1) “మీరు ఉదాసీనంగా ఉంటున్నారు. కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదు. నిలువెత్తు లోతు గుంతల్లో మేం కూరుకుపోతున్నాం.“ – కర్ణాటక సర్కారును ఉద్దేశించి ప్రముఖ పారిశ్రామిక వేత్తలు చేసిన విమర్శలు.
2) “మన పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతున్నా.. సిద్దరామయ్య సినిమా చూస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని తట్టుకోలేక పారిశ్రామిక, ఐటీ దిగ్గజాలు వెళ్లిపోతున్నారు.“ కర్ణాటక విపక్షాల మాట.
3) “త్వరలోనే బెంగళూరు ఖాళీ అవుతుంది. ఇలానే వ్యవహరించండి.. ఏదో ఒకరోజు బెంగళూరులో పల్లీలు అమ్ముకునే పరిస్థితి వస్తుంది“ నెటిజన్ల టాక్.
4) “సీఎం స్టాలిన్.. నిద్ర పోతున్నారు. పక్కనే ఉన్న ఏపీ అనేక పెట్టుబడులు తెస్తోంది. మన దగ్గర ఏమున్నాయి.“ తమిళనాడులో కల్లోలం.
5) “గూగుల్ ఏఐని చెన్నైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలని ముందు నుంచి చెప్పాం. అయినా.. ఒక్కరూ మా మాట వినిపించుకోలేదు“ తమిళనాడు బీజేపీ నేతల సన్నాయి నొక్కులు.
కట్ చేస్తే.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 16 మాసాల్లో అనేక పెట్టుబడులు తెచ్చినా.. తాజాగా తెచ్చి న గూగుల్ పెట్టుబడి చుట్టుపక్కల రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఏపీని చూసి జెలసీతో వేడెక్కేలా చేస్తోంది. వాస్తవానికి ఆదిలో ఇంత హైప్ రాలేదు. “ఆ.. ఏముంది.. పెట్టుబడుల్లో ఇదొక పెట్టుబడి!“ అని సరిపుచ్చుకున్నారు. పెద్దగా ఒరిగేది కూడా ఏమీ లేదని అన్నారు.
కానీ.. ఎప్పుడైతే.. ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు సభలో గూగుల్ ఏఐ పెట్టుబడి గురించి ప్రస్తావించారో అప్పటి నుంచి దీనిపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఇక, అంతర్జాతీయ స్థాయి పత్రికలు కూడా దీనిపై పెద్ద ఎత్తున ప్రచురించడం కూడా కలిసివచ్చింది. ఈ పరిణామాలతో పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులలో పెద్ద ఎత్తున విపక్షాలు.. అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నాయి.
This post was last modified on October 18, 2025 8:25 pm
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…