Political News

కర్నూలు ఘోరం: సీఎం చొరవతో అంతా కదిలారు

ఆపద రావడం ఒక ఎత్తు.. ఆపద అనంతరం ప్రభుత్వాలు, నాయకులు, వ్యక్తులు, అధికారులు వ్యవహరించే తీరు మరొక ఎత్తు. తాజాగా కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరులో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వేమూరి కావేరీ బస్సు అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. వారిని గుర్తించడానికి కూడా పరిస్థితి మారిపోయింది. ఎక్కడెక్కడి వారు బెన్గలూరుకు వెళ్తున్నారో తెలియదు. వీరిలో కేవలం ఆరుగురు మాత్రమే ఆంధ్రప్రదేశ్ వారు. మరో 8 మంది తెలంగాణ వారు. ఇంకొందరు బెన్గలూరు, ఒడిసా, బీహార్‌కు చెందినవారు కూడా ఉన్నారు.

ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు, ఆయా దేహాలను అప్పగించడం, వారికి సహాయం అందించడం, సమాచారం చేరవేయడం వంటివి ప్రభుత్వాల కీలక కర్తవ్యం. కేవలం పరిహారం ప్రకటించడం మాత్రమే కాకుండా, బాధిత కుటుంబాలకు మేమున్నామంటూ ఆదుకోవడం అత్యంత ముఖ్యం. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరికకు బాధిత కుటుంబాల నుంచి కృతజ్ఞతలు, ధన్యవాదాలు అందుతున్నాయి. మొత్తం 19 మంది మరణించగా, వీరిలో 18 మంది కుటుంబ సభ్యులను ప్రభుత్వం గుర్తించింది. DN A తప్ప, మరో విధంగా గుర్తించలేని పరిస్థితి ఏర్పడడంతో అప్పటికప్పుడు మంగళగిరిలో ప్రత్యేకంగా ల్యాబ్‌ను ఏర్పాటు చేసి (ఇప్పటికే ఉన్నదానిలో ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు చేశారు) పరీక్షలు పూర్తి చేశారు.

వాస్తవ అంచనాప్రకారం సోమవారం మధ్యాహ్నానికి కానీ ఏమీ చెప్పలేమని అధికారులు తెలిపారు. కానీ, సీఎం చంద్రబాబు చొరవతో హుటాహుటిన కదిలారు. మధ్యలో సెలవులు వచ్చినప్పటికీ తీసుకోరాదని, సెలవులో ఉన్న సిబ్బందిని కూడా రమ్మనాలి అని ఆదేశించి, రెవెన్యూ, పోలీస్, వైద్య సిబ్బంది అహరాహం శ్రమించారు. ఒకవైపు బాధిత కుటుంబాలకు దిశానిర్దేశం చేసి వారిని ఊరాడిస్తూ, మరోవైపు DN A పరీక్షలను వేగంగా పూర్తి చేసి, బాధిత కుటుంబాలకు ఆదివారం సాయంత్రంనాటికే (షెడ్యూల్ కంటే ముందే) 18 మృత దేహాలను అందించారు.

అంతేకాదు, ఆయా మృత దేహాలను తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం బెంగలూరు సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక అంబులెన్సులను ఏర్పాటు చేసింది. అదేసమయంలో ప్రభుత్వం ప్రకటించిన పరిహారం రూ.5 లక్షల చెక్కులను కూడా వెంటనే బాధిత కుటుంబాలకు ఇచ్చారు. అలాగే, మృతులకు సంబంధించిన మరణ ధ్రువీకరణ పత్రాలను కూడా బాధితులు ఎక్కడా తిరగకుండా అప్పటికప్పుడు ఏర్పాటు చేసి, వారికి అందజేశారు.

మొత్తంగా, ప్రాణాలు తీసుకురాలేకపోయినా, బాధిత కుటుంబాలకు అధికారులు, మంత్రులు, ప్రభుత్వం తోడుగా ఉండి, చివరి నిమిషం వరకు వారిని ఫాలో చేసిన తీరికకు అభినందనలు, కృతజ్ఞతలు దక్కుతున్నాయి. మరోవైపు, ఖర్చులు స్థానిక కలెక్టర్లు అందజేయాలంటూ ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది.

This post was last modified on October 26, 2025 10:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘పవన్ అన్న’ మాటే… ‘తమ్ముడు లోకేష్’ మాట!

కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…

2 hours ago

అవకాశాన్ని ఆంధ్రకింగ్ వాడుకుంటాడా

రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…

4 hours ago

అఖండ 2 ఆగింది… అసలేం జరుగుతోంది

బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…

5 hours ago

అన్నగారు వచ్చేలా లేరు

నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…

6 hours ago

‘హైదరాబాద్ హౌస్’లో పుతిన్ బస.. ఈ ప్యాలెస్ ఎవరిదో తెలుసా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…

10 hours ago

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

13 hours ago