తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జోరందుకున్న సంగతి తెలిసిందే. సిట్టింగ్ స్థానంలో మరోసారి గెలిచేందుకు బీఆర్ఎస్ ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని అధికార పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. బరిలో ప్రధానంగా ఈ రెండు పార్టీలే ఉండడంతో బీజేపీపై పెద్ద అంచనాలు లేవు. ఈ క్రమంలోనే ఈ బైపోల్ రిజల్ట్స్ పై ఆసక్తికరమైన అంచనాలు వెలువడుతున్నాయి. ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుస్తారని కేకే సర్వే అంచనా వేసింది.
ఏరియాలవారీగా జరిపిన సర్వేలో గులాబీ పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేకే సర్వే చెబుతోంది. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కు 12-13 శాతం మెజారిటీ వచ్చే చాన్స్ ఉందని చెప్పింది. శ్రీనగర్ కాలనీ, ఎర్రగడ్డ, షేక్ పేట, బోరబండలో బీఆర్ఎస్ ఆధిక్యం కనిపిస్తోందని, రహమత్ నగర్, వెంగళ్రావునగర్ లలో కాంగ్రెస్ స్ట్రాంగ్ గా ఉందని తెలిపింది.
గత ఎన్నికల్లో కేకే సర్వే చెప్పినట్లు ఏపీలో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేకే సర్వేకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా కేకే సర్వే చెప్పింది జరుగుతుందా లేదా అన్నది తేలాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.
This post was last modified on November 1, 2025 7:28 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…