ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం రాష్ట్రానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మంత్రులను హెచ్చరించారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. తాజాగా మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడిన చంద్రబాబు.. ప్రధాన మంత్రి షెడ్యూల్ ఖరారైందని.. ఆయన ఢిల్లీ నుంచి ఉదయం కర్నూలుకు వస్తున్నారని తెలిపారు. ఎక్కడా ప్రొటోకాల్ ఇబ్బందులు రాకుండా సంబంధిత మంత్రి చూసుకోవాలని సూచించారు.
అదేవిధంగా మంత్రులు అందరూ వారి వారి నియోజకవర్గాల నుంచి ప్రజలను 10 వేలమంది చొప్పున తరలించేందుకు ఏర్పాట్లుచేయాలన్నారు. ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. “ప్రధానిని మనం మూడో సారి ఆహ్వానిస్తున్నాం. ఆయన వస్తున్నారు. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఎవరూ నిర్లక్ష్యం వహించొద్దు. అందరూ క్రమశిక్షణతో ఉండాలి.” అని మంత్రులకు సూచించారు. గతంలో మోడీ విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమానికి వచ్చారు.
తర్వాత.. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి వచ్చారు. ఇప్పుడు కర్నూలులో నిర్వహించే సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు మంత్రులను అలెర్టు చేశారు. ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పేర్కొన్నారు. అయితే.. గతంలో రెండు పర్యటనలలో వివాదాలు వచ్చాయి. కొందరు మంత్రులు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో సీఎం ఇలా అలెర్ట్ చేసి ఉంటారని సమాచారం. మరోవైపు.. ఏర్పాట్లను కూడా సీఎం సమీక్షించారు. ప్రధాని పాల్గొనే సభను విజయవంతం చేయాలని సూచించారు.
సభ ఏర్పాట్లు ఇవీ..
This post was last modified on October 16, 2025 6:35 am
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…