Political News

ఏపీపై పెట్టుబ‌డుల క‌నక వ‌ర్షం.. 4 గంట‌ల్లో ల‌క్ష కోట్లు!

కేవ‌లం 4 గంట‌ల చ‌ర్చ‌లు.. సీఎం చంద్ర‌బాబు ఇచ్చిన భ‌రోసా.. ఇంకేముంది.. ఏపీపై మ‌రో ల‌క్ష కోట్ల రూపాయ‌ల పైచిలుకు.. పెట్టుబ‌డుల క‌నక వ‌ర్షం కురిసింది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన పెట్టుబ‌డుల ప్ర‌య‌త్నాలు.. ఒక ఎత్త‌యితే, తాజాగా ఒక్క శుక్ర‌వారం రోజే.. కేవ‌లం 4 గంట‌ల్లోనే భారీసంఖ్య‌లో సంస్థ‌లు, పారిశ్రామిక వేత్త‌లు ముందుకు రావ‌డం.. పెట్టుబ‌డులు పెట్టేందుకు అంగీక రించ‌డం.. త‌ద్వారా ఉద్యోగాల క‌ల్ప‌న‌కు మార్గం సుగ‌మం కావ‌డం.. వెంట వెంట‌నే జ‌రిగిపోయాయి. దీంతో సీఎం చంద్ర‌బాబు సంతోషం వ్య‌క్తం చేశారు.

ఏం జ‌రిగింది?

శుక్ర‌వారం.. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల మ‌ధ్య సీఎం చంద్ర‌బాబు.. రాష్ట్ర స్థాయి పెట్టుబ‌డుల ప్రోత్సాహ‌క మండ‌లి(ఎస్ ఐ పీబీ-స్టేట్ లెవిల్ ఇన్వెస్ట్‌మెంట్ పాజిబిలిటీ బోర్డ్‌) స‌మావేశం నిర్వ‌హించారు. దీనికి భారీ సంఖ్య‌లో పారిశ్రామిక వేత్త‌లు.. పెట్టుబ‌డిదారులు హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్భంగా ఏపీలో ఉన్న అవ‌కాశాల‌ను వారికి సీఎం వివ‌రించారు. రాష్ట్రంలో క్ల‌స్ట‌ర్ల వారీగా పెట్టుబ‌డులు పెట్టాల‌ని.. వారికి సూచించారు. ప్ర‌భుత్వం ఇచ్చే ప్రోత్సాహ‌కాల‌ను వారికి వివ‌రించారు. భూమి, నీరు, విద్యుత్ స‌హా ప‌న్నుల విష‌యంలో సానుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌న్నారు. రాష్ట్రంలో 3 మెగా సిటీలు, 15 పారిశ్రామిక‌ జోన్లను అభివృద్ధి చేయ‌నున్న‌ట్టు సీఎం వారికి వివ‌రించారు.

దీనికి ముగ్ధులైన చాలా మంది పారిశ్రామిక వేత్త‌లు.. అక్క‌డిక‌క్క‌డే త‌మ ప్ర‌ణాళిక‌లు వివ‌రించారు. పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చారు. వీరిలో రిలయన్స్ 202 కోట్ల పెట్టుబ‌డులు పెట్టేందుకు ఓకేచెప్పింది. త‌ద్వారా 436 మందికి ఉద్యోగాలు ల‌భించ‌నున్నాయి. ఎపిటోమ్ కాంపోనెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 700 కోట్లతో ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేయ‌నుంది. దీనివ‌ల్ల వెయ్యి ఉద్యోగాలు ల‌భిస్తాయి. ఎన్‌పీఎస్‌పీఎల్‌ అడ్వాన్స్ మెటీరియల్ ప్రైవేట్ లిమిటెడ్ భారీగా 2,081 కోట్లు పెట్టుబ‌డి పెట్ట‌నుంది. దీనివ‌ల్ల 600 మందికి ఉద్యోగాలను అందించ‌నున్నారు.

అదేవిధంగా క్రయాన్ టెక్నాలజీ లిమిటెడ్, ఎస్‌సీఐసీ వెంచర్స్ ఎల్ఎల్పీ, ఇండిచిప్ సెమీ కండక్టర్స్‌ లిమిటెడ్, మథర్సన్ టెక్నాలజీ సర్వీస్ లిమిటెడ్, రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్ 7 వేల కోట్ల పెట్టుబ‌డికి అంగీకారం తెలిపింది. ఇలా ప‌లు సంస్థ‌లు ముందుకు వ‌చ్చాయి. వీటి ద్వారా మొత్తంగా లక్ష కోట్ల రూపాయ‌ల పైచిలుకు ఒప్పందాలు జ‌రిగాయి. వీటి వ‌ల్ల 85 వేల మందికిపైగా ఉద్యోగాలు ల‌భించ‌నున్నాయి.

Satya

Recent Posts

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.…

27 minutes ago

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

57 minutes ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

2 hours ago

మ్యాజిక్ చేయడానికి బుల్లితెరకు వెళ్తున్నారు

రెగ్యులర్ గా టాలీవుడ్ ని ఫాలో అయ్యేవాళ్ళకు మ్యాజిక్ అంటే వెంటనే గుర్తొచ్చే కాంబినేషన్ గౌతమ్ తిన్ననూరి - అనిరుద్…

2 hours ago

స్పందించిన బన్నీ… సర్దుకుంటాయా అన్నీ

మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…

4 hours ago

ప్యారడైజ్ కొత్త ముహూర్తం ఫిక్సయ్యిందా

ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…

4 hours ago