Political News

పవన్ కోపం తెప్పిస్తున్న బీజేపీ ఎంపి వ్యాఖ్యలు

జనసేన అధిపతి పవన్ కల్యాణ్ తో పాటు జనసైనికుల పరిస్ధితి గ్రేటర్ పరిధిలో విచిత్రంగా తయారైంది. పవన్ను టార్గెట్ చేస్తు బీజేపీ నేతలు తమిష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నా పవన్ కానీ లేకపోతే ఇతర నేతలు కానీ ఒక్కదానికి కూడా సమాధానం చెప్పేస్ధితిలో లేకపోవటమే విచిత్రంగా ఉంది. జనసేనతో పొత్తు విషయంపై ఎంపి ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ అసలు బీజేపికి మద్దతు ఇవ్వమని జనసేనను ఎవరు అడిగారు ? అంటూ ఎదురు ప్రశ్నించటం సంచలనంగా మారింది.

గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. తర్వాత ఓ 40 మందికి బీఫారాలు కూడా జారీచేశారు. అయితే తెరవెనుక ఏమైందో ఏమో వెంటనే బీజేపీ ఎంపి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ వెళ్ళి పవన్ తో భేటీ అయ్యారు. కేసీయార్ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండటం కోసం జనసేనను పోటీ నుండి విత్ డ్రా చేయించేట్లు ఒప్పించారు. అలాగే బీజేపీ గెలుపు కోసం పవన్ ప్రచారం చేస్తారని ప్రకటించారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. ఎందుకంటే భేటీ తర్వాత కిషన్+లక్ష్మణ్+పవన్ మీడియాతో నేరుగా మాట్లాడి ప్రకటనలు చేశారు.

సీన్ కట్ చేస్తే నామినేషన్లు అయిపోయిన తర్వాత నుండి కమలం నేతలు జనసేనను పూర్తిగా ఎన్నికలకు దూరం పెట్టేశారు. మాట్లాడాలనే నెపంతో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పవన్ను ఢిల్లీకి పిలిపించుకున్నారు. మూడు రోజులు వెయిటింగ్ లోనే అట్టేపెట్టారు. తర్వాత పవన్ హైదరాబాద్ కు వచ్చిన ఎక్కడా ప్రచారం చేయలేదు. పవన్ మద్దతు ఎవరడిగారంటూ ఇపుడు అరవింద్ చేసిన వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయి. అసలు తెలంగాణాలో జనసేనకున్న బలమెంత ? అంటూ ఎదురు ప్రశ్నించారు.

అన్నింటికీ మించి బీజేపీ గురించి చెప్పుకుంటూ సింహం ఎపుడూ సింగిల్ గానే వస్తుందనే సినిమా డైలాగును కూడా వినిపించారు ఎంపి. అంటే అర్ధమేంటి అనే విషయంలో జనసైనికులు రగిలిపోతున్నారట. తమను ఎన్నికల్లో పోటీ చేయనీకుండా చేసి చిరవకు ప్రచారంలో కూడా రానీయకుండా కట్టడి చేసిన కమలం తీరుపై మండిపోతున్నారట. పైగా సింహం సింగిల్ గానే వస్తుందనే డైలాగుతో జనసేనలో బీజేపీపై బాగా మండిపోతున్నారట. కానీ చేసేదేముంది ? అన్న విషయమే ఎవరికీ అర్ధం కావటం లేదు. మొత్తానికి పవన్ను బీజేపీ బాగానే అవమానిస్తోందన్న విషయం జనాల్లోకి వెళ్ళిపోయింది. మరి పవన్ ఎప్పుడు నోరిప్పుతారో ఏమో చూడాల్సిందే.

This post was last modified on November 30, 2020 10:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

3 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

3 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

5 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

7 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

8 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

8 hours ago