కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మత్రి జోగి రమేష్ ను సిట్ అధికారులు నిన్న ఉదయం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వంపై బురదజల్లేందుకు జోగి రమేష్ ఈ కల్తీ మద్యం వ్యాపారానికి తెర తీశారని జనార్ధన రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు జోగిని అరెస్టు చేశారు. ఆ తర్వాత దాదాపు 11 గంటలపాటు జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు రామును సిట్ అధికారులు, పోలీసులు వేర్వేరుగా విచారణ జరిపారు. అయితే, ప్రశ్న ఏదైనా సరే జోగి రమేష్ సమాధానం మాత్రం..తెలీదు..గుర్తులేదు…అని తెలుస్తోంది.
తనకు ఈ కేసుతో సంబంధం లేదని, అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు తనకు సమాధానలు తెలీదని జోగి రమేష్ అన్నారట. చంద్రబాబు ఇంటిపైకి తాను వెళ్లినందుకే ఈ కేసులో ఇరికించారని, తన కుమారుడిని అగ్రిగోల్డ్ భూముల కేసులో కక్షపూరితంగా ఇరికించారని చెప్పారట. ఇక, ఈ కేసులో ఏ1 అద్దేపల్లి జనార్దన్ రావు ఎవరో తనకు తెలియదని అన్నారట. కీలకమైన ప్రశ్నలు అడిగినప్పుడు కూడా జోగి సైలెంట్ గా ఉన్నారట. జోగి రమేష్ సోదరుడు రాము కూడా ఇలాగే సమాధానాలిచ్చారట.
జనార్థన్ ఎవరో తెలీదని, ఆయనతో కలిసి వ్యాపారాలు చేయలేదని, ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగలేదని జోగి రమేష్ అన్నారట. చివరిసారి జనార్ధన్ రావును ఎప్పుడు కలిశానో గుర్తు లేదని చెప్పారట. జనార్థన్ తో కలిసి దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయని సిట్ అధికారులు ప్రశ్నించగా…అవి ఎలా వచ్చాయో తనకు తెలీదన్నారట. ఏది ఏమైనా…జోగి రమేష్ బాగా ప్రిపేర్ అయి వచ్చారని, ఆవు వ్యాసం మాదిరిగా తెలీదు..గుర్తులేదు..తప్ప మరో ముక్క చెప్పడం లేదని తెలుస్తోంది.
గత ఏడాది పవన్ కళ్యాణ్ ఓజితో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కెరీర్ లో మొదటిసారి మూడు వందల కోట్ల క్లబ్బులోకి…
సీనియర్లలో ఎక్కువ వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానం బాలకృష్ణకే ఇవ్వాలి. ఎందుకంటే భోళాశంకర్ తర్వాత చిరంజీవి ఏకంగా…
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. అన్నట్టుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి…
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…