తెలంగాణలో కాంగ్రెస్ను పక్కకు నెట్టి ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషిస్తోంది భారతీయ జనతా పార్టీ. దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి షాకిచ్చిన ఉత్సాహంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపా చాలా దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ రోజుకో హాట్ కామెంట్తో వార్తల్లో నిలుస్తున్నారు.
తాజాగా ఆయన జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వచ్చాక తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు. తమ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవడం ద్వారా టీఆర్ఎస్లో ముసలం పుట్టి ఎమ్మెల్యేలు తమ వైపు వచ్చేసి ప్రభుత్వం కూలిపోతుందన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. ఈ కామెంట్ మీద జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సారథిగా వ్యవహరిస్తున్న కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు.
ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో కేటీఆర్ ఉండగా న్యూస్ ప్రెజెంటర్ బండి సంజయ్ కామెంట్లను ప్రస్తావించి సంబంధిత వీడియోను ప్లే చేశారు. అది చూసి వెటకారంగా నవ్విన కేటీఆర్.. బండి సంజయ్ గాలి తీసే కామెంట్ చేశారు. ముంగేరి లాల్కే హసీన్ సప్నే అని ఆ మధ్య హిందీలో ఒక సీరియల్ వచ్చేదని.. అందులో అన్నీ కార్టూన్ క్యారెక్టర్లే ఉండేవని.. బండి సంజయ్ది కూడా అలాంటి కార్టూన్ క్యారెక్టరే అని.. అలాంటి వ్యక్తి చెప్పిన మాటల్ని ఎవరైనా సీరియస్గా తీసుకుంటారా.. పట్టించుకుంటారా అని కేటీఆర్ ప్రశ్నించారు.
మీడియాలో హెడ్ లైన్స్గా రావడానికి ఇలాంటి కామెంట్లు బాగుంటాయని.. అవి తాత్కాలికమని.. తర్వాత ఎవరూ పట్టించుకోరని కేటీఆర్ అన్నారు. తమ పార్టీకి వంద మందికి పైగా ఎమ్మెల్యేలున్నారని.. తమ పార్టీకి ఎన్ని స్థానాలున్నాయో అన్నింట్లో బీజేపీకి గత ఎన్నికల్లో డిపాజిట్లు రాలేదని.. అలాంటపుడు ప్రభుత్వం కూలిపోతుంది అనడానికి లాజిక్ ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. తమ పార్టీలో మహిళలందరికీ టీవీలో సీరియళ్లు, ఇంకే కార్యక్రమాలు చూడొద్దని.. బీజేపీ వాళ్లు బోలెండంత వినోదం పండిస్తున్నారని తాను చెప్పానని.. బండి సంజయ్ కామెంట్లు అందుకు తాజా నిదర్శనమని ఆయన సెటైర్ వేశారు.
This post was last modified on November 29, 2020 9:55 am
అదేంటి దర్శకుల్లో ఈ న్యూ ఏజ్ బ్యాచ్ ఎవరనుకుంటున్నారా. కమర్షియల్ ఎలిమెంట్స్ కి దూరంగా సహజమైన కథా కథనాలతో నిజ…
మాజీ ఎంపీ, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మళ్లీ పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. 50వ వివాహ వార్షికోత్సవం…
నియోజకవర్గాలకు నాయకులను ఎంపిక చేస్తున్న జగన్పై అదే నాయకుల నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ ఒత్తిడితోనే జగన్ ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ ఏ ముహూర్తాన ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్ తీయాలనుకున్నాడో కానీ.. అది ఆయనకు కెరీర్లో ఎన్నడూ…
సౌత్ సినిమాను దశాబ్దాలుగా తక్కువగా చూస్తుండేది బాలీవుడ్. అక్కడి నటులు, ఫిలిం మేకర్లు తమను తాము గొప్పగా ఫీలయ్యేవాళ్లన్నది స్పష్టం.…
హెడ్డింగ్ చదవగానే కొందరికి నవ్వు వచ్చి ఉండొచ్చు లేదా విచిత్రంగా అనిపించవచ్చు. ఎందుకంటే ఇంత తక్కువ మొత్తంలో ఈ రోజుల్లో…