Political News

ఇండియాకి ఏపీ గేట్ వే: నారా లోకేష్‌

ఆస్ట్రేలియాలో ప‌ర్య‌టిస్తున్న మంత్రి నారా లోకేష్‌.. అక్క‌డి పెట్టుబ‌డి దారుల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నంలో బిజీబిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే సీఐఐ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన రోడ్ షోలో పాల్గొని.. పెట్టుబ‌డి దారుల తో చ‌ర్చ‌లు జ‌రిపారు. తాజాగా మ‌రో కీల‌క మైలురాయిని ఆయ‌న చేరుకున్నారు. బ్రిస్బేన్‌ బిజినెస్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఏపీలో ఉన్న అవ‌కాశాల‌ను ఆయ‌న వివ‌రించారు. భార‌త్‌కు ఏపీ గేడ్‌వేగా మారింద‌ని.. పెట్టుబ‌డులు మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌లో ఏపీ ముందుంద‌ని వివ‌రించారు.

అదేస‌మ‌యంలో భార‌త్‌-ఆస్ట్రేలియా దేశాల మ‌ధ్య స్నేహ పూర్వ‌క సంబంధాలు ఉన్నాయ‌ని తెలిపిన నారా లోకేష్‌.. పెట్టుబ‌డి దారుల‌కు అది కూడా క‌లిసి వ‌స్తుంద‌న్నారు. “ఏపీలో అనేక అవ‌కాశాలు ఉన్నాయి. వాటిని స‌ద్వినియోగం చేసుకుని .. స్థానిక యువ‌త‌కు ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించాల‌న్న‌ది మా ప్ర‌భుత్వం. ఈ క్ర‌మంలోనే పెట్టుబ‌డుల‌కు ఆహ్వానం ప‌లుకుతున్నాం. రండి.. మీకు ఏ అవ‌కాశం ఉన్న రంగంలో ఆ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోండి.” అని నారా లోకేష్ పిలుపునిచ్చారు.

స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ విధానాలను ఏపీలో స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేస్తున్నామ‌ని మంత్రి వివ‌రించారు. రాష్ట్రంలో సుప‌రిపాల‌న సాగుతోంద‌ని.. విజ‌న్ ఉన్న ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు కు ప్ర‌పంచ‌స్థాయి పేరుంద‌ని వివ‌రించారు. గత 16 నెలల్లో 10 లక్షల కోట్ల రూపాయ‌ల‌కు పైగా పెట్టుబడులు తీసుకువ‌చ్చామ‌ని వివ‌రించారు. గూగుల్ డేటా కేంద్రం కూడా విశాఖ‌కు వ‌చ్చేందుకు ఒప్పందం చేసుకుంద‌ని తెలిపారు.

ఏపీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న‌ సుల‌భ‌త‌ర విధానాలే ఇన్ని పెట్టుబ‌డులు వ‌చ్చేందుకు మార్గం సుగ‌మం చేశాయ‌ని మంత్రి వెల్ల‌డించారు. ఇండియాలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఏపీ ‘గేట్ వే’గా మారిందని మంత్రి నారా లోకేష్ వివ‌రించారు. వ‌చ్చే నెల‌ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే పెట్టుబడుల భాగ‌స్వామ్య స‌ద‌స్సుకు రావాల‌ని పారిశ్రామికవేత్తలను కోరారు.

This post was last modified on October 22, 2025 9:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బీహార్‌పై బీజేపీ ముద్ర‌… ప్రాంతీయ పార్టీల‌కు అలెర్ట్

బీహార్లో బిజెపి ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి…

1 hour ago

జగన్ అన్నా క్యాంటీన్లను తీసేసింది అందుకేనా?

వైసీపీ హ‌యాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జ‌గ‌న్‌.. పేద‌ల‌కు ప‌ట్టెడ‌న్నం కూడా పెట్ట‌లేక పోయార‌ని సీఎం చంద్ర‌బాబు విమ‌ర్శించారు.…

6 hours ago

అమరావతిపై ఇంత విషమేంటి నాని గారు?

ఏపీ రాజ‌ధాని అమ‌రావతిపై వైసీపీ నాయ‌కులు అదే అక్క‌సు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. రాజ‌ధానిపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉన్నారు. జ‌గ‌న్ ప్ర‌తిపాదించిన…

7 hours ago

లాయర్ అవతారమెత్తిన రాజు గారు

కనుమూరి రఘురామకృష్ణరాజు... ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోక్ సభ సభ్యుడిగా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజు..…

7 hours ago

ఎట్టకేలకు వర్మ త్యాగానికి ఫలితం

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎట్టకేలకు ఫలితం…

8 hours ago

జోష్ తగ్గింది జగన్

వైసీపీ అధినేత జగన్ ఎప్పుడు బయటకు వచ్చినా భారీ ఎత్తున జన సమీకరణ ఉంటుంది. ఆయన వెనక యువత ఎక్కువగా…

8 hours ago