కాస్త భిన్నమైన కాంబినేషన్. రాజకీయాలు వేరు.. వ్యక్తిగత సంబంధాలు వేరు. ఈ విషయం ఎప్పటి నుంచో ఉన్నా.. గడిచిన పదేళ్లలో వచ్చిన మార్పులతో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర విభజనకు ముందు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెళ్లిళ్లు మాజోరుగా సాగేవి. తెలంగాణ ఉద్యమం పీక్స్ కు చేరిన వేళ.. రెండు రాష్ట్రాల మధ్య పెళ్లిళ్ల విషయంలోనూ కాస్త గ్యాప్ వచ్చింది. ప్రముఖులు అయితే.. సంబంధాలు కలుపుకునే విషయంలో ఆలోచించుకునే పరిస్థితి. భావోద్వేగాలు ఎక్కువగా ఉన్న వేళ.. రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగత సంబంధాలు ఉండాలన్న విషయాన్ని మర్చిపోతారు. అందుకే.. ఎందుకైనా మంచిదన్నట్లుగా వ్యవహరించేవారు.
విభజన తర్వాత పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు కొత్త బంధురికాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ నేతలు సైతం ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన పెళ్లివేడుక కూడా అలాంటి ప్రత్యేకత ఉన్నదే. హైప్రొఫైల్ పెళ్లిగా చెప్పే ఈ వివాహానికి కోవిడ్ నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకున్నారు. పరిమిత సంఖ్యలోనే అతిధులకు ఆహ్వానం పంపారు. ఇంతకీ ఆ పెళ్లి ఎవరిదంటే..
భువనగిరి ఎంపీ.. కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమార్తె శ్రీనిది రెడ్డికి.. కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శిల్పా మోహన్ రెడ్డి సోదరుడి కుమారుడి పెళ్లి ఖాయమైంది. వాస్తవానికి ఈ ఆగస్టులోనే వీరి ఎంగేజ్ మెంట్ అయ్యింది. హైటెక్స్ లో జరిగిన ఈ వివాహం వేడుకగా సాగింది. కోవిడ్ కారణంగా హైప్రొఫైల్ పెళ్లిల్లు తక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన పెళ్లి వేడుకను చూస్తే.. ధూంధాంగా జరిగిందనే చెప్పాలి.ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
This post was last modified on November 26, 2020 12:21 pm
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…