జూబ్లీహిల్స్ ఎన్నికల పోలింగ్ మరో నాలుగు రోజుల్లో ఉందనగా.. బీఆర్ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ కేంద్రంగా దివంగత మాగంటి గోపీనాథ్ మాతృమూర్తి.. మాగంటి మహానంద కుమారి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడి మరణంపై వాస్తవాలను వెల్లడించాలని కేటీఆర్ను ఆమె డిమాండ్ చేశారు. చివరి క్షణాల్లో కన్నకొడుకును చూడనీయకుండా చేశాడని కేటీఆర్పై ఆరోపణలు చేశా రు.
గోపీనాథ్.. ఆసుపత్రిలో ఉన్నప్పుడు.. కూడా తనకు చెప్పలేదని, ఆయన గురించి ఎవరో చెబితే తెలుసుకుని ఆసుపత్రికి వెళ్లినా.. లోపలికి రాకుండా తనను అడ్డుకున్నారని కుమారి వ్యాఖ్యానించారు. తర్వాత.. తాను స్వయంగా కేటీఆర్… తన కుమారుడిని చూడాలని వేడుకున్నట్టు చెప్పారు. అయితే.. ఆయన పట్టించుకోకుండా, కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా తలుపులు వేసేసుకుని వెళ్లిపోయారన్నారు.
ఐసీయూలో మూడు రోజుల పాటు ఉన్నారని.. మాగంటి చనిపోయిన విషయాన్ని కూడా తమకు చెప్పకుండా దాచారని అన్నారు. ఈ విషయంపై తమకు కేటీఆర్ సమాధానం చెప్పాలని మహానంద కుమారి డిమాండ్ చేశారు. శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ఆమె..ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ను మాగంటి సునీతకుఇవ్వడంపై విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
సునీత, కేటీఆర్లు కలిసి.. తనను ఐసీయూలోకి కూడా రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.
“ఆసుపత్రి అధికారులు తల్లి అయినప్పటికీ నన్ను అనుమతించవద్దని వారి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. గోపీనాథ్ ఆసుపత్రిలో చేరిన విషయం కూడా నాకు తెలియజేయలేదు. ఒకసారి, నేను ఐసియు బయట వేచి ఉండి, అనుకోకుండా కెటిఆర్ను కలిశాను. నా కొడుకును చూడటానికి నన్ను అనుమతించమని అభ్యర్థించినప్పటికీ, అతను తలుపు మూసివేసి వెళ్లిపోయాడు,”అని ఆమె వ్యాఖ్యానించారు.
తన కుమారుడి మరణంపైనా కేటీఆర్ స్పందించాలని మహానంద కుమారి డిమాండ్ చేశారు. ఇదిలా వుంటే.. గోపీనాథ్ మరణం అనంతరం.. ఆరునెలల తర్వాత కావాలనే రాజకీయం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతల ఎదురుదాడికి దిగారు. పోలింగ్ కు నాలుగైదు రోజులముందు కుట్రలు చేస్తున్నారని.. ఓటమి భయంతోనే అధికార పార్టీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.
మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…
ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…