రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. ఎవరికి అవకాశం.. ఎవరికి అవస రం వారు చూసుకునే పార్టీలు, నాయకులు ఉన్న కాలమిది. దీంతో ఎవరికి వారు తమ తమ పరిస్థితులకు అనుగుణంగానే అడుగులు వేస్తున్నారు. దీంతో రాజకీయాల్లో పొత్తులు. కలిసి ముందుకు సాగడాలు.. వంటివి గతంలో మాదిరిగా దశాబ్దాల పాటు కొనసాగే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సివస్తోందంటే.. గత ఏడాది ఎన్నికల తర్వాత.. పొత్తు పెట్టుకున్న బీజేపీ-జనసేనల మధ్య ఇప్పుడు వికటించే పరిస్థితి కనిపిస్తోంది.
మేం విడిపోం! కలిసే ముందుకు సాగుతాం!! అని ఆ పార్టీ నేతలు పైకి చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా అటు గ్రేటర్ విషయంలో బీజేపీ.. ఇటు తిరుపతి ఉప ఎన్నిక విషయంలో జనసేన ఒక పార్టీపై మరోపార్టీ కారాలు మిరియాలు నూరుతున్నాయి. అంతర్గత చర్చల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య బంధం నిలిచేది కాదనే విశ్లేషణలు ఊపందుకున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో తాను పోటీ నుంచి తప్పుకొని.. బీజేపీకి ప్రచారం చేసిపెడతానని.. పవన్ ప్రకటించారు.
అయితే.. ఎన్నికలకు డేట్ ముంచుకువస్తున్నా. పవన్ ఎక్కడా దీనిపై ఉలుకు పలుకు లేకుండా ఉన్నా రు. దీంతో బీజేపీలో అంతర్మథనం మొదలైంది. పైగా కేసీఆర్తో పవన్కు ఉన్న బంధం నేపథ్యంలో.. పవన్ వచ్చినా.. కేసీఆర్ను టార్గెట్ చేసే పరిస్థితి ఉండదనేలెక్కలు సైతం వేసుకుంటున్నారు. ఇక, గ్రేటర్ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొని మీకు సహకరించాం.. కనుక మాకు తిరుపతి ఉప ఎన్నికను వదిలేయండని.. పవన్ డిమాండ్ చేస్తున్నారు.
కానీ, తిరుపతిలో జనసేనకు బలం లేదని.. మాకే బలం ఉందని.. ఎట్టిపరిస్థితిలోనూ వదులుకునేది లేదని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ రెండు పరిణామాలు కూడా ఇరు పార్టీల్లోనూ సమస్యగా మారాయి. దీంతో వీరిరువురి పొత్తు నిలవడం కష్టమేనని చెబుతున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on November 25, 2020 5:28 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…