Political News

ఏపీపై పెట్టుబ‌డుల క‌నక వ‌ర్షం.. 4 గంట‌ల్లో ల‌క్ష కోట్లు!

కేవ‌లం 4 గంట‌ల చ‌ర్చ‌లు.. సీఎం చంద్ర‌బాబు ఇచ్చిన భ‌రోసా.. ఇంకేముంది.. ఏపీపై మ‌రో ల‌క్ష కోట్ల రూపాయ‌ల పైచిలుకు.. పెట్టుబ‌డుల క‌నక వ‌ర్షం కురిసింది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన పెట్టుబ‌డుల ప్ర‌య‌త్నాలు.. ఒక ఎత్త‌యితే, తాజాగా ఒక్క శుక్ర‌వారం రోజే.. కేవ‌లం 4 గంట‌ల్లోనే భారీసంఖ్య‌లో సంస్థ‌లు, పారిశ్రామిక వేత్త‌లు ముందుకు రావ‌డం.. పెట్టుబ‌డులు పెట్టేందుకు అంగీక రించ‌డం.. త‌ద్వారా ఉద్యోగాల క‌ల్ప‌న‌కు మార్గం సుగ‌మం కావ‌డం.. వెంట వెంట‌నే జ‌రిగిపోయాయి. దీంతో సీఎం చంద్ర‌బాబు సంతోషం వ్య‌క్తం చేశారు.

ఏం జ‌రిగింది?

శుక్ర‌వారం.. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల మ‌ధ్య సీఎం చంద్ర‌బాబు.. రాష్ట్ర స్థాయి పెట్టుబ‌డుల ప్రోత్సాహ‌క మండ‌లి(ఎస్ ఐ పీబీ-స్టేట్ లెవిల్ ఇన్వెస్ట్‌మెంట్ పాజిబిలిటీ బోర్డ్‌) స‌మావేశం నిర్వ‌హించారు. దీనికి భారీ సంఖ్య‌లో పారిశ్రామిక వేత్త‌లు.. పెట్టుబ‌డిదారులు హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్భంగా ఏపీలో ఉన్న అవ‌కాశాల‌ను వారికి సీఎం వివ‌రించారు. రాష్ట్రంలో క్ల‌స్ట‌ర్ల వారీగా పెట్టుబ‌డులు పెట్టాల‌ని.. వారికి సూచించారు. ప్ర‌భుత్వం ఇచ్చే ప్రోత్సాహ‌కాల‌ను వారికి వివ‌రించారు. భూమి, నీరు, విద్యుత్ స‌హా ప‌న్నుల విష‌యంలో సానుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌న్నారు. రాష్ట్రంలో 3 మెగా సిటీలు, 15 పారిశ్రామిక‌ జోన్లను అభివృద్ధి చేయ‌నున్న‌ట్టు సీఎం వారికి వివ‌రించారు.

దీనికి ముగ్ధులైన చాలా మంది పారిశ్రామిక వేత్త‌లు.. అక్క‌డిక‌క్క‌డే త‌మ ప్ర‌ణాళిక‌లు వివ‌రించారు. పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చారు. వీరిలో రిలయన్స్ 202 కోట్ల పెట్టుబ‌డులు పెట్టేందుకు ఓకేచెప్పింది. త‌ద్వారా 436 మందికి ఉద్యోగాలు ల‌భించ‌నున్నాయి. ఎపిటోమ్ కాంపోనెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 700 కోట్లతో ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేయ‌నుంది. దీనివ‌ల్ల వెయ్యి ఉద్యోగాలు ల‌భిస్తాయి. ఎన్‌పీఎస్‌పీఎల్‌ అడ్వాన్స్ మెటీరియల్ ప్రైవేట్ లిమిటెడ్ భారీగా 2,081 కోట్లు పెట్టుబ‌డి పెట్ట‌నుంది. దీనివ‌ల్ల 600 మందికి ఉద్యోగాలను అందించ‌నున్నారు.

అదేవిధంగా క్రయాన్ టెక్నాలజీ లిమిటెడ్, ఎస్‌సీఐసీ వెంచర్స్ ఎల్ఎల్పీ, ఇండిచిప్ సెమీ కండక్టర్స్‌ లిమిటెడ్, మథర్సన్ టెక్నాలజీ సర్వీస్ లిమిటెడ్, రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్ 7 వేల కోట్ల పెట్టుబ‌డికి అంగీకారం తెలిపింది. ఇలా ప‌లు సంస్థ‌లు ముందుకు వ‌చ్చాయి. వీటి ద్వారా మొత్తంగా లక్ష కోట్ల రూపాయ‌ల పైచిలుకు ఒప్పందాలు జ‌రిగాయి. వీటి వ‌ల్ల 85 వేల మందికిపైగా ఉద్యోగాలు ల‌భించ‌నున్నాయి.

This post was last modified on November 8, 2025 12:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజేంద్రుల వారిని వదిలేలా లేరు

ఇటీవలే కాంతారావు పురస్కారం అందుకున్న సందర్భంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తమిళ లెజెండరీ నటులు ఎంజీఆర్ ని ఉద్దేశించి అన్న…

40 minutes ago

వేగం పెంచాలోయ్ ‘బైకర్’ సాబ్

జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…

1 hour ago

క్యాసినో కింగ్‌కు బీజేపీ కీల‌క ప‌ద‌వి?

`క్యాసినో కింగ్‌`గా గుర్తింపు తెచ్చుకుని వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ను అక్ర‌మంగా ఆర్జించార‌న్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్ర‌వీణ్‌కు బీజేపీ కీల‌క…

7 hours ago

‘కల్కి’పై విమర్శలకు కట్టుబడి ఉన్న లిరిసిస్ట్

ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…

8 hours ago

మోనాలిసా పెళ్లి… లవ్ జిహాద్ కాదట

గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన…

10 hours ago

ఇరాన్ పై యుద్ధం… ట్రంప్ కొంప ముంచుతుందా?

ఇరాన్‌తో యుద్ధం విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా?  నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…

11 hours ago