Political News

బాబు విజ‌న్‌: ఏపీకి మరో ప్రముఖ అంతర్జాతీయ సంస్థ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు విజ‌న్‌-2047తో ముందుకు సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో పెట్టుబడుల‌కు భారీ స్థాయిలో ఆయ‌న ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో ఉన్న అపార అవ‌కాశాలను వివ‌రించి.. పెట్టుబ‌డి సంస్థ‌ల‌ను ఆయ‌న ఆహ్వానిస్తున్నారు. తాజాగా ఈ క్ర‌మంలో ఓ అంత‌ర్జాతీయ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది. రాష్ట్రంలోని సముద్రతీర రంగంలో వ్యాపార వృద్ధికి అవకాశం.. వ్యాపార విస్తరణ వ్యూహంలో భాగంగా పెట్టుబడులు పెట్టేందుకు ‘గజ్‌ప్రొమ్‌’ మొగ్గు చూపింది.

తీర ప్రాంతాల్లో ఓడరేవులు, గ్యాస్‌ ఆధారిత ప్లాంట్ల విషయంలో ఆసక్తి క‌న‌బ‌రుస్తున్న గ‌జ్ ప్రొమ్ సంస్థ‌ కాకినాడలో భారీ ఎల్‌ఎన్‌జీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వ‌చ్చిన‌ట్టు అధికారులు చెబుతున్నారు. దీనికి సీఎం చంద్ర‌బాబు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. కాకినాడ సీపోర్ట్స్‌ లిమిటెడ్‌తో కలిసి 50 లక్షల టన్నుల సామర్థ్యంతో ప్లాంట్‌ ఏర్పాటుకు రష్యా ప్రభుత్వ సంస్థ ‘గజ్‌ప్రొమ్‌’ ఆసక్తి.. సుమారు రూ.6 వేల కోట్ల వ్యయంతో టెర్మినల్ నిర్మించ‌నుంది.

ఈ క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు స‌హా .. ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో ఈ వారంలో ఢిల్లీలో కీలక చర్చలు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. కాకినాడ సీ పోర్ట్స్‌, గజ్‌ప్రొమ్‌, ఢిల్లీలోని రష్యన్‌ ఫెడరేషన్‌ ఎంబసీ ప్రతినిధుల‌తో స‌ర్కారు చ‌ర్చించి.. తుది నిర్ణ‌యం తీసుకుంటుంది. ప్ర‌స్తుతం ఈ సంస్థ రష్యా ప్రభుత్వ విద్యుత్‌ రంగంలో ప్రముఖ సంస్థగా ఉంద‌ని అధికారులు చెబుతున్నారు. ఇటీవ‌ల కాలంలో ర‌ష్యా-భార‌త్ మ‌ధ్య సంబంధాలు పెరుగుతున్న క్ర‌మంలో భారత్‌లో ఓడరేవులు, గ్యాస్‌ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలనే వ్యూహంలో భాగంగా ‘గజ్‌ప్రొమ్‌’ నిర్ణయం తీసుకుంద‌ని.. దీనికి ఏపీని ఎంచుకుంద‌ని స‌మాచారం.

This post was last modified on October 7, 2025 2:04 pm

Share

Recent Posts

లెనిన్ జేబులో వంద కోట్లు పడతాయా

అక్కినేని అఖిల్ కు బలమైన కంబ్యాక్ గా నిలిచిన లెనిన్ థియేటర్ రన్ ఇంకా కొనసాగుతోంది. అయితే చెన్నై లవ్…

9 minutes ago

ఆదర్శంలో ఏదో మిస్సవుతోంది అధ్యక్ష్యా

వెంకటేష్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటిసారి కలయిక మీద ప్రేక్షకుల్లో ఓ రేంజులో హైప్ నెలకొంది. మాటల మాంత్రికుడు రచయితగా…

49 minutes ago

అంజి చేసిన తప్పు రిపీట్ కాకూడదు

విజువల్ ఎఫెక్ట్స్ తో ముడిపడిన సినిమాలకు ఎక్కువ సమయం పడుతుంది. ఇది వాస్తవం. పైగా ఇప్పుడు ఏఐ వచ్చాక జనాలు…

1 hour ago

భాగ్యశ్రీ ని బ్లాక్ చేసిన తల్లి

సినిమాల పట్ల ముందుతరం తల్లిదండ్రుల్లో చాలా వరకు ప్రతికూల అభిప్రాయమే ఉంటుంది. తమ పిల్లల్లో ఎవరైనా సినిమాల్లోకి వెళ్తామంటే.. కంగారు…

2 hours ago

కొత్త దర్శకులు పాత సినిమాలు చూడాలి

అదేంటి ఎవరైనా కొత్తగా ఆలోచించాలి కానీ అదే పనిగా పాత సినిమాలు చూడటం ఏమిటనే సందేహం వస్తే మీరు పప్పులో…

3 hours ago

పావలా శ్యామల ఇక లేరు

క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరొందిన పావలా శ్యామల కన్ను మూశారు. గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న శ్యామల గారికి…

5 hours ago