వైసీపీ అధినేత జగన్.. అసెంబ్లీకి రాకుండా.. తాడేపల్లిలోని తన నివాసంలో పార్టీ నాయకులు, జిల్లాల ఇంచార్జులతో సమావేశాలు నిర్వహిస్తున్నారనే విమర్శలు వస్తున్నా.. ఆయన ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన వైసీపీ నేతల విస్తృత స్థాయి సమావేశం రాత్రి 7 గంటల వరకు నిరవధికంగా సాగింది. ఈ సందర్భంగా అనేక అంశాలపై జగన్ స్పందించారు. తన పార్టీ వారికి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ పనితీరును ఆయన మూడు కోణాల్లో వివరించారు. ఇక, చంద్రబాబుపై వ్యతిరేకత పెరిగిపోయిందన్న ఆయన ఇప్పుడు వైసీపీ మాత్రమే ఏపీకి ప్రత్యామ్నాయ ని పేర్కొన్నారు. ఆ దిశగా నాయకులు పనిచేస్తే.. త్వరలోనే అధికారం దక్కుతుందని తెలిపారు.
జగన్ పేర్కొన్న 3 అంశాలు…
సూపర్ సిక్స్: గత ఎన్నికల సమయంలో చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారని జగన్ చెప్పారు. అయితే.. వీటిలో ఏదీ కూడా అమలు కావడం లేదని విమర్శించారు. ముఖ్యంగా తల్లికి వందనం పథకాన్నికొందరికే ఇచ్చారని.. మెజారిటీ తల్లులకు అన్యాయం చేశారని అన్నారు. రూ.15000 ఇవ్వాల్సి ఉండగా.. రూ.9000 వేలు, రూ.8000 చొప్పునే లక్షల మందికి ఇచ్చినట్టు మంత్రి లోకేషే అసెంబ్లీలో ఒప్పుకొన్నారని గుర్తు చేశారు. ఇక, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఎక్కడా కనిపించడం లేదన్నారు. రైతులకు ఇస్తామన్న అన్నదాత సుఖీభవలో ఏడాదిన్నర కాలానికి రూ.30 వేల చొప్పున అందించాల్సి ఉండగా రూ.5 వేలు మాత్రమే ఇచ్చారని తెలిపారు. వీటిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని జగన్ సూచించారు.
శాంతి భద్రతలు: రాష్ట్రంలో శాంతి భద్రతలు అత్యంత దారుణంగా ఉన్నాయని జగన్ వ్యాఖ్యానించారు. ప్రజలకు ఎవరికీ స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా.. ఎవరూ స్పందించడం లేదని తెలిపారు. తమ హయాంలో దిశ యాప్ ద్వారా కేవలం 10 నిమిషాల్లో నిందితులను అదుపులోకి తీసుకుని.. మహిళలకు రక్షణ కల్పించామని చెప్పారు. కానీ, ఇప్పుడు ఎవరూ స్పందించడం లేదని వ్యాఖ్యానించారు. హోం మంత్రి.. అనిత సొంత జిల్లాలోనే చిన్నారిపై దారుణం జరిగితే ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు. ఇక, సోషల్ మీడియాలో ఏ చిన్న పోస్టు పెట్టినా కేసులు పెడుతున్నారని.. కోర్టులు వద్దని చెబుతున్నా.. తిట్టిపోస్తున్నా.. తీరు మారడం లేదని అన్నారు.
రైతులు-ప్రైవేటీకరణ: రైతులకు ఈ ప్రభుత్వం ఏ పంటకూ గిట్టుబాట ధరలులభించడం లేదని జగన్ వ్యాఖ్యానించారు. ఉల్లిపాయలు, టమాటాలు, పొగాకు, మామిడి రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం యూరియా కొరత అన్నదాతకు మరింత ఇబ్బందిగా మారిందని చెప్పారు. వైసీపీ నాయకులు.. ఈ విషయాలను వివరిస్తే.. ప్రభుత్వం ఓర్చుకోలేక పోతోందని.. ప్రతిగా రైతులపైనే కేసులు పెడతామని హెచ్చరించడం దారుణమని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు. ఇక, ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం తమ హయాంలో మెడికల్ కాలేజీలు తీసుకువచ్చామన్న జగన్.. వాటిని ఇప్పుడు పీపీపీకి ఇస్తూ.. అడ్డగోలు వాదనలు చేస్తున్నారని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఏదేమైనా చంద్రబాబు సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని.. వైసీపీపై నమ్మకంతో ఉన్నారని ఆయన చెప్పారు.
This post was last modified on September 25, 2025 10:07 am
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…