గత ఏడాది ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేలు చాలా మందికి 30-50 వేల ఓట్ల మెజారిటీ లభించింది. ఈ మెజారిటీని నిలబెట్టుకుంటున్నారా? లేదా? అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే.. ఎన్నికల సమయానికి ప్రజల్లో వచ్చే భావోద్వేగాలు కీలక రోల్ పోషిస్తున్నాయి. దీంతో పార్టీలకు పార్టీలను ఓటర్లు పక్కన పెడుతున్నారు. సహజంగా ఒకప్పుడు ఓడిన పార్టీకి కూడా గౌరవ ప్రదమైన స్థానాలు దక్కేవి. కానీ, ఏపీలో పరిస్థితి దీనికి భిన్నంగా మారుతోంది. ఓడిపోయిన పార్టీలకు ప్రజలు తక్కువ సంఖ్యలో సీట్లు కట్టబెడుతున్నారు.
ఇక, గెలుపు గుర్రం ఎక్కుతున్న నాయకులకు కూడా ఊహించని విధంగా ప్రజలు మెజారిటీని కట్టబెడుతున్నారు. అదే సమయంలో ఓడిపోయిన వారికి చాలా చాలా తక్కువ ఓట్లు పడుతున్నాయి. ఈ క్రమంలో ఓటరు నాడిని పట్టుకునే ప్రయత్నంలో ప్రఖ్యాత సంస్థలు కూడా ఒకింత డోలాయమానంలో ఉన్నాయి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి ఎవరు ఓడుతారు.. ఎవరు గెలుస్తారు? అనేది పక్కన పెడితే.. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు.. తమ మెజారిటీని నిలబెట్టుకుంటే చాలన్న వాదన వినిపిస్తోంది.
గత ఎన్నికల్లో స్వల్ప సంఖ్యలోనే తక్కువ మెజారిటీ దక్కించుకున్నవారు ఉన్నారు. కానీ, మెజారిటీ ఎమ్మెల్యేలకు 30 వేల నుంచి 50 వేల ఓట్ల వరకు వచ్చాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి ఈ రేంజ్ను వారు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే చాలని పరిశీలకులు చెబుతున్నారు. “ఎమ్మెల్యేలు కొత్త ఓటర్ల కోసం ప్రయత్నించాల్సిన అవసరం లేదు. గత ఎన్నికల్లో ఎవరైతే తమను నమ్మి ఓటేశారో.. వారిని నిలబెట్టుకుంటే.. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవడం పెద్దకష్టం కాదు” అని ఓ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు.
ఇక, దీంతోపాటు.. వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన పొరపాట్లకు దూరంగా ఉండాలన్న సూచనలు కూడా వస్తున్నాయి. “ఇప్పుడు గెలిచిన వారికి.. తాము ఎందుకు గెలిచామో.. తెలుసు కదా!. ప్రత్యర్థి ఎందుకు ఓడిపోయారో కూడా వీరికి అవగాహన ఉంటుంది. సో.. దీనిని అంచనా వేసుకుంటే.. వారు ఎలా ఉండాలి? ఏం చేయాలి? అనే విషయాలు స్పష్టమవుతాయి. దీనికి ప్రత్యేకంగా వారు కృషి చేయాల్సిన అవసరం లేదు.” అని గత అనుభవాలను తెలుసుకుని.. ఆ తప్పులు చేయకుండా ఉంటేచాలని అంటున్నారు.
This post was last modified on October 31, 2025 6:37 am
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
తెంపరి తనానికి చొక్కా.. ఫ్యాంటు తొడిగితే.. అది అమెరికా అధ్యక్షుడు ట్రంపేనన్న కామెంట్లు తరచుగా వినిపిస్తాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…