ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం రాష్ట్రానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మంత్రులను హెచ్చరించారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. తాజాగా మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడిన చంద్రబాబు.. ప్రధాన మంత్రి షెడ్యూల్ ఖరారైందని.. ఆయన ఢిల్లీ నుంచి ఉదయం కర్నూలుకు వస్తున్నారని తెలిపారు. ఎక్కడా ప్రొటోకాల్ ఇబ్బందులు రాకుండా సంబంధిత మంత్రి చూసుకోవాలని సూచించారు.
అదేవిధంగా మంత్రులు అందరూ వారి వారి నియోజకవర్గాల నుంచి ప్రజలను 10 వేలమంది చొప్పున తరలించేందుకు ఏర్పాట్లుచేయాలన్నారు. ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. “ప్రధానిని మనం మూడో సారి ఆహ్వానిస్తున్నాం. ఆయన వస్తున్నారు. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఎవరూ నిర్లక్ష్యం వహించొద్దు. అందరూ క్రమశిక్షణతో ఉండాలి.” అని మంత్రులకు సూచించారు. గతంలో మోడీ విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమానికి వచ్చారు.
తర్వాత.. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి వచ్చారు. ఇప్పుడు కర్నూలులో నిర్వహించే సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు మంత్రులను అలెర్టు చేశారు. ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పేర్కొన్నారు. అయితే.. గతంలో రెండు పర్యటనలలో వివాదాలు వచ్చాయి. కొందరు మంత్రులు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో సీఎం ఇలా అలెర్ట్ చేసి ఉంటారని సమాచారం. మరోవైపు.. ఏర్పాట్లను కూడా సీఎం సమీక్షించారు. ప్రధాని పాల్గొనే సభను విజయవంతం చేయాలని సూచించారు.
సభ ఏర్పాట్లు ఇవీ..
This post was last modified on October 16, 2025 6:35 am
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…