కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మత్రి జోగి రమేష్ ను సిట్ అధికారులు నిన్న ఉదయం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వంపై బురదజల్లేందుకు జోగి రమేష్ ఈ కల్తీ మద్యం వ్యాపారానికి తెర తీశారని జనార్ధన రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు జోగిని అరెస్టు చేశారు. ఆ తర్వాత దాదాపు 11 గంటలపాటు జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు రామును సిట్ అధికారులు, పోలీసులు వేర్వేరుగా విచారణ జరిపారు. అయితే, ప్రశ్న ఏదైనా సరే జోగి రమేష్ సమాధానం మాత్రం..తెలీదు..గుర్తులేదు…అని తెలుస్తోంది.
తనకు ఈ కేసుతో సంబంధం లేదని, అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు తనకు సమాధానలు తెలీదని జోగి రమేష్ అన్నారట. చంద్రబాబు ఇంటిపైకి తాను వెళ్లినందుకే ఈ కేసులో ఇరికించారని, తన కుమారుడిని అగ్రిగోల్డ్ భూముల కేసులో కక్షపూరితంగా ఇరికించారని చెప్పారట. ఇక, ఈ కేసులో ఏ1 అద్దేపల్లి జనార్దన్ రావు ఎవరో తనకు తెలియదని అన్నారట. కీలకమైన ప్రశ్నలు అడిగినప్పుడు కూడా జోగి సైలెంట్ గా ఉన్నారట. జోగి రమేష్ సోదరుడు రాము కూడా ఇలాగే సమాధానాలిచ్చారట.
జనార్థన్ ఎవరో తెలీదని, ఆయనతో కలిసి వ్యాపారాలు చేయలేదని, ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగలేదని జోగి రమేష్ అన్నారట. చివరిసారి జనార్ధన్ రావును ఎప్పుడు కలిశానో గుర్తు లేదని చెప్పారట. జనార్థన్ తో కలిసి దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయని సిట్ అధికారులు ప్రశ్నించగా…అవి ఎలా వచ్చాయో తనకు తెలీదన్నారట. ఏది ఏమైనా…జోగి రమేష్ బాగా ప్రిపేర్ అయి వచ్చారని, ఆవు వ్యాసం మాదిరిగా తెలీదు..గుర్తులేదు..తప్ప మరో ముక్క చెప్పడం లేదని తెలుస్తోంది.
This post was last modified on November 3, 2025 12:21 pm
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ కు ఒక అలవాటు ఉంది.. అదే 'స్లో స్టార్ట్ అండ్ డెడ్లీ ఫినిష్'. ఈ…
నాని ప్యారడైజ్ మీద అంచనాల గురించి ప్రత్యేకంగా మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఆగస్ట్ 21 విడుదల కోసం అభిమానులే కాదు మూవీ…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తో 40 ఏళ్ల బంధాన్ని వీడి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరిన సీనియర్…
ఒక డిజాస్టర్ పడితే చాలు దర్శకుడి ట్రాక్ రికార్డు గతంలో ఎంత ఉందనేది నిర్మాతలు పట్టించుకోరు. అందులోనూ వెటరన్ డైరెక్టర్స్…
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఏపీ సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్ గా…
మలయాళంలో ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు వాలా 2. అతి తక్కువ బడ్జెట్ లో రూపొంది రెండు వందల కోట్ల…