఆది నుంచీ.. `కొండా ఫ్యామిలీ` పార్టీల‌కు గుదిబండే!

ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయ‌కులు అసంతృప్తి వ్య‌క్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్ర‌తిపార్టీలోనూ ఇబ్బందులు వ‌స్తే.. ప్ర‌తిపార్టీపైనా…

7 hours ago

ఎల్లమ్మ… దేవి vs ప్రసాద్

‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…

10 hours ago