Political News

చిరంజీవి రియాక్ష‌న్‌.. వైసీపీకి మేలా?

ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ చేసిన వ్యాఖ్య‌లపై గురువారం రాత్రి.. మెగా స్టార్ చిరంజీవి స్పందించా రు. సుమారు 10 కీల‌క పాయింట్ల‌ను ఆయ‌న లేవ‌నెత్తారు. అయితే.. పాయింట్లు వైసీపీకి మేలు చేసేలా ఉన్నాయ‌న్న వాద‌న వినిపించ‌డం గ‌మ‌నార్హం. వైసీపీ హ‌యాంలో సినిమా స‌మ‌స్య‌ల‌పై మాట్లాడేందుకు.. 2023లో దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, హీరోలు ప్ర‌భాస్‌, మ‌హేష్‌బాబు స‌హా ప‌లువురితో క‌లిసి చిరంజీవి తాడేప‌ల్లి నివాసానికి వ‌చ్చారు.ఈ స‌మ‌యంలో మంత్రి పేర్ని నానితోనే భేటీ కావాల‌ని జ‌గ‌న్ తేల్చి చెప్పార‌న్న వార్త వెలుగు చూసింది.

అయితే.. త‌మ స‌మ‌స్య‌ల‌పై మంత్రి పేర్నితో పాటు సీఎం జ‌గ‌న్‌తోనూ చ‌ర్చించాల‌ని నిర్ణ‌యించుకున్నామ‌ని చిరు చెప్ప‌డంతో సీఎం జ‌గ‌న్ వారికి ఆల‌స్యంగా అప్పాయింట్ మెంటు ఇచ్చార‌న్న‌ది అప్ప‌ట్లో సంచ‌ల‌నం రేపింది. ఈ వ్య‌వ‌హారం తాజాగా అసెంబ్లీలో చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ప్పుడు బాల‌య్య‌.. చిరుపై వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌ను కోట్ చేస్తూ.. గురువారం రాత్రి చిరు స్పందించారు. తాను ప్ర‌స్తుతం విదేశాల్లో ఉన్నాన‌ని, ఎమ్మెల్యే బాల‌కృష్ణ వ్యాఖ్య‌లు టీవీలో చూశాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. అయితే.. సీఎం జ‌గ‌న్ త‌మ‌కు అప్పాయింట్‌మెంటు ఇవ్వ‌లేద‌ని చెప్ప‌డం స‌రికాద‌న్నారు.

తాము తాడేప‌ల్లికి వెళ్ల‌గానే ప్రొటోకాల్ ప్ర‌కారం అధికారులు వ్య‌వ‌హ‌రించార‌ని చిరు తెలిపారు. అనంత‌రం సీఎం జ‌గ‌న్‌తో క‌లిసి తాము భోజ‌నం చేశామ‌ని.. ఈ స‌మ‌యంలో ఆయ‌న అన్ని స‌మ‌స్య‌ల‌ను సావ‌ధానంగా విన్నార‌ని, ప్ర‌తి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చార‌ని చిరు వెల్ల‌డించారు. అంతేకాదు.. నాడు బాల‌య్య సినిమా వీర‌సింహారెడ్డికి, త‌న సినిమా వాల్తేరు వీర‌య్య‌కు కూడా అప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఇబ్బందుల‌ను తొల‌గించాల‌ని.. సీఎం జ‌గ‌న్‌.. మౌఖికంగా అప్ప‌టిక‌ప్పుడే ఆదేశాలు ఇచ్చార‌ని చిరు మ‌రో బాంబు పేల్చారు. తాను జోక్యం చేసుకుని చ‌ర్చించ‌క‌పోతే.. నాటి వీర‌సింహారెడ్డి క‌ష్టాలు తొల‌గేవి కాద‌ని తేల్చి చెప్పారు.

ఇక‌, జ‌గ‌న్ ఎవ‌రి ఒత్తిడితోనో క‌ల‌వ‌లేద‌న్న చిరంజీవి.. ఆయ‌నే స్వ‌యంగా వ‌న్ టు వ‌న్ క‌లుసుకునేందుకు ఆహ్వా నించార‌ని, ఆయ‌న‌తో క‌లిసి లంచ్ కూడా చేశామ‌ని వివ‌రించారు. క‌రోనా టైం కావ‌డంతో ఐదుగురిని మాత్ర‌మే రావా ల‌ని జ‌గ‌న్ చెప్పార‌ని.. కానీ, తాను 10 మంది వ‌స్తామ‌ని చెప్ప‌డంతో స‌రే న‌ని ర‌మ్మ‌న్నార‌ని వ్యాఖ్యానించారు. అప్పుడు ప‌దిమందితో క‌లిసి వెళ్లాన‌న్నారు. “అసెంబ్లీలో నా పేరు ఎత్తారు కాబ‌ట్టి.. నేను స్పందించాల్సి వ‌చ్చింది.” అని చిరు ముక్తాయించారు. అయితే.. చిరు వ్యాఖ్య‌లు.. వైసీపీకి మ‌ద్ద‌తుగా ఉన్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఏదేమైనా చిన్న విష‌యం.. గ‌తించిన విష‌యం.. ఇప్పుడు రాజ‌కీయంగా దుమారం రేప‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on September 26, 2025 12:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

38 minutes ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

1 hour ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

1 hour ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

3 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

3 hours ago