హమ్మయ్య.. లిక్కర్ టెండర్ల వ్యవహారం పూర్తయింది.. సర్కారుకు 2 వేల కోట్ల రూపాయల పైచిలుకు ఆదాయం సమకూరిందని తెలంగాణ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. కానీ, అసలు తంతు ఇప్పుడే స్టార్టయింది. ఈ వ్యవహారంపై లెక్కకు మిక్కిలిగా రెండు కారణాలతో హైకోర్టును ఆశ్రయించిన వ్యాపారులు.. ఈ పిటిషన్లపై తాజాగా శనివారం హోరా హోరీ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి కోర్టు సూటి ప్రశ్నలు సంధించింది.
లిక్కర్ షాపులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను అసంబద్ధంగా నిర్వహించడంతోపాటు.. గడువును పదే పదే ఎందుకు పెంచారని.. నిలదీసింది. కానీ, ఈ విషయంపై సర్కారు వద్ద సమాధానం లేకపోవడం తో ప్రభుత్వం సమయం కోరింది. అదేవిధంగా ఒక్కొక్క దరఖాస్తుకు రూ.3 లక్షలను ఎందుకు విధించారని ప్రశ్నించినప్పుడు.. పొరుగు రాష్ట్రాల్లో ఇది రూ.5-10 లక్షల వరకు ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఈ వ్యవహారంపైనా కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
అయితే.. సర్కారుకు లభించిన ఊరట ఒక్కటే. ప్రస్తుతం ముగిసిన టెండర్ల ప్రక్రియపై స్టే విధించాలన్న పిటిషనర్ల వాదనను హైకోర్టు కొట్టి వేసింది. టెండర్ల ప్రక్రియ అయిపోయింది కాబట్టి.. తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు అభ్యంతరం లేదని కోర్టు స్పష్టం చేసింది. అయితే.. అనంతర ప్రక్రియ, లైసెన్సీల గుర్తింపు , షాపుల కేటాయింపు వంటివి మాత్రం తాము ఇచ్చే తుదితీర్పునకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో లిక్కర్ టెండర్ల వ్యవహారం డోలాయమానంలో పడింది.
అనేక ప్రశ్నలు..
ఈ క్రమంలో పలు ప్రశ్నలు తెరమీదికి వచ్చాయి. హైకోర్టు తుది ఆదేశాలు ఎలా ఉంటాయి? ఒకవేళ రుసుమును తగ్గించే వెసులుబాటు ఉంటుందా?. అదేసమయంలో షాపుల సంఖ్యను పెంచే అవకాశం ఉంటుందా? అనేది ఆసక్తిగా మారాయి. ఏదేమైనా లిక్కర్ టెండర్ల వ్యవహారం మరింత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇది సర్కారుకు వచ్చే రాబడిపై ప్రభావం చూపించే ఛాన్స్ కనిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో పాటు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు…