Political News

హుటాహుటిన కాశీబుగ్గ‌కు.. లోకేష్ నిబద్ధ‌త‌

ఏపీలో సీఎం చంద్ర‌బాబు కేబినెట్‌లో మంత్రిగా ఉన్న యువ నాయ‌కుడు నారా లోకేష్ ఎక్క‌డ స‌మ‌స్య ఉంటే అక్క‌డ‌కు వెళ్తున్నా రు. శాఖ‌ల‌తో ప‌నిలేకుండా.. ప్ర‌జ‌ల మేలు ప‌ర‌మావ‌ధిగా ఆయ‌న ముందుకు సాగుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న హైద‌రాబాద్‌లో ఉన్నారు. దాదాపు రెండు మాసాల త‌ర్వాత‌.. ఫ్యామిలీకి స‌మ‌యం ఇచ్చారు. ఇటీవ‌ల రెండు మాసాలుగా మంత్రి బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌.. అనంత‌రం.. తుఫానులు.. వ‌ర్షాల నేప‌థ్యంలో ఆయ‌న అమ‌రావ‌తికి ప‌రిమిత‌మయ్యారు. ఈ నేప‌థ్యంలో ఫ్యామిలీకి ఎంత స‌మ‌యం ఇవ్వాల‌న్న ఉద్దేశంతో శుక్ర‌వారం రాత్రే హైద‌రాబాద్‌కు చేరుకున్నారు.

అయితే.. శ‌నివారం ఉద‌యం.. శ్రీకాకుళం జిల్లా ప‌లాస నియోజ‌క‌వ‌ర్గంలోని కాశీబుగ్గ‌లో ఉన్న ఓ ప్రైవేటు ఆల‌యంలో తొక్కిస లాట జిరిగింది. కార్తీక మాసం, తొలిశ‌నివారం కావ‌డంతో శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పోటెత్తారు. వాస్త‌వానికి రెండు వేల మందికి మాత్ర‌మే ద‌ర్శ‌న అవ‌కాశం ఉండ‌గా.. తాజాగా శ‌నివారం వేలాది మంది త‌ర‌లి వ‌చ్చారు. దీంతో క్యూలైన్‌లో చోటు చేసుకున్న అల‌జ‌డి తొక్కిస‌లాట‌కు దారి తీసింది. వాస్త‌వానికి.. ఏకాద‌శి కావ‌డంతో ఓ భ‌క్తుడు ఉద‌యం నుంచి ఏమీ తీసుకోకుండా.. ఉప‌వాసం ఉన్నారు. ఆయ‌న ఒక్క‌సారిగా కుప్ప‌కూలాడు. దీంతో భ‌క్తులు ఏదో జ‌రిగింద‌న్న భ్ర‌మ‌తో తోసుకున్నారు. ఈ ఘ‌ట‌న మ‌ర‌ణాల‌కు దారితీసింది.

ప్ర‌స్తుతం 30 మందికి పైగా భ‌క్తులు ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే మంత్రి నారా లోకేష్ హుటాహుటిన హైద‌రాబాద్ నుంచి కాశీబుగ్గ‌కు వ‌చ్చారు. నేరుగా ఆసుప‌త్రుల‌కు వెళ్లి బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవ‌ల‌ను, ప్ర‌స్తుతం వారి ఆరోగ్య ప‌రిస్థితిని కూడా మంత్రి ఆరా తీశారు. ప్రాణాలు ర‌క్షించాల‌ని.. ఎంత ఖ‌ర్చ‌యినా వెనుకాడ‌వ‌ద్ద‌ని వైద్యుల‌కు సూచించారు. అవ‌స‌రమైతే.. ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల నుంచి ప్రైవేటు వైద్య శాల‌ల‌కు త‌ర‌లించి అయినా.. కూడా వారిని కాపాడాల‌ని సూచించారు.

దాదాపు రెండు గంట‌లుగా మంత్రి లోకేష్ ఆసుప‌త్రుల్లో ప‌ర్య‌టించి బాధితుల‌ను ఓదార్చారు. మ‌రోవైపు.. లండ‌న్‌లో సీఎం చంద్ర‌బాబు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు ఈ వ్య‌వ‌హారంపై ఆరా తీస్తున్నారు. బాధిత కుటుంబాల‌కు అండ‌గా ఉండాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అదేవిధంగా గాయ‌ప‌డిన వారికి, స్పృహ కోల్పోయిన వారికి వైద్య సేవ‌లు అందించాల‌న్నారు. ఇదిలావుంటే.. మంత్రి నారా లోకేష్ హుటాహుటిన స్పందించ‌డం.. నేరుగా ఆసుప‌త్రుల‌కు వెళ్లి బాధితుల‌ను పరామ‌ర్శించ‌డం వంటివి బాధిత కుటుంబాల‌కు ఓదార్పునిస్తున్నాయ‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

This post was last modified on November 2, 2025 8:14 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

తరుణ్ క్యాలికులేషన్ ఎక్కడ తప్పుతోంది

పది సంవత్సరాల కెరీర్ లో కేవలం మూడు సినిమాలు తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి…

2 hours ago

ప్యాన్ ఇండియా ‘డెవిల్’ టాక్ ఏంటి

మనకు డెవిల్ అంటే ఆ మధ్య వచ్చిన కళ్యాణ్ రామ్ సినిమా గుర్తొస్తుంది కానీ ఇటీవలే కన్నడలో విడుదలైన భారీ…

2 hours ago

మెగా ఛాన్స్ వదిలేసిన విశ్వంభర

మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ ఫలితాన్ని విశ్వంభర క్యాష్ చేసుకునే దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగకపోవడం అభిమానులను బాధ…

3 hours ago

హార్దిక్ పాండ్య ఏం సాధించాడు?

గత కొన్నేళ్లలో మోస్ట్ అన్ పాపులర్ ఇండియన్ క్రికెటర్ ఎవరు అంటే మరో మాట లేకుండా హార్దిక్ పాండ్య పేరు…

3 hours ago

క‌విత న‌న్ను ప‌దికోట్లు అడిగారు: పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ సువార్తీకుడు కేఏ పాల్‌.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ…

4 hours ago

మ‌మ‌త ప‌రిస్థితి.. ఏపీకి పాఠం అవుతుందా?!

త‌మ్ముడు త‌మ్ముడే.. రాజ‌కీయం రాజ‌కీయ‌మే.. బీజేపీ విష‌యంలో ఇది అక్ష‌రాలా నిజం. త‌న‌కు అవ‌కాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…

6 hours ago