అందరూ ఊహించినట్టే జరిగింది. కేంద్రం లాక్ డౌన్ ను పొడిగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మే 3వ తేదీతో రెండో లాక్ డౌన్ గడువు ముగియనుండగా… తాజాగా దానిని మరో రెండు వారాల పాటు కేంద్రం పొడిగించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. అంటే మరో 14 రోజులు లాక్ డౌన్ పొడిగించినట్లు అర్థమవుతోంది.
కేంద్రం ఎన్ని పాజిటివ్ కౌంట్లు వేసినా దేశంలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేంద్రానికి ప్రీతిపాత్రమైన రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్, యూపీతో పాటు దక్షిణాదిన ఏపీ లో కూడా కేసులు బాగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మరోసారి కఠిన నిర్ణయం తీసుకుంది.
వాస్తవానికి ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాయి. తాజాగా కేంద్రమే తన తరఫున పొడిగించడంతో ఇక రాష్ట్రాలకు భారం తప్పినట్టయ్యింది. టెస్ట్ కిట్ల పరంగా దేశం పూర్తిగా సన్నద్ధం కాకపోవడం కూడా ఈ లాక్ డౌన్ పొడిగింపునకు కారణమని చెప్పొచ్చు. లాక్ డౌన్ ఎత్తి వేసి… రెడ్ జోన్లు పెట్టడం అనేది జనాల్లో అంతగా వర్కవుట్ కాదని గ్రహించిన కేంద్రం లాక్ డౌన్ కొనసాగించి సడలింపులు పరిమిత ప్రాంతాలకు ఇస్తేనే మంచిదని భావించింది.
అందులో భాగంగానే ఈరోజు ఉదయాన్నే గ్రీన్, రెడ్, ఆరెంజ్ జోన్లను ప్రకటించిన కేంద్రం తాజాగా లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది అన్ని వ్యవస్థలపై దారుణమైన ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉన్నా… ప్రస్తుత పరిస్థితిలో కేంద్రానికి మరో మార్గం కనిపించడం లేదు.
This post was last modified on May 1, 2020 6:45 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…