తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జోరందుకున్న సంగతి తెలిసిందే. సిట్టింగ్ స్థానంలో మరోసారి గెలిచేందుకు బీఆర్ఎస్ ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని అధికార పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. బరిలో ప్రధానంగా ఈ రెండు పార్టీలే ఉండడంతో బీజేపీపై పెద్ద అంచనాలు లేవు. ఈ క్రమంలోనే ఈ బైపోల్ రిజల్ట్స్ పై ఆసక్తికరమైన అంచనాలు వెలువడుతున్నాయి. ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుస్తారని కేకే సర్వే అంచనా వేసింది.
ఏరియాలవారీగా జరిపిన సర్వేలో గులాబీ పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేకే సర్వే చెబుతోంది. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కు 12-13 శాతం మెజారిటీ వచ్చే చాన్స్ ఉందని చెప్పింది. శ్రీనగర్ కాలనీ, ఎర్రగడ్డ, షేక్ పేట, బోరబండలో బీఆర్ఎస్ ఆధిక్యం కనిపిస్తోందని, రహమత్ నగర్, వెంగళ్రావునగర్ లలో కాంగ్రెస్ స్ట్రాంగ్ గా ఉందని తెలిపింది.
గత ఎన్నికల్లో కేకే సర్వే చెప్పినట్లు ఏపీలో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేకే సర్వేకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా కేకే సర్వే చెప్పింది జరుగుతుందా లేదా అన్నది తేలాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.
This post was last modified on November 1, 2025 7:28 pm
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…
మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…
మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…