Political News

బాబు విజ‌న్‌: ఏపీకి మరో ప్రముఖ అంతర్జాతీయ సంస్థ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు విజ‌న్‌-2047తో ముందుకు సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో పెట్టుబడుల‌కు భారీ స్థాయిలో ఆయ‌న ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో ఉన్న అపార అవ‌కాశాలను వివ‌రించి.. పెట్టుబ‌డి సంస్థ‌ల‌ను ఆయ‌న ఆహ్వానిస్తున్నారు. తాజాగా ఈ క్ర‌మంలో ఓ అంత‌ర్జాతీయ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది. రాష్ట్రంలోని సముద్రతీర రంగంలో వ్యాపార వృద్ధికి అవకాశం.. వ్యాపార విస్తరణ వ్యూహంలో భాగంగా పెట్టుబడులు పెట్టేందుకు ‘గజ్‌ప్రొమ్‌’ మొగ్గు చూపింది.

తీర ప్రాంతాల్లో ఓడరేవులు, గ్యాస్‌ ఆధారిత ప్లాంట్ల విషయంలో ఆసక్తి క‌న‌బ‌రుస్తున్న గ‌జ్ ప్రొమ్ సంస్థ‌ కాకినాడలో భారీ ఎల్‌ఎన్‌జీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వ‌చ్చిన‌ట్టు అధికారులు చెబుతున్నారు. దీనికి సీఎం చంద్ర‌బాబు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. కాకినాడ సీపోర్ట్స్‌ లిమిటెడ్‌తో కలిసి 50 లక్షల టన్నుల సామర్థ్యంతో ప్లాంట్‌ ఏర్పాటుకు రష్యా ప్రభుత్వ సంస్థ ‘గజ్‌ప్రొమ్‌’ ఆసక్తి.. సుమారు రూ.6 వేల కోట్ల వ్యయంతో టెర్మినల్ నిర్మించ‌నుంది.

ఈ క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు స‌హా .. ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో ఈ వారంలో ఢిల్లీలో కీలక చర్చలు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. కాకినాడ సీ పోర్ట్స్‌, గజ్‌ప్రొమ్‌, ఢిల్లీలోని రష్యన్‌ ఫెడరేషన్‌ ఎంబసీ ప్రతినిధుల‌తో స‌ర్కారు చ‌ర్చించి.. తుది నిర్ణ‌యం తీసుకుంటుంది. ప్ర‌స్తుతం ఈ సంస్థ రష్యా ప్రభుత్వ విద్యుత్‌ రంగంలో ప్రముఖ సంస్థగా ఉంద‌ని అధికారులు చెబుతున్నారు. ఇటీవ‌ల కాలంలో ర‌ష్యా-భార‌త్ మ‌ధ్య సంబంధాలు పెరుగుతున్న క్ర‌మంలో భారత్‌లో ఓడరేవులు, గ్యాస్‌ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలనే వ్యూహంలో భాగంగా ‘గజ్‌ప్రొమ్‌’ నిర్ణయం తీసుకుంద‌ని.. దీనికి ఏపీని ఎంచుకుంద‌ని స‌మాచారం.

This post was last modified on October 7, 2025 2:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డెవిల్ పాట మీద బూతు వివాదం

కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…

15 seconds ago

40 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటున్నారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…

35 minutes ago

టికెట్ రేట్ల పెంపు లేదు… అయినా హ్యాపీనే

తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…

1 hour ago

SRH ఈ హెచ్చరికలు వినాల్సిందే..

'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…

4 hours ago

మీరు కాల్చండి.. నేను చూసుకుంటా. అని ఎవరన్నారు?

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం…

7 hours ago

అలా ఎలా ఒప్పించావయ్యా సుజీత్

టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద స్టార్లలో ఒకడైనప్పటికీ చాలా సింపుల్ గా ఉంటాడు పవన్ కళ్యాణ్. తనో పెద్ద స్టార్…

8 hours ago