Political News

15 ఏళ్లు ఈ ప్ర‌భుత్వ‌మే ఉంటుంది: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

రాష్ట్రంలో మ‌రో 15 సంవ‌త్స‌రాల పాటు కూట‌మి ప్ర‌భుత్వ‌మే ఉంటుంద‌ని జ‌నసేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉద్ఘాటించారు. అనేక ఇబ్బందులు, స‌మ‌స్య‌లు, అవ‌మానాలు త‌ట్టుకుని నిల‌బ‌డ్డామ ని.. ఇక‌ముందు కూడా అదే శ‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తామ‌ని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా.. క‌ష్టాలు వ‌చ్చి నా.. 15 సంవ‌త్స‌రాల పాటు ఈ ప్ర‌భుత్వం కొన‌సాగుతుంద‌ని చెప్పారు. క‌ర్నూలు జిల్లాలో నిర్వ‌హించిన సూప‌ర్ జీఎస్టీ-సూప‌ర్ సేవింగ్స్ స‌భ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

అదేస‌మ‌యంలో ప్ర‌ధాని మోడీపై ప్ర‌శంస‌లు గుప్పించారు. మోడీని క‌ర్మ యోగిగా పేర్కొన్నారు. ఆయ‌న ధార్మికంగా ఆలోచించి.. క‌ర్మ యోగిగా ప‌నిచేస్తున్నార‌ని తెలిపారు. దేశాన్ని ముందుకు తీసుకువెళ్ల‌డ‌మే కాకుండా ప్ర‌పంచంలోనే అతి గొప్ప‌దేశంగా నిల‌బెడుతున్నార‌ని అన్నారు. శ‌త్రువుల నుంచి కూడా దేశాన్ని కాపాడుతున్నారని ప్ర‌శంసించారు. ఏమీ ఆశించ‌కుండానే.. దేశానికి సేవ చేస్తున్న ఏకైక ప్ర‌ధానిగా మోడీని అభివ‌ర్ణించారు. ఆయ‌నకు మ‌రో ఆలోచ‌న లేద‌ని.. ఎంత సేపూ.. దేశం, ప్ర‌జ‌ల గురించే ఆలోచ‌న చేస్తున్నార‌ని అన్నారు.

దేశం, ప్ర‌జ‌లు త‌లెత్తుకుని స‌గ‌ర్వంగా చెప్పుకొనేలా ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌ను తీసుకువ‌చ్చార‌ని చెప్పారు. ఇంటా బ‌య‌టా స‌మ‌స్య‌ల‌ను చాక‌చ‌క్యంగా ప‌రిష్క‌రిస్తున్నార‌ని తెలిపారు. ఈ దేశ జెండా ఎంత స‌గ‌ర్వంగా త‌లెత్తుకుని నిల‌బ‌డిందో అంతే గౌర‌వంగ‌.. గ‌ర్వంగా ప్ర‌పంచ ప‌టంలో దేశాన్ని నిల‌బెట్టిన ఘ‌న‌త ప్ర‌ధానికి ద‌క్కుతుంద‌ని తెలిపారు. ఒక త‌రం కోసం.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, సీఎం చంద్ర‌బాబు ఎంతో ఆల‌చ‌న చేస్తున్నార‌ని, నిరంత‌రం క‌ష్ట‌ప‌డుతున్నార‌ని కొనియాడారు.

వారి కోసం.. మ‌నం కూడా నిల‌బ‌డాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ పిలుపునిచ్చారు. ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా.. క‌ష్టాలు వ‌చ్చినా.. త‌ట్టుకుని నిల‌బ‌డాల్సిన అవ‌స‌రం మ‌న‌పై ఉంద‌న్నారు. మ‌రో 15 ఏళ్ల‌పాటు దేశంలోనూ రాష్ట్రంలోనూ కూట‌మి ప్ర‌భుత్వం కొన‌సాగుతుంద‌ని.. దీనికి అంద‌రూ క‌ల‌సి కృషి చేయాల‌ని పిలుపుని చ్చారు. ఈ త‌రం కోసం ఆలోచిస్తున్న వారిని స్ఫూర్తిగా తీసుకుని వ‌చ్చే త‌రం కోసం మ‌నం ప‌ని చేయాల‌ని సూచించారు.

This post was last modified on October 16, 2025 6:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

35 minutes ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

53 minutes ago

ప్రేక్షకులు మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

2 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

3 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

4 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

5 hours ago