తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పెద్ద టెస్టే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 20 నెలలకు పైగా సాగుతున్న `ఇందిరమ్మ` పాలనలో ప్రజలకు ఎన్నో మేళ్లు చేశామని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డికి ఈ ఉప ఎన్నిక ప్రధాన పరీక్ష పెడుతోందన్న వాదన పార్టీ వర్గాల్లోనూ వినిపిస్తోంది. అయితే.. ఎన్నికలన్నాక.. గెలుపు-ఓటమి సహజం. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారు? అనే విషయాలు ప్రజల భావోద్వేగాలపై ఆధారపడి ఉంటుంది.
పైగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. సెంటిమెంటుతో కూడికున్న నేపథ్యంలో కాంగ్రెస్ గెలుస్తుందా? ఓడుతుందా? అనే విషయం కూడా ఎవరినాడికీ అందడం లేదు. అయితే.. ఒకటి మాత్రం వాస్తవం.. గెలిచినా.. ఓడినా.. సీఎం రేవంత్ రెడ్డికి ఇదొక లిట్మస్ టెస్టు అనే అంటున్నారు పరిశీలకులు. ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే.. పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి ప్రజలు అనుకూలంగా ఉన్నారని భావించే పరిస్థితి ఉన్నా.. వచ్చే ఓటు బ్యాంకును బట్టి ప్రభుత్వ పనితీరులో మరింత మెరుగుపడాల్సిన సందేశాన్ని ప్రజలు ఇచ్చే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
ప్రజలకు మరింత చేరువ కావడంతోపాటు.. ప్రజలు ఎక్కడ ఏమేరకు తేడా చూపించారన్న విషయాన్ని అంచనా వేసుకుని దానిని సరిచేసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏర్పడుతుంది. ముఖ్యం గా సీఎం రేవంత్ రెడ్డి మార్పుల దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక, ఏదైనా తేడా వచ్చి పరాజయం పాలైనా.. ప్రభుత్వ పనితీరు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మరింతగాజాగ్రత్తలు తీసుకోవడంతోపాటు.. ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలను సమీక్షించుకో వాల్సిన పరిస్థితి ఉంటుంది.
వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు దాదాపు ఇక ఎన్నికలకు అవకాశం లేనందున(స్థానికం మినహా) ఈ ఉప ఎన్నిక ప్రభుత్వానికి.. ఒక అవకాశంగా మారనుందని పరిశీలకులు చెబుతున్నారు. గెలిచినా.. ఓడినా.. సీఎం రేవంత్ రెడ్డి పనితీరుకు ఉప పోరు లిట్మస్ టెస్టు వంటిదేనని అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటిని పార్టీపరంగా, ప్రభుత్వ పరంగా ఆయన మార్పులు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.
సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకడు. తెలుగు వరకు చూస్తే కొన్నేళ్ల నుంచి అతనే నంబర్ వన్.…
స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…
దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…
అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఇరుముడి ఆగస్ట్ 21 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఒక టీజర్ రూపంలో…
ఎప్పుడో గజిని తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ మళ్ళీ చూడలేకపోయాననే సూర్య కొరతని కరుప్పు మూడు వందల కోట్లు…