Political News

జ‌గ‌న్ రూల్స్ పాటించాలి: ర‌ఘురామ‌

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్ అసెంబ్లీ రూల్స్ పాటించాల‌ని శాస‌న స‌భ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణ‌రాజు వ్యాఖ్యానించారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రూల్స్ ప్ర‌కారం.. అన‌ర్హ‌త వేటు వేసే అధికారం స్పీక‌ర్‌కు, స‌భ‌కు కూడా ఉంటాయ‌ని తెలిపారు. ఈ విష‌యంలో త‌న‌కు తెలియ‌ని విష‌యాలు ఉంటే త‌న లాయ‌ర్‌ల ద్వారా తెలుసుకుని అయినా.. స‌భ‌కు రావ‌డం మంచిద‌న్నారు. ప్ర‌జ‌లు ఎన్నుకున్న‌ది ఇంట్లో కూర్చోవ‌డానికి కాద‌న్నారు.

ఒక మాజీ ముఖ్య‌మంత్రిగా, ఐదేళ్ల‌పాటు స‌భా నాయ‌కుడిగా ప‌ని చేసిన జ‌గ‌న్‌కు అసెంబ్లీ రూల్స్ తెలియ‌ని అనుకోవ‌డం లేద‌న్న ర‌ఘురామ‌.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కోసం మొండి ప‌ట్టుద‌ల‌కు పోవ‌డం స‌రికాద‌న్నారు. స‌భ‌కు హాజ‌రై రూల్స్ ప్ర‌కారం న‌డుచుకోవాల‌నిసూచించారు. ఆయ‌న‌కే కాకుండా వైసీపీ త‌ర‌ఫున గెలిచిన ఎమ్మెల్యేలు అంద‌రికీ కూడా తాము విజ్ఞ‌ప్తి చేస్తున్న‌ట్టు వివ‌రించారు. స‌భ న‌డుస్తున్న స‌మయంలోనే స‌మ‌స్య‌లు ప్ర‌స్తావించేందుకు, వాటికి మంత్రులు స‌మాధానం చెప్పేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని వివ‌రించారు.

ప్ర‌జ‌ల కోసం అయినా.. స‌భ‌కు రావాలి జ‌గ‌న్‌కు సూచించారు. ఇదేస‌మ‌యంలో స‌భ‌కు రానంత మాత్రాన కేవ‌లం జీత‌మేకాద‌ని.. అన‌ర్హ‌త వేటు కూడా పొంచి ఉంటుంద‌న్నారు. వ‌రుస‌గా 60 రోజుల పాటు స‌భ‌కు రాక‌పోతే.. ఖ‌చ్చితంగా వేటు వేసే అధికారం స‌భ‌కు ఉంటుంద‌ని తెలిపారు. ప్ర‌జాప్ర‌తినిధ్య చ‌ట్టంలోనే కాకుండా.. వేత‌నాలు, చెల్లింపుల చ‌ట్టంలోనూ ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశార‌ని తెలిపారు. ఇప్ప‌టికే స‌భ 45 రోజుల‌కు పైగా పూర్త‌యింద‌ని తెలిపారు. మొత్తం స‌భ‌లో క‌నీసం హాజ‌రు కూడా లేక‌పోతే..వేటు వేసే అధికారం త‌మ‌కు ఉంటుంద‌ని చెప్పారు.

ఈ విష‌యంలో స్పీక‌ర్ కూడా ఆలోచ‌న చేస్తున్న‌ట్టు తెలిపారు. అన‌ర్హ‌త వేటుపై జ‌గ‌న్ చేస్తున్న వ్యాఖ్య‌ల ను ఎవ‌రూ ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. కేవ‌లం పార్టీ మారితేనే అన‌ర్హ‌త వేటు ప‌డ‌ద‌ని.. పార్టీ మార‌క‌పోయినా.. స‌భ‌కు రాకుండా డుమ్మా కొట్టినా నిర్ణీత స‌మ‌యం వ‌ర‌కు వేచి చూసి.. అనర్హుడిని చేయొచ్చ‌ని వివ‌రించారు.

This post was last modified on September 21, 2025 2:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కౌంట్ డౌన్?

వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…

8 minutes ago

ధనుష్‌ను ఆకాశానికెత్తేసిన మృణాల్

తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…

16 minutes ago

తారక్, ప్రభాస్ ఇద్దరూ పునుగుల పిచ్చోళ్లే

టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…

26 minutes ago

దురంధర్ హీరోకి విచిత్రమైన పరిస్థితి

బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…

1 hour ago

తెలుగు రాష్ట్రాలకూ ‘సర్’ వచ్చేస్తున్నారు..

ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…

2 hours ago

ఓటమి చూడని జట్లతో భారత్ అసలైన ఫైట్

టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…

3 hours ago