Political News

శ్రీవారి ప‌ర‌కామ‌ణి చోరీపై సీఐడీ: హైకోర్టు కీల‌క నిర్ణ‌యం

2021-22 మ‌ధ్య తిరుమ‌ల శ్రీవారి కానుకల హుండీ(ప‌ర‌కామ‌ణి) లెక్కింపు స‌మ‌యంలో విదేశీ క‌రెన్సీ దొంగ తనం.. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌పై తాజాగా హైకోర్టు మ‌రోసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ వ్య‌వ‌హారంపై అత్యంత లోతుగా ద‌ర్యాప్తు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డింది. “శ్రీవారిపై అపార న‌మ్మ‌కంతో భ‌క్తులు స‌మ‌ర్పించిన కానుక‌ల విష‌యంలో ఇంత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని ఎవ‌రూ ఊహించ‌రు. ఇది తీవ్ర ప‌రిణామం“ అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేప‌థ్యంలో ఈ విష‌యాన్ని సీఐడీ ద‌ర్యాప్తునకు అప్ప‌గిస్తున్న‌ట్టు తెలిపింది.

అంతేకాదు.. ఆనాటి.. ప‌రాక‌మ‌ణి లెక్కింపు అధికారిగా వ్య‌వ‌హ‌రించిన ర‌వికుమార్‌.. 90 డాల‌ర్ల‌ను లోదుస్తుల్లో పెట్టుకుని తీసుకువెళ్ల‌డం.. అనంత‌రం.. ఈ విష‌యంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు(అప్ప‌టి ఈవో క‌రుణాక‌ర్‌రెడ్డి) రాజీ కుదుర్చుకునేందుకు అంగీక‌రించ‌డం పైనా కోర్టు అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. “ఇదేదో లాలూచీ వ్య‌వ‌హారం“ అని వ్యాఖ్యానించింది. అంతేకాదు.. 90 డాల‌ర్లు దోచుకున్న ర‌వికుమార్ అనంతరం శ్రీవారికి 7 కోట్ల రూపాయ‌ల ఆస్తుల‌ను ఇస్తూ.. ప‌త్రాలు రాసిచ్చారు.

దీనిని కూడా కోర్టు తీవ్రంగా ప‌రిగ‌ణించింది. అన్ని ఆస్తులు ఆయ‌న‌కు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయో ప‌రిశీలించి.. విచారించాల‌ని ఆదేశించింది. దీనిపై ఏసీబీని వేయాల‌ని డీజీపీని ఆదేశించింది. అవి అక్ర‌మాస్తులా?  స‌క్ర‌మాస్తులా? తేల్చాల‌ని స్ప‌ష్టం చేసింది. అదేవిధంగా ర‌వికుమార్ బ్యాంకు ఖాతాల‌ను ప‌రిశీలించ‌డం తోపాటు.. మ‌నీలాండ‌రింగ్ జ‌రిగి ఉంటే.. ఆ కేసును ఈడీకి అప్ప‌గించాల‌ని కూడా ఆదేశించింది. ఈ వ్య‌వ‌హారాల‌పై త‌క్ష‌ణం విచార‌ణ చేప‌ట్టాల‌ని.. త‌దుప‌రి విచార‌ణ‌కు నివేదిక‌ల‌ను స‌మ‌ర్పించాల‌ని ఆదేశాల్లో పేర్కొంది.

ఆనాటి చిన్న‌దే అని..

గ‌తంలో జ‌రిగిన ఈ వ్య‌వ‌హారాన్ని ఆనాడు.. టీటీడీ బోర్డు చైర్మ‌న్‌గా ఉన్న భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి చిన్న‌దే నని కొట్టి పారేశారు. అంటే.. శ్రీవారి న‌గ‌దును దొంగ‌తనం చేసిన వ్య‌క్తిని ప‌రోక్షంగా ఆయ‌న వెనుకేసుకు వ‌చ్చార‌ని.. గ‌తంలో కోర్టు వ్యాఖ్యానించింది. అయితే.. ఈ కేసులో నేరుగా భూమ‌న లేక‌పోయినా.. రాజీ కుదర్చ‌డంతో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారన్న‌ది పిటిష‌నర్ల వాద‌న‌. శ్రీవారి 90 డాల‌ర్లు(నాటి విలువ ప్ర‌కారం 70 వేలు) కొట్టేసి.. ఏకంగా 7 కోట్ల రూపాయ‌ల ఆస్తుల‌ను శ్రీవారికి రాసివ్వ‌డంపై కూడా గ‌తంలో కోర్టు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసింది. ఈ కోణంలోనే ఇప్పుడు.. విచార‌ణ‌కు ఆదేశించింది.

Kumar

Recent Posts

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

1 hour ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

4 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

5 hours ago

పవన్ చెప్పిందేమిటి?… వీరు చేస్తున్నదేమిటీ?

రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…

5 hours ago

దీవానా సమస్య సెన్సార్ మాత్రమేనా

మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…

5 hours ago

రీ-నీట్… ఇంత చేసినా మళ్లీ సందేహాలు, ప్రశ్నలు!?

రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…

6 hours ago