Political News

జ‌గ‌న్ రూల్స్ పాటించాలి: ర‌ఘురామ‌

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్ అసెంబ్లీ రూల్స్ పాటించాల‌ని శాస‌న స‌భ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణ‌రాజు వ్యాఖ్యానించారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రూల్స్ ప్ర‌కారం.. అన‌ర్హ‌త వేటు వేసే అధికారం స్పీక‌ర్‌కు, స‌భ‌కు కూడా ఉంటాయ‌ని తెలిపారు. ఈ విష‌యంలో త‌న‌కు తెలియ‌ని విష‌యాలు ఉంటే త‌న లాయ‌ర్‌ల ద్వారా తెలుసుకుని అయినా.. స‌భ‌కు రావ‌డం మంచిద‌న్నారు. ప్ర‌జ‌లు ఎన్నుకున్న‌ది ఇంట్లో కూర్చోవ‌డానికి కాద‌న్నారు.

ఒక మాజీ ముఖ్య‌మంత్రిగా, ఐదేళ్ల‌పాటు స‌భా నాయ‌కుడిగా ప‌ని చేసిన జ‌గ‌న్‌కు అసెంబ్లీ రూల్స్ తెలియ‌ని అనుకోవ‌డం లేద‌న్న ర‌ఘురామ‌.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కోసం మొండి ప‌ట్టుద‌ల‌కు పోవ‌డం స‌రికాద‌న్నారు. స‌భ‌కు హాజ‌రై రూల్స్ ప్ర‌కారం న‌డుచుకోవాల‌నిసూచించారు. ఆయ‌న‌కే కాకుండా వైసీపీ త‌ర‌ఫున గెలిచిన ఎమ్మెల్యేలు అంద‌రికీ కూడా తాము విజ్ఞ‌ప్తి చేస్తున్న‌ట్టు వివ‌రించారు. స‌భ న‌డుస్తున్న స‌మయంలోనే స‌మ‌స్య‌లు ప్ర‌స్తావించేందుకు, వాటికి మంత్రులు స‌మాధానం చెప్పేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని వివ‌రించారు.

ప్ర‌జ‌ల కోసం అయినా.. స‌భ‌కు రావాలి జ‌గ‌న్‌కు సూచించారు. ఇదేస‌మ‌యంలో స‌భ‌కు రానంత మాత్రాన కేవ‌లం జీత‌మేకాద‌ని.. అన‌ర్హ‌త వేటు కూడా పొంచి ఉంటుంద‌న్నారు. వ‌రుస‌గా 60 రోజుల పాటు స‌భ‌కు రాక‌పోతే.. ఖ‌చ్చితంగా వేటు వేసే అధికారం స‌భ‌కు ఉంటుంద‌ని తెలిపారు. ప్ర‌జాప్ర‌తినిధ్య చ‌ట్టంలోనే కాకుండా.. వేత‌నాలు, చెల్లింపుల చ‌ట్టంలోనూ ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశార‌ని తెలిపారు. ఇప్ప‌టికే స‌భ 45 రోజుల‌కు పైగా పూర్త‌యింద‌ని తెలిపారు. మొత్తం స‌భ‌లో క‌నీసం హాజ‌రు కూడా లేక‌పోతే..వేటు వేసే అధికారం త‌మ‌కు ఉంటుంద‌ని చెప్పారు.

ఈ విష‌యంలో స్పీక‌ర్ కూడా ఆలోచ‌న చేస్తున్న‌ట్టు తెలిపారు. అన‌ర్హ‌త వేటుపై జ‌గ‌న్ చేస్తున్న వ్యాఖ్య‌ల ను ఎవ‌రూ ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. కేవ‌లం పార్టీ మారితేనే అన‌ర్హ‌త వేటు ప‌డ‌ద‌ని.. పార్టీ మార‌క‌పోయినా.. స‌భ‌కు రాకుండా డుమ్మా కొట్టినా నిర్ణీత స‌మ‌యం వ‌ర‌కు వేచి చూసి.. అనర్హుడిని చేయొచ్చ‌ని వివ‌రించారు.

This post was last modified on September 21, 2025 2:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

27 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

47 minutes ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

2 hours ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

4 hours ago