Political News

క్షతగాత్రులకు మాజీ మంత్రి వైద్యం

శ్రీకాకుళంలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో 9 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చాలామంది భక్తులు తీవ్రంగా గాయపడడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఘటనా స్థలానికి మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష తదితరులు వెళ్లి సహాయక చర్యలను పరిశీలించారు. అదే క్రమంలో మాజీ మంత్రి, వైసీపీ నేత డాక్టర్ సీదిరి అప్పల రాజు కూడా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

స్వతహాగా డాక్టర్ అయిన అప్పలరాజు వెంటనే కొందరు క్షతగాత్రులకు సీపీఆర్ చేసి వారి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేశారు. కొందరు క్షతగాత్రులకు సీపీఆర్ చేసి వెంటనే ఆక్సిజన్ అందించే ప్రయత్నం చేశారు అప్పల రాజు. అప్పలరాజుతో పాటు స్థానిక వైసీపీ నేతలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైసీపీ సోషల్ మీడియా సర్కిల్స్ లో సర్క్యులేట్ అవుతోంది. సాధారణంగా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుంటారు. సహాయక చర్యలను కూడా ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది.

అయితే, అందుకు భిన్నంగా అప్పల రాజు స్వయంగా రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొన్న వైనం చర్చనీయాంశమైంది. వైద్యో నారాయణో హరి అన్నదానికి న్యాయం చేసేలా అప్పలరాజు క్షతగాత్రులకు సీపీఆర్ చేసిన వైనం నిజంగా ప్రశంసనీయమని, డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆన్ డ్యూటీ అంటూ కొందరు వైసీపీ అభిమానులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

This post was last modified on November 1, 2025 2:34 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మళ్లీ ‘టీఆర్ఎస్’ గా గులాబీ సేన?

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…

1 hour ago

హీరోలు మారినా ఫలితాలు మారట్లేదు

హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…

2 hours ago

ఎన్టీఆర్ నీల్ ఏం ఇవ్వబోతున్నారు

మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…

3 hours ago

అలా బటన్ నొక్కితే… ఇలా నెంబర్ ప్లేట్ మారిపోద్ది

ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…

4 hours ago

మధుర గాయని ఇక లేరు

భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…

6 hours ago

సర్దార్ 2 ఎందుకు రావడం లేదు

తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…

8 hours ago