1) “మీరు ఉదాసీనంగా ఉంటున్నారు. కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదు. నిలువెత్తు లోతు గుంతల్లో మేం కూరుకుపోతున్నాం.“ – కర్ణాటక సర్కారును ఉద్దేశించి ప్రముఖ పారిశ్రామిక వేత్తలు చేసిన విమర్శలు.
2) “మన పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతున్నా.. సిద్దరామయ్య సినిమా చూస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని తట్టుకోలేక పారిశ్రామిక, ఐటీ దిగ్గజాలు వెళ్లిపోతున్నారు.“ కర్ణాటక విపక్షాల మాట.
3) “త్వరలోనే బెంగళూరు ఖాళీ అవుతుంది. ఇలానే వ్యవహరించండి.. ఏదో ఒకరోజు బెంగళూరులో పల్లీలు అమ్ముకునే పరిస్థితి వస్తుంది“ నెటిజన్ల టాక్.
4) “సీఎం స్టాలిన్.. నిద్ర పోతున్నారు. పక్కనే ఉన్న ఏపీ అనేక పెట్టుబడులు తెస్తోంది. మన దగ్గర ఏమున్నాయి.“ తమిళనాడులో కల్లోలం.
5) “గూగుల్ ఏఐని చెన్నైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలని ముందు నుంచి చెప్పాం. అయినా.. ఒక్కరూ మా మాట వినిపించుకోలేదు“ తమిళనాడు బీజేపీ నేతల సన్నాయి నొక్కులు.
కట్ చేస్తే.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 16 మాసాల్లో అనేక పెట్టుబడులు తెచ్చినా.. తాజాగా తెచ్చి న గూగుల్ పెట్టుబడి చుట్టుపక్కల రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఏపీని చూసి జెలసీతో వేడెక్కేలా చేస్తోంది. వాస్తవానికి ఆదిలో ఇంత హైప్ రాలేదు. “ఆ.. ఏముంది.. పెట్టుబడుల్లో ఇదొక పెట్టుబడి!“ అని సరిపుచ్చుకున్నారు. పెద్దగా ఒరిగేది కూడా ఏమీ లేదని అన్నారు.
కానీ.. ఎప్పుడైతే.. ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు సభలో గూగుల్ ఏఐ పెట్టుబడి గురించి ప్రస్తావించారో అప్పటి నుంచి దీనిపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఇక, అంతర్జాతీయ స్థాయి పత్రికలు కూడా దీనిపై పెద్ద ఎత్తున ప్రచురించడం కూడా కలిసివచ్చింది. ఈ పరిణామాలతో పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులలో పెద్ద ఎత్తున విపక్షాలు.. అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నాయి.
This post was last modified on October 18, 2025 8:25 pm
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…
పది సంవత్సరాల కెరీర్ లో కేవలం మూడు సినిమాలు తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి…