Political News

ఇది ట్రయలరే.. అసలు సినిమా ముందుంది: నారా లోకేష్

ఇది ట్రయలరే.. అసలు సినిమా ముందుంది అంటూ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. విశాఖకు గూగుల్ డేటా కేంద్రం రానున్న నేపథ్యంలో ఢిల్లీలో దీనికి సంబంధించిన ఒప్పందం జరిగింది. తాజాగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖకు వచ్చినది అతి పెద్ద భారీ పెట్టుబడి అయినప్పటికీ ఇది ట్రయలరేనని, మున్ముందు విశాఖ రూపురేఖలు మార్చే దిశగా అడుగులు వేయబోతున్నామని, భారీ ఎత్తున పెట్టుబడులు రానున్నాయని చెప్పారు.

గూగుల్ రాకతో ఏపీకి సంబంధించిన అనేక కంపెనీలు విశాఖకు వస్తున్నాయని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా తాను ఈ కంపెనీల కోసం పడిన కష్టాన్ని వివరించారు. ఒకప్పుడు చంద్రబాబు ఎలా అయితే మైక్రోసాఫ్ట్ తీసుకువచ్చేందుకు కృషి చేశారో ఇప్పుడు తాను కూడా అలానే గూగుల్ కోసం కష్టపడ్డానన్నారు. గూగుల్ రాకతో దాని అనుబంధ సంస్థలు, ఇతర పెట్టుబడులు రానున్నాయని వివరించారు. ఇవన్నీ స్థానిక యువతకు మెరుగైన ఉపాధిని కల్పించనున్నాయని తెలిపారు.

ఇలా ఒప్పించారు!

గూగుల్ సంస్థ విశాఖలో పెట్టుబడి పెట్టేందుకు తాను ఎలా ఒప్పించిందీ నారా లోకేష్ చెప్పుకొచ్చారు.

సెప్టెంబర్ 2024లో గూగుల్ ప్రతినిధులు విశాఖ వచ్చారు.

ఈ విషయం తెలిసి వారిని కలిశాను.

డేటా కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించాను. వారికి డేటా సెంటర్ స్థలాన్ని చూపించాం.

తదుపరి అక్టోబరు నెలలో (గత ఏడాది) అమెరికా వెళ్లి గూగుల్ క్లౌడ్‌ను కలిశాను.

అదే ఏడాది నవంబర్‌లో గూగుల్ ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిశారు.

తర్వాత సీఎం చంద్రబాబు ప్రధాని మోడీని కలసి వివరించారు.

భారీ పెట్టుబడులపై అన్ని చోట్లా చర్చలు జరుగుతున్నాయి.

కానీ, అవకాశాలు అవసరం చూసుకుని ఏపీకి తరలి వస్తున్నారు.

ఇది పూర్తిగా చంద్రబాబు విజన్‌, ఆయన కల్పిస్తున్న అవకాశాలకు నిదర్శనం.

This post was last modified on October 15, 2025 5:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

57 minutes ago

క్రింజ్ కామెంట్ల‌పై రావిపూడి ఏమ‌న్నాడంటే?

అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అంద‌రూ హిట్ మెషీన్ అంటారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌యం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…

60 minutes ago

100 కోట్లు ఉన్నా ప్రశాంతత లేదా? ఎన్నారై స్టోరీ వైరల్!

అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…

1 hour ago

ట్రెండుకు భిన్నంగా వెళితే ఎలా జగన్?

బ‌లంగా మాట్లాడాలి. మాట‌కు మాట కౌంట‌ర్ ఇవ్వాలి. అది వింటే ప్ర‌త్య‌ర్థులు నోరు అప్ప‌గించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…

4 hours ago

మహిళా డాక్టర్ హిజాబ్ ను తొలగించిన సీఎం

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…

6 hours ago