Political News

ఏపీపై పెట్టుబ‌డుల క‌నక వ‌ర్షం.. 4 గంట‌ల్లో ల‌క్ష కోట్లు!

కేవ‌లం 4 గంట‌ల చ‌ర్చ‌లు.. సీఎం చంద్ర‌బాబు ఇచ్చిన భ‌రోసా.. ఇంకేముంది.. ఏపీపై మ‌రో ల‌క్ష కోట్ల రూపాయ‌ల పైచిలుకు.. పెట్టుబ‌డుల క‌నక వ‌ర్షం కురిసింది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన పెట్టుబ‌డుల ప్ర‌య‌త్నాలు.. ఒక ఎత్త‌యితే, తాజాగా ఒక్క శుక్ర‌వారం రోజే.. కేవ‌లం 4 గంట‌ల్లోనే భారీసంఖ్య‌లో సంస్థ‌లు, పారిశ్రామిక వేత్త‌లు ముందుకు రావ‌డం.. పెట్టుబ‌డులు పెట్టేందుకు అంగీక రించ‌డం.. త‌ద్వారా ఉద్యోగాల క‌ల్ప‌న‌కు మార్గం సుగ‌మం కావ‌డం.. వెంట వెంట‌నే జ‌రిగిపోయాయి. దీంతో సీఎం చంద్ర‌బాబు సంతోషం వ్య‌క్తం చేశారు.

ఏం జ‌రిగింది?

శుక్ర‌వారం.. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల మ‌ధ్య సీఎం చంద్ర‌బాబు.. రాష్ట్ర స్థాయి పెట్టుబ‌డుల ప్రోత్సాహ‌క మండ‌లి(ఎస్ ఐ పీబీ-స్టేట్ లెవిల్ ఇన్వెస్ట్‌మెంట్ పాజిబిలిటీ బోర్డ్‌) స‌మావేశం నిర్వ‌హించారు. దీనికి భారీ సంఖ్య‌లో పారిశ్రామిక వేత్త‌లు.. పెట్టుబ‌డిదారులు హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్భంగా ఏపీలో ఉన్న అవ‌కాశాల‌ను వారికి సీఎం వివ‌రించారు. రాష్ట్రంలో క్ల‌స్ట‌ర్ల వారీగా పెట్టుబ‌డులు పెట్టాల‌ని.. వారికి సూచించారు. ప్ర‌భుత్వం ఇచ్చే ప్రోత్సాహ‌కాల‌ను వారికి వివ‌రించారు. భూమి, నీరు, విద్యుత్ స‌హా ప‌న్నుల విష‌యంలో సానుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌న్నారు. రాష్ట్రంలో 3 మెగా సిటీలు, 15 పారిశ్రామిక‌ జోన్లను అభివృద్ధి చేయ‌నున్న‌ట్టు సీఎం వారికి వివ‌రించారు.

దీనికి ముగ్ధులైన చాలా మంది పారిశ్రామిక వేత్త‌లు.. అక్క‌డిక‌క్క‌డే త‌మ ప్ర‌ణాళిక‌లు వివ‌రించారు. పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చారు. వీరిలో రిలయన్స్ 202 కోట్ల పెట్టుబ‌డులు పెట్టేందుకు ఓకేచెప్పింది. త‌ద్వారా 436 మందికి ఉద్యోగాలు ల‌భించ‌నున్నాయి. ఎపిటోమ్ కాంపోనెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 700 కోట్లతో ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేయ‌నుంది. దీనివ‌ల్ల వెయ్యి ఉద్యోగాలు ల‌భిస్తాయి. ఎన్‌పీఎస్‌పీఎల్‌ అడ్వాన్స్ మెటీరియల్ ప్రైవేట్ లిమిటెడ్ భారీగా 2,081 కోట్లు పెట్టుబ‌డి పెట్ట‌నుంది. దీనివ‌ల్ల 600 మందికి ఉద్యోగాలను అందించ‌నున్నారు.

అదేవిధంగా క్రయాన్ టెక్నాలజీ లిమిటెడ్, ఎస్‌సీఐసీ వెంచర్స్ ఎల్ఎల్పీ, ఇండిచిప్ సెమీ కండక్టర్స్‌ లిమిటెడ్, మథర్సన్ టెక్నాలజీ సర్వీస్ లిమిటెడ్, రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్ 7 వేల కోట్ల పెట్టుబ‌డికి అంగీకారం తెలిపింది. ఇలా ప‌లు సంస్థ‌లు ముందుకు వ‌చ్చాయి. వీటి ద్వారా మొత్తంగా లక్ష కోట్ల రూపాయ‌ల పైచిలుకు ఒప్పందాలు జ‌రిగాయి. వీటి వ‌ల్ల 85 వేల మందికిపైగా ఉద్యోగాలు ల‌భించ‌నున్నాయి.

This post was last modified on November 8, 2025 12:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

1 hour ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

2 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

2 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

3 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago