Political News

బీహార్‌లో ప్రచారం చేస్తా: చంద్రబాబు

ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైన కీలకమైన రాష్ట్రం బీహార్‌లో తాను కూడా ప్రచారం చేస్తానని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోడీని ఈ దశాబ్దపు నాయకుడిగా అభివర్ణించిన ఆయన, సంస్కరణలను తీసుకురావడం ద్వారా దేశ పురోభివృద్ధిలో ఆయన దూసుకుపోతున్నారని చెప్పారు. బీహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం మరోసారి ఏర్పాటు అవుతుందని అన్నారు.

దీనికి సంబంధించి తన వంతు పాత్ర పోషిస్తానన్న చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో తనకు కొన్ని దశాబ్దాలుగా అనుబంధం ఉందని తెలిపారు. ఆయన ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్తామని చెప్పడం ద్వారా మోడీ అందరినీ ఆకట్టుకున్నారని చెప్పారు. షెడ్యూల్ నిర్ణయించిన తర్వాత తాను కూడా బీహార్‌లో పర్యటించి ఎన్డీయే విజయం కోసం బాటలు వేస్తానని తెలిపారు.

ఇక ఇటీవ‌ల దసరా ముందు తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలతో ప్రజలు పొదుపు చేసుకుంటున్నారని తెలిపారు.

ఇది ఒకరకంగా పెద్ద సంస్కరణ. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఏ ప్రభుత్వం కూడా పన్నులు పెంచిందే తప్ప తగ్గించలేదు. ఇలా జరగడం ఇదే తొలిసారి. దీనికి ప్రధాని మోడీ ఉదారతే కారణం. అందుకే ఆయన దశాబ్దపు నాయకుడు అనిచెబుతా. దీని వల్ల పేదలు, మధ్యతరగతి పరోక్షంగా లాభం పొందితే, వ్యాపార వర్గాలకు కూడా ప్రత్యక్ష లాభం జరుగుతోంది. ప్రధాని మోడీకి విజయాలే తప్ప ఇప్పటి వరకు అపజయం అన్నది ఎరుగరు. 2000 సంవత్సరం నుంచి ఆయన 25 ఏళ్లుగా అప్రతిహతంగా విజయం దక్కించుకుంటున్నారు. అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

ఏపీలో…

ఏపీలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం దూసుకుపోతోందని సీఎం చంద్రబాబు చెప్పారు. అందుకే ఏడాదిలోనే ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతిహామీని అమలు చేశామని తెలిపారు. ముఖ్యంగా సూపర్ సిక్స్ ద్వారా ప్రజల ఆర్థిక ప్రయోజనాలకు పెద్దపీట వేశామని చెప్పారు. ఇది తమకు సానుకూలంగా మారుతుందని, వచ్చే ఎన్నికలలోనూ తాము విజయం దక్కించుకుంటామని చంద్రబాబు భరోసా వ్యక్తం చేశారు.

This post was last modified on October 25, 2025 4:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మీ దగ్గర పనిచేస్తా – రాజమౌళితో క్యామరూన్

ప్రపంచం మొత్తంలో ఉన్న ఫిలిం మేకర్స్ ఆరాధనాభావంతో చూసే దర్శకుడు జేమ్స్ క్యామరూన్. అవతార్ అనే ఊహాతీత లోకాన్ని సృష్టించి…

2 hours ago

‘దురంధర్’లో పాకిస్థాన్ సీన్లు ఎలా తీశారు?

బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ‘యురి: ది సర్జికల్ స్ట్రైక్’ దర్శకుడు ఆదిత్య ధర్ స్వీయ నిర్మాణంలో…

2 hours ago

షాకింగ్… నాగ్ దర్శకుడి మృతి

తెలుగు సినీ పరిశ్రమలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. ఒక యువ దర్శకుడు హఠాత్తుగా కన్నుమూశాడు. తన పేరు కిరణ్…

2 hours ago

‘రుషికొండ ప్యాలెస్ డబ్బుతో రెండు మెడికల్ కాలేజీలు కట్టొచ్చు’

వైసీపీ అధినేత జగన్ పై సీఎం చంద్రబాబు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్…

3 hours ago

అవతార్-3 రివ్యూలు వచ్చేశాయ్

2009లో ప్రపంచ సినీ చరిత్రలోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘అవతార్’. ఆ సినిమాకు కొనసాగింపుగా ఏకంగా…

5 hours ago

బ్లాక్ బస్టర్ సీక్వెల్ మీద అనుమానాలు

1997లో విడుదలైన బోర్డర్ ఒక క్లాసిక్ మూవీ. 1971 ఇండియా పాకిస్థాన్ యుద్ధాన్ని నేపథ్యంగా తీసుకుని దర్శకుడు జెపి దత్తా…

5 hours ago