కర్నూలులో అనేక సమస్యలు ఉన్నాయని.. అవి త్వరలోనే తీరుతాయని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘డ్రోన్స్ హబ్’ ద్వారా.. ఇక్కడి వారికి భారీ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధిలో కర్నూలు, రాయలసీమల పాత్ర కూడా ఉంటుందన్నారు. ఆపరేషన్ సిందూర్లో డ్రోన్ల పాత్ర ఎంతో ఉందన్నారు. భవిష్యత్తులో డ్రోన్ తయారీ కేంద్రంగా మారనున్న కర్నూలు.. దేశానికి.. ప్రపంచానికి కూడా సేవలు అందించే స్థాయికి ఎదుగుతుందన్నారు.
ఒకప్పుడు ఏపీ ఈ దేశానికి నాయకత్వం వహించే స్థాయిలో ఉందన్న ప్రధాని.. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన నిర్వాకంతో ఏపీ ప్రజలు ఇప్పుడు సాయం కోసం వేచి చూస్తున్న పరిస్థితి ఏర్పడిందని విమర్శించా రు. అయితే.. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు సారథ్యంలో ఏపీ పుంజుకుంటోందని.. దేశ చిత్ర పటం లో ఏపీ తిరుగులేని శక్తిగా అవతరించనుందని చెప్పారు. విశాఖ పట్నంలో ఏర్పాటు చేస్తున్న గూగుల్ ఏఐ హబ్ ద్వారా కేవలం విశాఖపట్నానికే కాకుండా.. దేశానికి, ప్రపంచానికి కూడా సేవలు అందుతాయన్నారు.
ఏపీలో అనంతమైన అవకాశాలు ఉన్నాయని.. అపారమైన యువ శక్తి ఉందని ప్రధాని తెలిపారు. దీనిని అందిపుచ్చుకునేందుకు డబుల్ ఇంజన్ సర్కారుకృషి చేస్తోందన్నారు. కేవలం 16 మాసాల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకువచ్చామన్నారు. నిమ్మలూరులో సూపర్ సోనిక్ కేంద్రం ఏర్పాటు ద్వారా సైనిక అవసరాలకు కీలకమైన ఆయుధాల తయారీని ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టులు రాయలసీమలో ని ప్రతి జిల్లాకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని.. సరికొత్త ద్వారాలను తెరుస్తాయని చెప్పారు.
లోకేష్ కృషి గ్రేట్!
సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ ఉత్సవంలో మంత్రి నారా లోకేష్ పాత్ర ఎంతో ఉందన్న ప్రధాని.. దీని వల్ల ఏపీ ప్రజలకు ఏటా 8 వేల కోట్ల రూపాయల మేరకు లబ్ధి చూకూరుతుందన్నారు. ఈ విషయంలో నారా లోకేష్ ప్రజలకు ఎంతో వివరిస్తున్నారని.. వారికి కూడా అవగాహన కలుగుతోందన్నారు. అయితే.. ఓకల్ ఫర్ లోకల్ నినాదాన్ని అందరూ అందిపుచ్చుకోవాలని సూచించారు. స్థానిక ఉత్పత్తులకు పెద్ద పీట వేయాలని సూచించారు. స్థానికంగా తయారయ్యే వస్తువులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని సూచించారు.
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…