Political News

తప్పు ఒప్పుకున్న జోగి రమేష్!

ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కొద్ది సంవత్సరాల క్రితం జరిగిన శాసన సభ సమావేశాల్లో నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. చంద్రబాబుపై, ఆయన కుటుంబంపై, చంద్రబాబు కుటుంబ సభ్యులపై జోగి రమేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి. అయినా సరే, తన వ్యాఖ్యలపై జోగి రమేష్ ఏనాడూ పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. అయితే, తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా జోగి రమేష్ తన తప్పు ఒప్పుకున్నారు.

ఆనాడు చంద్రబాబు గురించి, ఆయన కుటుంబం గురించి అలా మాట్లాడి ఉండాల్సింది కాదంటూ జోగి రమేష్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తాను చేసిన వ్యాఖ్యల గురించి తన భార్య తనను అడిగిందని, ఆ తర్వాత తాను చేసిన వ్యాఖ్యలు తప్పని తాను రియలైజ్ అయ్యానని జోగి రిగ్రెట్ అయ్యారు. అయితే, తాను ప్రమాణం కోసం అడిగానని, వారి కుటుంబాల జోలికి తాను వెళ్లలేదని అన్నారు.

వారి కుటుంబాలను తాను ఎప్పుడూ కించపరచలేదని, కించపరచబోనని చెప్పారు. రాజకీయపరంగా తాను విమర్శలు చేస్తానని, పొలిటికల్ పొలిటికలేనని…కుటుంబాల జోలికి వెళ్లనని చెప్పుకొచ్చారు. అయితే, ఇటీవల కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ పై తీవ్ర ఆరోపణలు రావడంతోనే ఆయన ఈ రకంగా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారని కామెంట్లు వస్తున్నాయి. నిజంగానే జోగి రిగ్రెట్ అయితే మంచిదేనని, జోగి బాటలో చాలామంది ఇంకా జ్ఞానోదయం కావాల్సి ఉందని చెబుతున్నారు.

This post was last modified on October 27, 2025 4:09 pm

Share
Show comments
Published by
Satya
Tags: jogi ramesh

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

1 hour ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

12 hours ago