Political News

బీఆర్ఎస్ ‘హైడ్రా’ బాణం ఫలితాన్నిస్తుందా?

తరాలు మారాయి…రాజకీయాలు మారాయి…ఎన్నికల తీరు మారింది…ఎన్నికలలో నేతల ప్రలోభాలు..ఓటర్ల లాభాల లెక్కలూ మారాయి…అదే విధంగా ఎన్నికల ప్రచారం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. సోషల్ మీడియాను ఓ రేంజ్ లో వాడేస్తున్న రాజకీయ నాయకులు…ప్రత్యర్థులపై విమర్శలు సంధించేందుకు వినూత్న ప్రచారానికి తెర తీస్తున్నారు. ఆ క్రమంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వినూత్న ప్రయోగం వైరల్ గా మారింది. మాజీ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్…టెక్నాలజీతో ఈ ఎన్నికల ప్రచారాన్ని నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్లారు.

తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన హైడ్రా వ్యవహారాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా కేటీఆర్ మలుచుకున్నారు. అంతేకాదు, హైడ్రా ద్వారా నష్టపోయిన ప్రజలవాణిని స్వయంగా వినిపిస్తూ జూబ్లీహిల్స్ ఓటర్లను కేటీఆర్ ఆకట్టుకుంటున్నారు. ఎన్నికల ప్రచార సభలో, రోడ్ షోలల్ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి మరీ హైడ్రా బాధితుల గోడును జనానికి వినిపిస్తున్నారు. తమ ఇళ్లు కూల్చడంతో నిలువ నీడ లేకుండా నడిరోడ్డు మీదకు వచ్చామని హైడ్రా బాధిత మహిళలు కన్నీటి పర్యంతమవుతున్న వీడియోలను ప్లే చేస్తున్నారు.

ఈ ఎన్నికల ప్రచారంలో దాదాపుగా తన ప్రతి ప్రసంగంలో హైడ్రా ప్రస్తావన తెస్తున్నారు కేటీఆర్. హైడ్రా పేరుతో హైదరాబాద్ లో వేలాది మంది ఇళ్లు కూల్చారని, హైడ్రా రాకాసి బోరబండ గల్లీలోకి రాకూడదంటే కారు గుర్తుకు ఓటేయాలని ఆయన కోరుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ గరీబోళ్ల ఇళ్లు కూల్చిన కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకపాలనను ప్రజలు గుర్తించారని, అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి సునీతను గెలిపించాలని కోరారు. అయితే, హైడ్రా కూల్చివేతల అంశం బీఆర్ఎస్ కు కలిసి వస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.

This post was last modified on November 4, 2025 11:08 am

Share
Show comments
Published by
Kumar
Tags: HYDRAAKTR

Recent Posts

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

40 minutes ago

మోదీ స్కిన్ టోన్… అక్కడ తెలుపు.. ఇక్కడ నలుపా?

ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…

43 minutes ago

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…

1 hour ago

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…

2 hours ago

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

3 hours ago

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…

4 hours ago