కర్నూలులో అనేక సమస్యలు ఉన్నాయని.. అవి త్వరలోనే తీరుతాయని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘డ్రోన్స్ హబ్’ ద్వారా.. ఇక్కడి వారికి భారీ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధిలో కర్నూలు, రాయలసీమల పాత్ర కూడా ఉంటుందన్నారు. ఆపరేషన్ సిందూర్లో డ్రోన్ల పాత్ర ఎంతో ఉందన్నారు. భవిష్యత్తులో డ్రోన్ తయారీ కేంద్రంగా మారనున్న కర్నూలు.. దేశానికి.. ప్రపంచానికి కూడా సేవలు అందించే స్థాయికి ఎదుగుతుందన్నారు.
ఒకప్పుడు ఏపీ ఈ దేశానికి నాయకత్వం వహించే స్థాయిలో ఉందన్న ప్రధాని.. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన నిర్వాకంతో ఏపీ ప్రజలు ఇప్పుడు సాయం కోసం వేచి చూస్తున్న పరిస్థితి ఏర్పడిందని విమర్శించా రు. అయితే.. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు సారథ్యంలో ఏపీ పుంజుకుంటోందని.. దేశ చిత్ర పటం లో ఏపీ తిరుగులేని శక్తిగా అవతరించనుందని చెప్పారు. విశాఖ పట్నంలో ఏర్పాటు చేస్తున్న గూగుల్ ఏఐ హబ్ ద్వారా కేవలం విశాఖపట్నానికే కాకుండా.. దేశానికి, ప్రపంచానికి కూడా సేవలు అందుతాయన్నారు.
ఏపీలో అనంతమైన అవకాశాలు ఉన్నాయని.. అపారమైన యువ శక్తి ఉందని ప్రధాని తెలిపారు. దీనిని అందిపుచ్చుకునేందుకు డబుల్ ఇంజన్ సర్కారుకృషి చేస్తోందన్నారు. కేవలం 16 మాసాల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకువచ్చామన్నారు. నిమ్మలూరులో సూపర్ సోనిక్ కేంద్రం ఏర్పాటు ద్వారా సైనిక అవసరాలకు కీలకమైన ఆయుధాల తయారీని ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టులు రాయలసీమలో ని ప్రతి జిల్లాకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని.. సరికొత్త ద్వారాలను తెరుస్తాయని చెప్పారు.
లోకేష్ కృషి గ్రేట్!
సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ ఉత్సవంలో మంత్రి నారా లోకేష్ పాత్ర ఎంతో ఉందన్న ప్రధాని.. దీని వల్ల ఏపీ ప్రజలకు ఏటా 8 వేల కోట్ల రూపాయల మేరకు లబ్ధి చూకూరుతుందన్నారు. ఈ విషయంలో నారా లోకేష్ ప్రజలకు ఎంతో వివరిస్తున్నారని.. వారికి కూడా అవగాహన కలుగుతోందన్నారు. అయితే.. ఓకల్ ఫర్ లోకల్ నినాదాన్ని అందరూ అందిపుచ్చుకోవాలని సూచించారు. స్థానిక ఉత్పత్తులకు పెద్ద పీట వేయాలని సూచించారు. స్థానికంగా తయారయ్యే వస్తువులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని సూచించారు.
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…