Political News

నష్టం పూడ్చడానికి ఢిల్లీకి బాబు

ప్ర‌స్తుతం త‌లెత్తిన తుఫాను న‌ష్టాన్ని సీఎం చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. ప్రాథ‌మికంగా 5625 కోట్ల రూపాయ‌ల మేర‌కు న‌ష్టం వాటిల్లింద‌న్నారు. ఇక పూర్తిస్థాయిలో న‌ష్టాన్ని రెండు మూడురోజుల్లోనే అంచ‌నా వేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో కేంద్రం నుంచి సాయం తీసుకువ‌చ్చి రాష్ట్రంలో తుఫాను ప్ర‌భావిత బాధితుల‌కు అందించాల‌ని సీఎం చంద్ర‌బాబు నిర్ణ‌యించారు.

అయితే గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ద‌ఫా లేఖ‌లు రాసినా ఆయ‌నే స్వ‌యంగా ఢిల్లీకి వెళ్ల‌నున్నారని సీఎంవో వ‌ర్గాలు తెలిపాయి.

వాస్త‌వానికి ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వానికి ఇప్పుడు క‌ష్టం వ‌చ్చింది. దోబూచులాడుతూ దూసుకువ‌చ్చిన మొంథా తుఫాను కార‌ణంగా 450 మండ‌లాల్లో రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. ప్రాథ‌మిక అంచ‌నా ప్ర‌కారం 900 కోట్ల రూపాయ‌లకు పైగా రైతుల‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల్సి ఉంటుంద‌ని ప్ర‌భుత్వం అంచ‌నా వేసింది.

మ‌రో 3000 కోట్లు ర‌హ‌దారుల పున‌రుద్ధ‌ర‌ణ‌కు, మ‌రో 350 కోట్ల రూపాయ‌లు ఇళ్లు కోల్పోయిన తీర ప్రాంత ప్ర‌జ‌ల‌కు ఇవ్వాల్సి ఉంటుంద‌ని అధికారులు లెక్క‌లు తేల్చారు. అలాగే 1000 కోట్ల రూపాయ‌ల‌ను తాగునీటి స‌ర‌ఫ‌రా, విద్యుత్ స్తంభాల పున‌రుద్ధ‌ర‌ణ వంటి ప‌నుల‌కు వెచ్చించాల‌ని చెబుతున్నారు.

ఇలా ప్ర‌తి దానికీ లెక్క వేశారు. ఈ క్ర‌మంలో కేంద్రంలోని స‌ర్కారు సాయం త‌ప్ప‌కుండా తీసుకోవాల‌ని సీఎం చంద్ర‌బాబు నిర్ణ‌యించారు.

వాస్త‌వానికి గ‌త ఏడాది సెప్టెంబ‌రులో విజ‌య‌వాడ స‌హా ఏలూరులో సంభ‌వించిన వ‌ర్షాల‌కు కూడా 6500 కోట్ల రూపాయ‌ల‌కు పైగా న‌ష్టం వాటిల్లింద‌ని రాష్ట్ర స‌ర్కారు కేంద్రానికి నివేదిక పంపించింది.

ఈ నేప‌థ్యంలో తాజాగా సీఎం చంద్ర‌బాబు లేఖ రాయ‌డంతోపాటు త‌నే స్వ‌యంగా ఢిల్లీకి వెళ్లి ప్ర‌ధానిని క‌లిసి న‌ష్టం వివ‌రాలు తెల‌పాల‌ని భావిస్తున్నారు.

ఎలానూ సీఎం చంద్ర‌బాబు వ‌చ్చే వారం బీహార్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. అక్క‌డ జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మి త‌ర‌ఫున ఆయ‌న ప్ర‌చారం చేయ‌నున్నారు.

ఇక దీనికి ముందే ఢిల్లీకి వెళ్లి ప్ర‌ధాని మోడీ, అదేవిధంగా కేంద్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ మంత్రి అమిత్‌షాతోనూ భేటీ అయి న‌ష్టానికి సంబంధించిన ప‌రిహారాన్ని తెచ్చుకునే ప్ర‌య‌త్నం చేయ‌నున్నారు.

This post was last modified on October 31, 2025 6:06 pm

Share

Recent Posts

ఎల్లమ్మ… దేవి vs ప్రసాద్

‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…

3 hours ago

సాయి రెడ్డి ‘యూపీ’ ఎజెండా ‘ఏపీ’లో పనిచేస్తుందా…?

వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

5 hours ago

బెత్లేహెమ్ కుటుంబం కనెక్ట్ అవుతుందా

మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…

5 hours ago

మ‌ళ్లీ కౌంటింగ్ చేపట్టాలి: ఓట‌మిపై కోర్టుకు స్టాలిన్‌

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌.. మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ ఏడాది మార్చిలో జ‌రిగిన అసెంబ్లీ…

6 hours ago

అల్లరోడి వింటేజ్ కామెడీకి పెద్ద పరీక్ష

చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…

7 hours ago

రవితేజ అసలు భూమి మీద ఆగట్లేదుగా…

‘ఇరుముడి’ సక్సెస్ మీట్‌లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…

9 hours ago