Political News

పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు, హైకోర్టు ఏం చెప్పింది?

దాదాపు 10 మెడికల్ కళాశాలలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌న‌ర్‌ షిప్(పీపీపీ) విధానంలో అభివృద్ధి చేయాలని ఏపీలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇది రాజకీయ దుమారానికి దారితీసింది. వైసీపీ హయాంలో మొత్తం 17 కాలేజీలు తీసుకురాగా.. వీటిలో ఐదు కాలేజీలు కొంతవరకు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. మరో రెండు కాలేజీలు నిర్వహణలో ఉన్నాయి. ఈ నేపద్యంలో మిగిలిన పది కాలేజీలను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 8,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని పేర్కొంది. ఇంత సొమ్ము పెట్టి నిర్మాణం చేసినా నిర్వహణ విషయంలో ఆశించిన మేరకు ఫలితం ఉండదని చెబుతోంది.

కాబట్టి వీటిని పీపీపీ విధానంలో ఇవ్వాలని జీవో కూడా జారీ చేసింది. గత రెండు నెలలుగా ఈ విషయంపై వివాదం కొనసాగుతున్న క్రమంలో రాష్ట్ర హైకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై ఇప్పటికే ఒకసారి విచారణ జరిపిన హైకోర్టు.. తాజాగా బుధవారం జరిగిన విచారణలో కీలక ఉత్తర్వులు ఇచ్చింది. పీపీపీ అనేది చట్టవిరుద్ధం కాదని, ఇది విధానపరమైన నిర్ణయం అని పేర్కొంది. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి అడ్డుపడబోమని స్పష్టం చేసింది. అంతేకాదు ఒకవేళ ఈ విధానంలో ఏమైనా అవకతవకలు జరిగితే అప్పుడు జోక్యం చేసుకుంటాం.. తప్ప విధానపరమైన నిర్ణయాలను ఎట్టి పరిస్థితులలోనూ అడ్డుకోబోమని స్పష్టం చేసింది.

అంతేకాదు ఇదే సమయంలో “మీరు ఎప్పుడు టెండర్లు పిలుస్తున్నారు“ అంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాదిని కూడా ప్రశ్నించింది. టెండర్లు నిర్వహించుకోవచ్చు అని, అయితే లాటరీ విధానంలో మాత్రం కోర్టు ఇచ్చే తీర్పు మేరకు అనుసరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. గతంలోనూ టెండ‌ర్ల‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదని రాష్ట్ర హైకోర్టు చెప్పడం గమనార్హం. ఇప్పుడు మరోసారి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి పచ్చ జెండా ఊపడంతో ఇక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. ఇప్పటికే మార్కాపురం సహా పలు వైద్య కళాశాలల‌ను పీపీపీ విధానంలో అప్పగించేందుకు టెండర్లు పిలిచారు. కానీ, కోర్టులో పిల్ నేప‌థ్యంలో దీనిపై తాత్సారం జ‌రుగుతోంది. అయితే.. తాజా తీర్పుతో ఇక‌, ప్ర‌భుత్వం ర‌య్ ర‌య్ మంటూ ఈ విష‌యంలో ముందుకు సాగేందుకు అవ‌కాశం ఉంటుంది.

This post was last modified on October 30, 2025 12:14 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మొన్న పెంగ్విన్.. నేడు పంచ్! ప్రపంచాన్ని కదిలించాయి

నిజమే, ఈ రెండు మూగజీవాల కథలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను పిండేశాయి. నిహిలిస్ట్ పెంగ్విన్ : ఒక డాక్యుమెంటరీలో…

4 hours ago

ఒక్క లుక్‌తో మంటలు పుట్టించిన రుక్కు

కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…

10 hours ago

కొత్త దర్శకుడి మీద బాలయ్య ఆసక్తి ?

అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…

13 hours ago

తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…

15 hours ago

మనసు మార్చుకున్న రామ్

యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…

15 hours ago

నెత్తుటి క్లబ్బులో ‘కల్ట్’ విధ్వంసం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…

16 hours ago