ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కొద్ది సంవత్సరాల క్రితం జరిగిన శాసన సభ సమావేశాల్లో నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. చంద్రబాబుపై, ఆయన కుటుంబంపై, చంద్రబాబు కుటుంబ సభ్యులపై జోగి రమేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి. అయినా సరే, తన వ్యాఖ్యలపై జోగి రమేష్ ఏనాడూ పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. అయితే, తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా జోగి రమేష్ తన తప్పు ఒప్పుకున్నారు.
ఆనాడు చంద్రబాబు గురించి, ఆయన కుటుంబం గురించి అలా మాట్లాడి ఉండాల్సింది కాదంటూ జోగి రమేష్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తాను చేసిన వ్యాఖ్యల గురించి తన భార్య తనను అడిగిందని, ఆ తర్వాత తాను చేసిన వ్యాఖ్యలు తప్పని తాను రియలైజ్ అయ్యానని జోగి రిగ్రెట్ అయ్యారు. అయితే, తాను ప్రమాణం కోసం అడిగానని, వారి కుటుంబాల జోలికి తాను వెళ్లలేదని అన్నారు.
వారి కుటుంబాలను తాను ఎప్పుడూ కించపరచలేదని, కించపరచబోనని చెప్పారు. రాజకీయపరంగా తాను విమర్శలు చేస్తానని, పొలిటికల్ పొలిటికలేనని…కుటుంబాల జోలికి వెళ్లనని చెప్పుకొచ్చారు. అయితే, ఇటీవల కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ పై తీవ్ర ఆరోపణలు రావడంతోనే ఆయన ఈ రకంగా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారని కామెంట్లు వస్తున్నాయి. నిజంగానే జోగి రిగ్రెట్ అయితే మంచిదేనని, జోగి బాటలో చాలామంది ఇంకా జ్ఞానోదయం కావాల్సి ఉందని చెబుతున్నారు.
This post was last modified on October 27, 2025 4:09 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…