గత ఏడాది ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేలు చాలా మందికి 30-50 వేల ఓట్ల మెజారిటీ లభించింది. ఈ మెజారిటీని నిలబెట్టుకుంటున్నారా? లేదా? అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే.. ఎన్నికల సమయానికి ప్రజల్లో వచ్చే భావోద్వేగాలు కీలక రోల్ పోషిస్తున్నాయి. దీంతో పార్టీలకు పార్టీలను ఓటర్లు పక్కన పెడుతున్నారు. సహజంగా ఒకప్పుడు ఓడిన పార్టీకి కూడా గౌరవ ప్రదమైన స్థానాలు దక్కేవి. కానీ, ఏపీలో పరిస్థితి దీనికి భిన్నంగా మారుతోంది. ఓడిపోయిన పార్టీలకు ప్రజలు తక్కువ సంఖ్యలో సీట్లు కట్టబెడుతున్నారు.
ఇక, గెలుపు గుర్రం ఎక్కుతున్న నాయకులకు కూడా ఊహించని విధంగా ప్రజలు మెజారిటీని కట్టబెడుతున్నారు. అదే సమయంలో ఓడిపోయిన వారికి చాలా చాలా తక్కువ ఓట్లు పడుతున్నాయి. ఈ క్రమంలో ఓటరు నాడిని పట్టుకునే ప్రయత్నంలో ప్రఖ్యాత సంస్థలు కూడా ఒకింత డోలాయమానంలో ఉన్నాయి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి ఎవరు ఓడుతారు.. ఎవరు గెలుస్తారు? అనేది పక్కన పెడితే.. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు.. తమ మెజారిటీని నిలబెట్టుకుంటే చాలన్న వాదన వినిపిస్తోంది.
గత ఎన్నికల్లో స్వల్ప సంఖ్యలోనే తక్కువ మెజారిటీ దక్కించుకున్నవారు ఉన్నారు. కానీ, మెజారిటీ ఎమ్మెల్యేలకు 30 వేల నుంచి 50 వేల ఓట్ల వరకు వచ్చాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి ఈ రేంజ్ను వారు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే చాలని పరిశీలకులు చెబుతున్నారు. “ఎమ్మెల్యేలు కొత్త ఓటర్ల కోసం ప్రయత్నించాల్సిన అవసరం లేదు. గత ఎన్నికల్లో ఎవరైతే తమను నమ్మి ఓటేశారో.. వారిని నిలబెట్టుకుంటే.. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవడం పెద్దకష్టం కాదు” అని ఓ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు.
ఇక, దీంతోపాటు.. వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన పొరపాట్లకు దూరంగా ఉండాలన్న సూచనలు కూడా వస్తున్నాయి. “ఇప్పుడు గెలిచిన వారికి.. తాము ఎందుకు గెలిచామో.. తెలుసు కదా!. ప్రత్యర్థి ఎందుకు ఓడిపోయారో కూడా వీరికి అవగాహన ఉంటుంది. సో.. దీనిని అంచనా వేసుకుంటే.. వారు ఎలా ఉండాలి? ఏం చేయాలి? అనే విషయాలు స్పష్టమవుతాయి. దీనికి ప్రత్యేకంగా వారు కృషి చేయాల్సిన అవసరం లేదు.” అని గత అనుభవాలను తెలుసుకుని.. ఆ తప్పులు చేయకుండా ఉంటేచాలని అంటున్నారు.
This post was last modified on October 31, 2025 6:37 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…