Political News

ఇది లైట్ కాదు.. బాబు పాల‌న‌లో ఫ‌స్ట్ టైమ్‌.. !

ఔను.. సీఎం చంద్ర‌బాబు పాల‌న అంటే.. పార‌ద‌ర్శ‌క‌త‌కు పెద్దపీట వేస్తార‌న్న పేరుంది. బ‌య‌ట ఎలా మాట్లాడినా.. అసెంబ్లీలో మాత్రం ఖ‌చ్చితంగా లెక్క‌లు చూపుతార‌ని అంటారు. అదేస‌మ‌యంలో స‌భ్యులు కూడా చాలా జాగ్ర‌త్త‌గా మాట్లాడ‌తార‌న్న పేరు కూడా ఉంది. కానీ, ఇప్పుడు అదే అసెంబ్లీలో స‌భ్యులు దారి త‌ప్పుతున్నారు. కేవ‌లం స‌భ్యులే కాదు.. మంత్రులు కూడా.. త‌ప్పుడు దారిలో నడుస్తున్నార‌ని స్వ‌యంగా చంద్ర‌బాబు హెచ్చ‌రించే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇది ఆయ‌న పాల‌న‌కు పెద్ద మైన‌స్‌గా మారిపోయింది.

ఎవ‌రికి వారు ఎవరికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు వారు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా జ‌గ‌న్ హ‌యాంలో జ‌రిగిన అప్పుల‌ను ప్ర‌స్తావిస్తూ.. ఇంకా అబ‌ద్ధాలు చెబుతున్నార‌న్న‌ది ప్ర‌ధాన విమ‌ర్శ‌. ఈ విష‌యాన్ని అధికార పార్టీ స‌భ్యులే గుసగుస లాడుతున్నారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న స‌భ‌ల్లోనే ఆర్థిక మంత్రి ప‌య్యావుల కేశ‌వ్‌.. జ‌గ‌న్ హ‌యాంలో 3 ల‌క్ష‌ల కోట్ల అప్పులు చేశార‌ని చెప్పారు. కానీ, మ‌ర్నాడే.. శాస‌న మండ‌లిలో మ‌రో మంత్రి టీజీ భ‌ర‌త్‌, అచ్చెన్నాయుడు.. వైసీపీ హ‌యాంలో 9 ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేశార‌ని చెప్పారు.

ఇక‌, వైసీపీ హ‌యాంలో ర‌హ‌దారులు నిర్మించ‌లేద‌ని ఆది నుంచి చెబుతున్న ప్ర‌భుత్వం.. ఇటీవ‌ల అసెంబ్లీలో మంత్రి బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి 32 శాతం మేర‌కు వైసీపీ హ‌యాంలో రోడ్లు వేశార‌ని టీడీపీ స‌బ్యుడు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పారు. ఇక‌, కేంద్రం ఇచ్చిన 17 మెడిక‌ల్ కాలేజీల వ్య‌వ‌హారాన్ని పీపీపీకి ఇస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలో అస‌లు కాలేజీల‌ను నిర్మించ‌లేద‌ని అందుకే పీపీపీకి ఇస్తున్న‌ట్టు తెలిపింది. వాస్త‌వం వ‌చ్చే సరికి మ‌రుస‌టిరోజు మంత్రి స‌త్య‌కుమార్ మండ‌లిలో మాట్లాడుతూ.. 5 కాలేజీలు పూర్త‌య్యాయ‌ని వివ‌రిం చారు.

ఇలా పొంత‌న‌లేని విష‌యాల‌ను అసెంబ్లీలో ప్ర‌స్తావించ‌డం ద్వారా స‌ర్కారుపై తొలిసారి స‌భ‌లో కూడా నిజాలు చెప్ప‌డం లేద‌న్న వాద‌న బ‌లంగా వినిపించే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇది మంచిది కాద‌న్న విష‌యం చంద్ర‌బాబు కూడా గ్ర‌హించారు. అందుకే.. స‌భ్యులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని స‌భా ముఖంగానే శుక్ర‌వారం హెచ్చ‌రించారు. నిజానికి గ‌తంలో ఇంత తీవ్ర స్థాయిలో స‌భ‌లో వ్య‌వ‌హారాలు వివాదాల చుట్టూ తిర‌గ‌లేదు. కానీ, తొలిసారి ఇప్పుడు ఇలా జ‌రుగుతున్న తీరు.. చంద్ర‌బాబు ఇమేజ్‌కే దెబ్బ ప‌డేలా చేస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Satya

Recent Posts

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

2 minutes ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

30 minutes ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

1 hour ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

2 hours ago

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…

2 hours ago

సేనానికి అభిమానమే అడ్డు కాకూడదు

భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…

2 hours ago