జూబ్లీహిల్స్ ఎన్నికల పోలింగ్ మరో నాలుగు రోజుల్లో ఉందనగా.. బీఆర్ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ కేంద్రంగా దివంగత మాగంటి గోపీనాథ్ మాతృమూర్తి.. మాగంటి మహానంద కుమారి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడి మరణంపై వాస్తవాలను వెల్లడించాలని కేటీఆర్ను ఆమె డిమాండ్ చేశారు. చివరి క్షణాల్లో కన్నకొడుకును చూడనీయకుండా చేశాడని కేటీఆర్పై ఆరోపణలు చేశా రు.
గోపీనాథ్.. ఆసుపత్రిలో ఉన్నప్పుడు.. కూడా తనకు చెప్పలేదని, ఆయన గురించి ఎవరో చెబితే తెలుసుకుని ఆసుపత్రికి వెళ్లినా.. లోపలికి రాకుండా తనను అడ్డుకున్నారని కుమారి వ్యాఖ్యానించారు. తర్వాత.. తాను స్వయంగా కేటీఆర్… తన కుమారుడిని చూడాలని వేడుకున్నట్టు చెప్పారు. అయితే.. ఆయన పట్టించుకోకుండా, కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా తలుపులు వేసేసుకుని వెళ్లిపోయారన్నారు.
ఐసీయూలో మూడు రోజుల పాటు ఉన్నారని.. మాగంటి చనిపోయిన విషయాన్ని కూడా తమకు చెప్పకుండా దాచారని అన్నారు. ఈ విషయంపై తమకు కేటీఆర్ సమాధానం చెప్పాలని మహానంద కుమారి డిమాండ్ చేశారు. శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ఆమె..ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ను మాగంటి సునీతకుఇవ్వడంపై విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
సునీత, కేటీఆర్లు కలిసి.. తనను ఐసీయూలోకి కూడా రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.
“ఆసుపత్రి అధికారులు తల్లి అయినప్పటికీ నన్ను అనుమతించవద్దని వారి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. గోపీనాథ్ ఆసుపత్రిలో చేరిన విషయం కూడా నాకు తెలియజేయలేదు. ఒకసారి, నేను ఐసియు బయట వేచి ఉండి, అనుకోకుండా కెటిఆర్ను కలిశాను. నా కొడుకును చూడటానికి నన్ను అనుమతించమని అభ్యర్థించినప్పటికీ, అతను తలుపు మూసివేసి వెళ్లిపోయాడు,”అని ఆమె వ్యాఖ్యానించారు.
తన కుమారుడి మరణంపైనా కేటీఆర్ స్పందించాలని మహానంద కుమారి డిమాండ్ చేశారు. ఇదిలా వుంటే.. గోపీనాథ్ మరణం అనంతరం.. ఆరునెలల తర్వాత కావాలనే రాజకీయం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతల ఎదురుదాడికి దిగారు. పోలింగ్ కు నాలుగైదు రోజులముందు కుట్రలు చేస్తున్నారని.. ఓటమి భయంతోనే అధికార పార్టీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.
This post was last modified on November 7, 2025 9:43 am
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…
మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…
రాజమండ్రి జైలు నుంచి 18 రోజుల రిమాండ్ అనంతరం విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకు ర్యాలీగా బయలుదేరగా…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దురంధర్-2’ ఒకటనడంలో సందేహం లేదు. గత ఏడాది ఓ మోస్తరు అంచనాల మధ్య…