ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం రాష్ట్రానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మంత్రులను హెచ్చరించారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. తాజాగా మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడిన చంద్రబాబు.. ప్రధాన మంత్రి షెడ్యూల్ ఖరారైందని.. ఆయన ఢిల్లీ నుంచి ఉదయం కర్నూలుకు వస్తున్నారని తెలిపారు. ఎక్కడా ప్రొటోకాల్ ఇబ్బందులు రాకుండా సంబంధిత మంత్రి చూసుకోవాలని సూచించారు.
అదేవిధంగా మంత్రులు అందరూ వారి వారి నియోజకవర్గాల నుంచి ప్రజలను 10 వేలమంది చొప్పున తరలించేందుకు ఏర్పాట్లుచేయాలన్నారు. ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. “ప్రధానిని మనం మూడో సారి ఆహ్వానిస్తున్నాం. ఆయన వస్తున్నారు. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఎవరూ నిర్లక్ష్యం వహించొద్దు. అందరూ క్రమశిక్షణతో ఉండాలి.” అని మంత్రులకు సూచించారు. గతంలో మోడీ విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమానికి వచ్చారు.
తర్వాత.. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి వచ్చారు. ఇప్పుడు కర్నూలులో నిర్వహించే సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు మంత్రులను అలెర్టు చేశారు. ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పేర్కొన్నారు. అయితే.. గతంలో రెండు పర్యటనలలో వివాదాలు వచ్చాయి. కొందరు మంత్రులు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో సీఎం ఇలా అలెర్ట్ చేసి ఉంటారని సమాచారం. మరోవైపు.. ఏర్పాట్లను కూడా సీఎం సమీక్షించారు. ప్రధాని పాల్గొనే సభను విజయవంతం చేయాలని సూచించారు.
సభ ఏర్పాట్లు ఇవీ..
This post was last modified on October 16, 2025 6:35 am
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో తెరకెక్కబోతున్న సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు…
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. ఉదయం 11 గంటలకు బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో బెంగాల్ సీఎంగా సువేందు…
ఇప్పటికే పలు వాయిదాల్లో నలిగిపోయిన సూర్య వీరభద్రుడు మే 14 విడుదల కానుంది. మొన్నటిదాకా వాయిదా పడుతుందనే ప్రచారం చెన్నై…
జనసేనాని పవన్ కళ్యాణ్ మీద గత రెండు మూడు రోజులుగా వైసీపీ మద్దతుదారులు. అనుకూల మీడియా పెడుతున్న సోషల్ మీడియా…
మేం ఫేమస్ చిత్రంతో టాలీవుడ్లోకి దూసుకొచ్చాడు యువ నటుడు సుమంత్ ప్రభాస్. షార్ట్ ఫిలిమ్స్ నేపథ్యం నుంచి వచ్చిన ఈ…
సూర్యకుమార్ యాదవ్ ఎందుకు ఉన్నాడు? శ్రేయస్ అయ్యర్ ఎందుకు లేడు? భారత టీ20 జట్టు విషయంలో చాలా రోజులుగా అభిమానులను…