అందరూ ఊహించినట్టే జరిగింది. కేంద్రం లాక్ డౌన్ ను పొడిగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మే 3వ తేదీతో రెండో లాక్ డౌన్ గడువు ముగియనుండగా… తాజాగా దానిని మరో రెండు వారాల పాటు కేంద్రం పొడిగించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. అంటే మరో 14 రోజులు లాక్ డౌన్ పొడిగించినట్లు అర్థమవుతోంది.
కేంద్రం ఎన్ని పాజిటివ్ కౌంట్లు వేసినా దేశంలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేంద్రానికి ప్రీతిపాత్రమైన రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్, యూపీతో పాటు దక్షిణాదిన ఏపీ లో కూడా కేసులు బాగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మరోసారి కఠిన నిర్ణయం తీసుకుంది.
వాస్తవానికి ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాయి. తాజాగా కేంద్రమే తన తరఫున పొడిగించడంతో ఇక రాష్ట్రాలకు భారం తప్పినట్టయ్యింది. టెస్ట్ కిట్ల పరంగా దేశం పూర్తిగా సన్నద్ధం కాకపోవడం కూడా ఈ లాక్ డౌన్ పొడిగింపునకు కారణమని చెప్పొచ్చు. లాక్ డౌన్ ఎత్తి వేసి… రెడ్ జోన్లు పెట్టడం అనేది జనాల్లో అంతగా వర్కవుట్ కాదని గ్రహించిన కేంద్రం లాక్ డౌన్ కొనసాగించి సడలింపులు పరిమిత ప్రాంతాలకు ఇస్తేనే మంచిదని భావించింది.
అందులో భాగంగానే ఈరోజు ఉదయాన్నే గ్రీన్, రెడ్, ఆరెంజ్ జోన్లను ప్రకటించిన కేంద్రం తాజాగా లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది అన్ని వ్యవస్థలపై దారుణమైన ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉన్నా… ప్రస్తుత పరిస్థితిలో కేంద్రానికి మరో మార్గం కనిపించడం లేదు.
This post was last modified on May 1, 2020 6:45 pm
తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…
ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్…
పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…
తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం…