మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీకి హాజరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి వ్యాఖ్యలు చేశారు. జగన్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అని ఆయన అన్నారు. అసెంబ్లీలో సాధారణ ఎమ్మెల్యేకి ఇచ్చిన సమయమే ఇస్తామన్నారు. నా ముందు అధ్యక్షా అనడం ఇష్టం లేకనే జగన్ అసెంబ్లీకి రావడం లేదన్నారు. ఆయన మీడియా ముందు కాక అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సూచించారు. వైసీపీ ఎమ్యెల్యేలు జీతాలు తీసుకుంటున్నా అసెంబ్లీకి రావడం లేదన్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం పెడపర్తి రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అసెంబ్లీకి వైఎస్ జగన్ హాజరయ్యే అంశంపై ఏడాదిన్నరగా చర్చ సాగుతూనే ఉంది. తనకు ప్రతిపక్ష హౌదా కల్పించాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించగా ఆ అంశం పెండింగ్లో ఉంది. ఆయనతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా హాజరు కావడం లేదు. అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడల్లా ఈ విషయం చర్చకు దారితీస్తోంది.
అసెంబ్లీకి వస్తే మాకు సమయం ఇస్తారా..? సీఎం చంద్రబాబుకు ఇచ్చిన సమయం నాకూ ఇవ్వాలని ఆయన ప్రెస్మీట్లో చెప్పారు. అసెంబ్లీకి వెళ్లలేదని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కలిసి రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళతాం అని ఆయన ఓ సందర్భంలో స్పష్టం చేశారు. దీనిపై మరోసారి స్పీకర్ క్లారిటీ ఇచ్చారిప్పుడు.. నా ముందు అధ్యక్షా అనలేకనే ఆయన అసెంబ్లీకి రాలేక పోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
This post was last modified on November 10, 2025 10:13 pm
కేరళ రాష్ట్రంలో తొలిసారి బీజేపీ విజయం దక్కించుకుంది. కేరళలోని రాజధాని నగరం తిరువనంతపురంలో తాజాగా జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ…
ఏపీ మంత్రి నారా లోకేష్ సతీమణి, నటసింహం బాలయ్య గారాలపట్టి నారా బ్రాహ్మణి అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డును సొంతం చేసుకున్నారు.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం గబ్బర్ సింగ్ ఎంత పెద్ద…
గత ఏడాది ‘మిస్టర్ బచ్చన్’ మూవీతో కథానాయికగా పరిచయం అయింది ముంబయి భామ భాగ్యశ్రీ బోర్సే. ఆ సినిమాలో ప్రోమోల్లో…
ఏపీ బీజేపీలో నాయకుల మధ్య లుకలుకలు ఉన్నాయి. ఒకరంటే ఒకరికి పడకపోవడం.. ఒకరిపై మరొకరు ఆధిపత్య రాజకీయాలు చేయడం వంటివి…
బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలో ఉండాలో.. ఏ పార్టీ…