Political News

రిజర్వేషన్ సంగతేంటి? తేల్చని రేవంత్!

తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశం.. వివాదం కూడా అయిన.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే అంశం మరోసారి పెండింగులోనే పడింది. ఇది అనేక మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. న్యాయ ప్రక్రియ నుంచి అనేక రాజకీయాలకు వరకు రిజర్వేషన్ విషయం తీవ్రమైన ఉత్కంఠ రేపింది. హైకోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు.. ప్రభుత్వం పోరాడినా.. తిరిగి ఇది పెండింగులోనే ఉంది.

ఈ క్ర‌మంలో తాజాగా గురువారం సాయంత్రం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో రిజర్వేషన్ల అంశంపై కీలక నిర్ణయం తీసుకుంటార‌ని అందరు అనుకున్నారు. ముఖ్యంగా మంత్రులు కూడా దీనిపై చూచాయగా లీకులు ఇచ్చారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు సుదీర్ఘంగా మంత్రి వర్గ సమావేశం జరిగింది. కానీ, ఈ సమావేశంలో ఎక్కడా స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించే రిజర్వేషన్ విషయం ప్రస్తావనకు రాలేదు.

అంటే, దీనిని బట్టి.. కోర్టు తీర్పులు వచ్చే వరకు ఇక, రిజర్వేషన్ అంశాన్ని ప్రభుత్వం పెద్దగా సీరియస్‌గా తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. ఇదే సమయంలో స్థానిక సంస్థలకు సంబంధించి ఇటీవ‌ల ప‌లు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంలా, తెలంగాణ కేబినెట్ కూడా తాజా నిర్ణయం తీసుకుంటే.. ఇద్దరు పిల్లలు ఉంటే.. ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను తీసేసింది. ఇకపై ఎంత మంది పిల్లలు ఉన్నా.. పోటీ చేయొచ్చు.

దీనికి సంబంధించి పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేయనున్నారు. దీనిని మంత్రి వర్గం తీర్మానించింది. అదేసమయంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులను వేగవంతం చేయాలని మంత్రివర్గం ప్రతిపాదించింది. మెట్రో రెండో దశను మరింత విస్తరించడంతోపాటు.. వేగంగా పనులు పూర్తవుతుందా చూడాలని తీర్మానం చేసింది. సంక్షేమ పథకాలపై డిసెంబర్ 31 నుంచి చేపట్టనున్న ప్రచార కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనేలా చూసే బాధ్యతను మంత్రులు తీసుకోవాలని ఈ సందర్భంలో కేబినెట్‌లో చర్చించారు.

This post was last modified on October 23, 2025 8:50 pm

Share
Show comments
Published by
Satya
Tags: Revanth

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

1 hour ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

2 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

2 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

3 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

5 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

5 hours ago