అందరూ ఊహించినట్టే జరిగింది. కేంద్రం లాక్ డౌన్ ను పొడిగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మే 3వ తేదీతో రెండో లాక్ డౌన్ గడువు ముగియనుండగా… తాజాగా దానిని మరో రెండు వారాల పాటు కేంద్రం పొడిగించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. అంటే మరో 14 రోజులు లాక్ డౌన్ పొడిగించినట్లు అర్థమవుతోంది.
కేంద్రం ఎన్ని పాజిటివ్ కౌంట్లు వేసినా దేశంలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేంద్రానికి ప్రీతిపాత్రమైన రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్, యూపీతో పాటు దక్షిణాదిన ఏపీ లో కూడా కేసులు బాగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మరోసారి కఠిన నిర్ణయం తీసుకుంది.
వాస్తవానికి ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాయి. తాజాగా కేంద్రమే తన తరఫున పొడిగించడంతో ఇక రాష్ట్రాలకు భారం తప్పినట్టయ్యింది. టెస్ట్ కిట్ల పరంగా దేశం పూర్తిగా సన్నద్ధం కాకపోవడం కూడా ఈ లాక్ డౌన్ పొడిగింపునకు కారణమని చెప్పొచ్చు. లాక్ డౌన్ ఎత్తి వేసి… రెడ్ జోన్లు పెట్టడం అనేది జనాల్లో అంతగా వర్కవుట్ కాదని గ్రహించిన కేంద్రం లాక్ డౌన్ కొనసాగించి సడలింపులు పరిమిత ప్రాంతాలకు ఇస్తేనే మంచిదని భావించింది.
అందులో భాగంగానే ఈరోజు ఉదయాన్నే గ్రీన్, రెడ్, ఆరెంజ్ జోన్లను ప్రకటించిన కేంద్రం తాజాగా లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది అన్ని వ్యవస్థలపై దారుణమైన ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉన్నా… ప్రస్తుత పరిస్థితిలో కేంద్రానికి మరో మార్గం కనిపించడం లేదు.
This post was last modified on May 1, 2020 6:45 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…