ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తరచుగా పోలీసుల వ్యవహారంపై ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఒకసారి ఆయన.. పోలీసు శాఖను తామే తీసుకునే వాళ్లమని కూడా అన్నారు. రాష్ట్రంలో కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరును కూడా ఆయన పలు సందర్భాల్లో విమర్శించారు. అయితే.. చీటికీ మాటికీ కాకుండా.. చాలా తీవ్రమైన అంశాలు తెరమీదికి వచ్చినప్పుడు మాత్రమే పవన్ కల్యాణ్ స్పందిస్తున్నారు.
అలా.. ఇప్పుడు మరోసారి పవన్కల్యాణ్ భీమవరం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు(డీఎస్పీ)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా కొందరు రాజకీయ నేతలతో మిలాఖత్ అయి.. జూద శిబిరాల నిర్వహణకు పరోక్షంగా సహకరిస్తున్నారని డీఎస్పీ జయసూర్యపై ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా పలు అక్రమాల వ్యవహారంలోనూ ఆయన పేరు వినిపిస్తోందని పవన్ కల్యాణ్కు జనసేన నాయకులు ఫిర్యాదులు చేశారు. వీటిపై కొన్నాళ్లుగా అంతర్గత విచారణ చేయించిన డిప్యూటీ సీఎం వీటిని నిర్ధారించుకున్నట్టు తెలిసింది.
ఈ క్రమంలోనే సదరు ఆరోపణలు వచ్చిన డీఎస్పీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు.. తక్షణమే బదిలీ చేయలన్న ప్రతిపాదనను కూడా పెట్టినట్టు సమాచారం. తాజాగా ఈ విషయాన్ని జనసేన పార్టీ కార్యాలయం నుంచి హోంశాఖకు, అదేవిధంగా డీజీపీ ఆఫీసుకు కూడా సమాచారం చేరింది. తక్షణమే డీఎస్పీపై చర్యలు తీసుకోవాలన్నది పవన్ కోరిక. ఈవిషయంపై హోం శాఖ ఏం చేస్తుందో చూడాలి. గతంలో తిరుపతి డీఎస్పీపై కూడా.. పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. ఆయనను బదిలీ చేయలేదు. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on October 21, 2025 9:43 pm
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ కెరీర్ మంచి ఊపులో ఉండగానే.. బాలీవుడ్ నిర్మాత జాకీ…
టిడిపి తరఫున బలమైన గళం వినిపించే వారి కోసం పార్టీలో వెతుకుతున్నారు. వివాదరహితంగా పార్టీ పరంగా ప్రజలకు సంక్షేమ పథకాలు…
బాలీవుడ్లో వచ్చిన కల్ట్ బ్లాక్ బస్టర్ విక్కీ డోనర్ చూసిన ప్రేక్షకులు ఎవ్వరూ అందులో డాక్టర్ గా కీలక పాత్ర…
ఆరేళ్ల ముందు కొవిడ్ టైంలో థియేటర్లు మూతపడడంతో.. ఆ ఖాళీని భర్తీ చేయడం కోసం ఒక్కసారిగా ఓటీటీలు విజృంభించేశాయి. ఫిలిం…
వైసీపీ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం శాసన మండలి చైర్మన్గా ఉన్న మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే అంశంపై…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అదే పార్టీకి చెందిన సీనియర్లు గుర్రుగా ఉన్న నేపథ్యంలో అనేక ఫిర్యాదులు అధిష్టానానికి చేరుతున్నాయి. ముఖ్యంగా…