ప్రజా ఉద్యమాలు అందరికీ తెలిసిందే. కానీ, మావోయిస్టు ఉద్యమాల లెక్క వేరుగా ఉంటుంది. అయితే.. ఇప్పడు ఆ ఉద్యమం.. లొంగుబాట పట్టింది. ఆపరేషన్ కగార్ కావొచ్చు.. పార్టీలో చీలికలు కావొచ్చు.. ఏదే మైనా.. మావోయిస్టు అగ్రనేతలను కాపాడుకోలేని దైన్యం మాటున లొంగుబాటుల పర్వం తెరమీదికి వచ్చింది. ఇలా లొంగిపోతున్నవారిలో చిన్న చితకా అయితే.. అసలు ప్రస్థావనే ఉండేది కాదు. పార్టీ కోసం.. అహరహం శ్రమించి… మారు వేషాల్లో కీలక నేతల హత్యలకు ప్రణాళికలు వేసిన నాయకులే లొంగుబాట పట్టారు.
తాజాగా ఆశన్న.. అసలు పేరు తక్కెళ్లపల్లి వాసుదేవరావు, ఉరఫ్ రమేష్, రూపేష్, సాజీ.. కూడా చత్తీస్ గఢ్ పోలీసుల ముందు లొంగిపోయారు. దాదాపు 170 మందితో ఆయన సర్కారుకు సరెండర్ కావడం గమనార్హం. నిజానికి మావోయిస్టులకు, వారి సిద్ధాంతాలకు.. మల్లోజుల వేణుగోపాల్, ఆ తర్వాత ఆశన్న కీలకం. ఎందుకంటే.. ఎవరు ఎటు పోయినా..ఎంత మంది మరణించినా.. దండకారణ్యం సహా.. నక్సల్స్ బరి నుంచి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లిన వారు వీరిద్దరే.
అంతేకాదు.. వీరిద్దరూ కూడా బలమైన నాయకులుగా మవోయిస్టు పార్టీ(నిషేధిత)లో మెలిగారు. ఇరువురికి 12-15 భాషలు వచ్చని అంటారు. నేపాల్లోనూ వీరికి ఆదరణ ఉంది. అలాంటి వారు తాజాగా లొంగిపోయా రు. ఆశన్నపై.. ఏకంగా 5 కోట్ల పైబడి రివార్డు ఉందని చెబుతున్నారు. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ మొత్తాన్ని ఆయనకు ఇవ్వనున్నారు. ఈయనతో పాటు.. పలు డివిజన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు నాయకులు కూడా లొంగిపోయారు.
తదుపరి ఏం చేస్తారు?
మావోయిస్టు అగ్రనాయకులు లొంగిపోయారు.. సరే.. మరి నెక్ట్స్ ఏం చేస్తారన్న ప్రశ్న సహజంగానే తెరమీ దికి వస్తుంది. వీరిపై సుమారు రెండు నుంచి మూడేళ్లపాటు నిఘా కొనసాగుతుంది. ఇక, వీరికి ప్రభుత్వాల నుంచి రివార్డులతోపాటు.. జనజీవన స్రవంతిలో కలిసే వారికి అమలు చేస్తున్న ప్యాకేజీ ఇస్తారు. అదేసమయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తామని.. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రకటించింది. వారుఏదైనా వ్యాపారం చేసుకుంటే రుణాలు ఇప్పిస్తామని తెలంగాణ డీజీపీ ఇటీవల ప్రకటించారు. అయితే.. సాధారణంగా.. మావోయిస్టులు ప్రజా ఉద్యమాలకు నేతృత్వం వహించేందుకు ముందుకు వస్తారు. కాబట్టి ఆ కోణంలో ఏమైనా ప్లాన్ ఉందేమో చూడాలి.
This post was last modified on October 17, 2025 5:42 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…