వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కూటమి పార్టీలు వచ్చే 15 సంవత్సరాలు మాత్రమే కాదని.. జీవితాంతం కలిసి ఉండాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. అంతేకాదు.. జీవితాంతం కూటమిగా ఉంటేనే వైసీపీకి మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా ఉండాలని.. గత ఎన్నికల్లో కూటమి కట్టారన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే కూటమి కొనసాగాలని కోరుకుంటున్నామన్నారు.
తద్వారా.. వ్యతిరేక ఓటు బ్యాంకు తమకు పడుతుందని జోస్యం చెప్పారు. “వచ్చే 15 ఏళ్లేంఖర్మ.. జీవితాంతం కలిసి ఉండాలి. అలా ఉండాలనే మేం కోరుకుంటాం. అలా ఉంటేనే మాకు కూడా మంచిది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు.. ఆయన దగ్గర పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. రేపు నారా లోకేష్ ముఖ్యమంత్రి అయ్యాక.. ఆయన దగ్గర కూడా పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండాలనే కోరుకుంటున్నాం.“ అని వ్యాఖ్యానించారు.
ఇక, నారా లోకేష్ను `పిల్ల` నాయకుడిగా అభివర్ణించిన అంబటి.. ఆయన బెదిరింపులకు వైసీపీలో ఉన్న ఏ ఒక్కరూ బెదిరి పోరని చెప్పారు. అనంతపురంలో పర్యటించిన నారా లోకేష్.. గతంలో తమను వేధించిన వారిని వదిలి పెట్టేది లేదని.. జైళ్లకు పంపిస్తామని వైసీపీ నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ప్రస్తావించిన అంబటి.. “ఏం చేస్తారో చేసుకోండి.. మహా అయితే.. జైళ్లకు పంపిస్తారు.. జైల్లో ప్రాణాలు తీస్తారా? ఏంటి?“ అని ప్రశ్నించారు.
అంతేకాదు.. జైళ్లు తమకు కొత్తకాదని చెప్పారు. గతంలో జగన్ జైల్లో ఉండే బయటకు వచ్చారని, చంద్రబాబు కూడా జైల్లో ఉండే బయటకు వచ్చారని అంబటి వ్యాఖ్యానించారు. “మీరు జైల్లో పెడితే.. మేం అక్కడే ఉండిపోతామా? బయటకు రాలేమా?“ అని వ్యాఖ్యానించారు. “ఇప్పుడు మీరు అధికారంలో రేపు మేం వస్తే ఏం జరుగుతుందో ఆలోచించుకోండి.“ అని పరోక్షంగా హెచ్చరించారు. పోలీసులను తమ రాజకీయ ప్రత్యర్థులపై అస్త్రాలుగా వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
This post was last modified on November 8, 2025 6:48 pm
ఇటీవలే కాంతారావు పురస్కారం అందుకున్న సందర్భంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తమిళ లెజెండరీ నటులు ఎంజీఆర్ ని ఉద్దేశించి అన్న…
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…