శ్రీకాకుళంలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటనలో 9 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చాలామంది భక్తులు తీవ్రంగా గాయపడడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఘటనా స్థలానికి మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష తదితరులు వెళ్లి సహాయక చర్యలను పరిశీలించారు. అదే క్రమంలో మాజీ మంత్రి, వైసీపీ నేత డాక్టర్ సీదిరి అప్పల రాజు కూడా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
స్వతహాగా డాక్టర్ అయిన అప్పలరాజు వెంటనే కొందరు క్షతగాత్రులకు సీపీఆర్ చేసి వారి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేశారు. కొందరు క్షతగాత్రులకు సీపీఆర్ చేసి వెంటనే ఆక్సిజన్ అందించే ప్రయత్నం చేశారు అప్పల రాజు. అప్పలరాజుతో పాటు స్థానిక వైసీపీ నేతలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైసీపీ సోషల్ మీడియా సర్కిల్స్ లో సర్క్యులేట్ అవుతోంది. సాధారణంగా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుంటారు. సహాయక చర్యలను కూడా ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది.
అయితే, అందుకు భిన్నంగా అప్పల రాజు స్వయంగా రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొన్న వైనం చర్చనీయాంశమైంది. వైద్యో నారాయణో హరి అన్నదానికి న్యాయం చేసేలా అప్పలరాజు క్షతగాత్రులకు సీపీఆర్ చేసిన వైనం నిజంగా ప్రశంసనీయమని, డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆన్ డ్యూటీ అంటూ కొందరు వైసీపీ అభిమానులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
This post was last modified on November 1, 2025 2:34 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…