వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కూటమి పార్టీలు వచ్చే 15 సంవత్సరాలు మాత్రమే కాదని.. జీవితాంతం కలిసి ఉండాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. అంతేకాదు.. జీవితాంతం కూటమిగా ఉంటేనే వైసీపీకి మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా ఉండాలని.. గత ఎన్నికల్లో కూటమి కట్టారన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే కూటమి కొనసాగాలని కోరుకుంటున్నామన్నారు.
తద్వారా.. వ్యతిరేక ఓటు బ్యాంకు తమకు పడుతుందని జోస్యం చెప్పారు. “వచ్చే 15 ఏళ్లేంఖర్మ.. జీవితాంతం కలిసి ఉండాలి. అలా ఉండాలనే మేం కోరుకుంటాం. అలా ఉంటేనే మాకు కూడా మంచిది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు.. ఆయన దగ్గర పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. రేపు నారా లోకేష్ ముఖ్యమంత్రి అయ్యాక.. ఆయన దగ్గర కూడా పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండాలనే కోరుకుంటున్నాం.“ అని వ్యాఖ్యానించారు.
ఇక, నారా లోకేష్ను `పిల్ల` నాయకుడిగా అభివర్ణించిన అంబటి.. ఆయన బెదిరింపులకు వైసీపీలో ఉన్న ఏ ఒక్కరూ బెదిరి పోరని చెప్పారు. అనంతపురంలో పర్యటించిన నారా లోకేష్.. గతంలో తమను వేధించిన వారిని వదిలి పెట్టేది లేదని.. జైళ్లకు పంపిస్తామని వైసీపీ నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ప్రస్తావించిన అంబటి.. “ఏం చేస్తారో చేసుకోండి.. మహా అయితే.. జైళ్లకు పంపిస్తారు.. జైల్లో ప్రాణాలు తీస్తారా? ఏంటి?“ అని ప్రశ్నించారు.
అంతేకాదు.. జైళ్లు తమకు కొత్తకాదని చెప్పారు. గతంలో జగన్ జైల్లో ఉండే బయటకు వచ్చారని, చంద్రబాబు కూడా జైల్లో ఉండే బయటకు వచ్చారని అంబటి వ్యాఖ్యానించారు. “మీరు జైల్లో పెడితే.. మేం అక్కడే ఉండిపోతామా? బయటకు రాలేమా?“ అని వ్యాఖ్యానించారు. “ఇప్పుడు మీరు అధికారంలో రేపు మేం వస్తే ఏం జరుగుతుందో ఆలోచించుకోండి.“ అని పరోక్షంగా హెచ్చరించారు. పోలీసులను తమ రాజకీయ ప్రత్యర్థులపై అస్త్రాలుగా వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
This post was last modified on November 8, 2025 6:48 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…