Political News

చిరంజీవి రియాక్ష‌న్‌.. వైసీపీకి మేలా?

ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ చేసిన వ్యాఖ్య‌లపై గురువారం రాత్రి.. మెగా స్టార్ చిరంజీవి స్పందించా రు. సుమారు 10 కీల‌క పాయింట్ల‌ను ఆయ‌న లేవ‌నెత్తారు. అయితే.. పాయింట్లు వైసీపీకి మేలు చేసేలా ఉన్నాయ‌న్న వాద‌న వినిపించ‌డం గ‌మ‌నార్హం. వైసీపీ హ‌యాంలో సినిమా స‌మ‌స్య‌ల‌పై మాట్లాడేందుకు.. 2023లో దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, హీరోలు ప్ర‌భాస్‌, మ‌హేష్‌బాబు స‌హా ప‌లువురితో క‌లిసి చిరంజీవి తాడేప‌ల్లి నివాసానికి వ‌చ్చారు.ఈ స‌మ‌యంలో మంత్రి పేర్ని నానితోనే భేటీ కావాల‌ని జ‌గ‌న్ తేల్చి చెప్పార‌న్న వార్త వెలుగు చూసింది.

అయితే.. త‌మ స‌మ‌స్య‌ల‌పై మంత్రి పేర్నితో పాటు సీఎం జ‌గ‌న్‌తోనూ చ‌ర్చించాల‌ని నిర్ణ‌యించుకున్నామ‌ని చిరు చెప్ప‌డంతో సీఎం జ‌గ‌న్ వారికి ఆల‌స్యంగా అప్పాయింట్ మెంటు ఇచ్చార‌న్న‌ది అప్ప‌ట్లో సంచ‌ల‌నం రేపింది. ఈ వ్య‌వ‌హారం తాజాగా అసెంబ్లీలో చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ప్పుడు బాల‌య్య‌.. చిరుపై వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌ను కోట్ చేస్తూ.. గురువారం రాత్రి చిరు స్పందించారు. తాను ప్ర‌స్తుతం విదేశాల్లో ఉన్నాన‌ని, ఎమ్మెల్యే బాల‌కృష్ణ వ్యాఖ్య‌లు టీవీలో చూశాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. అయితే.. సీఎం జ‌గ‌న్ త‌మ‌కు అప్పాయింట్‌మెంటు ఇవ్వ‌లేద‌ని చెప్ప‌డం స‌రికాద‌న్నారు.

తాము తాడేప‌ల్లికి వెళ్ల‌గానే ప్రొటోకాల్ ప్ర‌కారం అధికారులు వ్య‌వ‌హ‌రించార‌ని చిరు తెలిపారు. అనంత‌రం సీఎం జ‌గ‌న్‌తో క‌లిసి తాము భోజ‌నం చేశామ‌ని.. ఈ స‌మ‌యంలో ఆయ‌న అన్ని స‌మ‌స్య‌ల‌ను సావ‌ధానంగా విన్నార‌ని, ప్ర‌తి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చార‌ని చిరు వెల్ల‌డించారు. అంతేకాదు.. నాడు బాల‌య్య సినిమా వీర‌సింహారెడ్డికి, త‌న సినిమా వాల్తేరు వీర‌య్య‌కు కూడా అప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఇబ్బందుల‌ను తొల‌గించాల‌ని.. సీఎం జ‌గ‌న్‌.. మౌఖికంగా అప్ప‌టిక‌ప్పుడే ఆదేశాలు ఇచ్చార‌ని చిరు మ‌రో బాంబు పేల్చారు. తాను జోక్యం చేసుకుని చ‌ర్చించ‌క‌పోతే.. నాటి వీర‌సింహారెడ్డి క‌ష్టాలు తొల‌గేవి కాద‌ని తేల్చి చెప్పారు.

ఇక‌, జ‌గ‌న్ ఎవ‌రి ఒత్తిడితోనో క‌ల‌వ‌లేద‌న్న చిరంజీవి.. ఆయ‌నే స్వ‌యంగా వ‌న్ టు వ‌న్ క‌లుసుకునేందుకు ఆహ్వా నించార‌ని, ఆయ‌న‌తో క‌లిసి లంచ్ కూడా చేశామ‌ని వివ‌రించారు. క‌రోనా టైం కావ‌డంతో ఐదుగురిని మాత్ర‌మే రావా ల‌ని జ‌గ‌న్ చెప్పార‌ని.. కానీ, తాను 10 మంది వ‌స్తామ‌ని చెప్ప‌డంతో స‌రే న‌ని ర‌మ్మ‌న్నార‌ని వ్యాఖ్యానించారు. అప్పుడు ప‌దిమందితో క‌లిసి వెళ్లాన‌న్నారు. “అసెంబ్లీలో నా పేరు ఎత్తారు కాబ‌ట్టి.. నేను స్పందించాల్సి వ‌చ్చింది.” అని చిరు ముక్తాయించారు. అయితే.. చిరు వ్యాఖ్య‌లు.. వైసీపీకి మ‌ద్ద‌తుగా ఉన్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఏదేమైనా చిన్న విష‌యం.. గ‌తించిన విష‌యం.. ఇప్పుడు రాజ‌కీయంగా దుమారం రేప‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో…

26 minutes ago

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

6 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

7 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

9 hours ago

నేను హోమ్ మినిస్టర్ కాకపోవడమే నేరస్తుల అదృష్టం: పవన్

ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…

10 hours ago

సెన్సార్ చిక్కులు చిన్న సినిమాలకేనా

వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…

11 hours ago