2016, నవంబర్ 8… రాత్రి 8 గంటల సమయంలో ప్రధాన మంత్రి హోదాలో నరేంద్ర మోదీ ప్రత్యక్షమయ్యారు. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ఆయన ఓ సంచలన ప్రకటన చేశారు. ఆ తర్వాత జనం ఏ మేర ఇబ్బందులు పడ్డారో మనందరికీ తెలిసిందే. అప్పటికి ప్రధానిగా మోదీ పదవి చేపట్టి కేవలం ఏడాదిన్నర మాత్రమే అవుతోంది. అది గతం అయితే 11 ఏళ్లకు పైగా ప్రధానిగా అనుభవం సాధించిన మోదీ… ఈ రోజు (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు దేశ ప్రజలను ఉధ్దేశించి ప్రసంగించనున్నారు. గతానుభవం నేపథ్యంలో ఆదివారం నాటి మోదీ ప్రసంగం అమితాసక్తి నెలకొంది.
ఇప్పటిదాకా జీఎస్టీ పన్ను అమలులో పలు శ్లాబ్ లు ఉండేవి. అయితే ఆదివారం అర్థరాత్రి నుంచి ఆ శ్లాబ్ లన్నీ రద్దు అయ్యి కేవలం మూడంటే మూడు శ్లాబ్ లు మాత్రమే కొనసాగనున్నాయి. ఈ మేరకు కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోద ముద్ర కూడా వేసింది. పేద, మధ్య తరగతి ప్రజలకు భారీ ఊరట కల్పించేలా నిత్యావసర వస్తువులను 5 శాతం జీఎస్టీలోకి తీసుకువచ్చారు. మోదీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఎన్డీఏకు ఈ పరిణామం ఎంతో మేలు చేస్తుందన్న విశ్లేషణలు వినిపించాయి.
మరి ఆదివారం సాయంత్రం మోదీ చేసే ప్రసంగంలో జీఎస్టీ శ్లాబ్ ల ఊరట అంశాన్ని మాత్రమే ప్రస్తావిస్తారా? లేదంటే… 2016నాటి లాగా మరేదైనా కొత్త అంశాన్ని బాంబులా పేలుస్తారా? అన్న విషయంపై అయితే ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆయా రంగాలకు చెందిన ఏ ఇద్దరు నిపుణులు కూడినా ఇదే విషయంపై చర్చ జరుగుతోంది. మోదీ చేసే పనులన్నీ దాదాపు సీక్రెట్ గానే ఉంటాయి. మోదీ నోట నుంచి బయటకు వచ్చేదాకా వాటి గురించి మరెవరికీ తెలియని విధంగా వ్యవహారం నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 5 గంటలకు మోదీ తన ప్రసంగాన్ని మొదలుపెట్టేదాకా ఆయన చెప్పబోయే విషయం ఏమిటన్నది మాత్రం ఊహించడం కష్టమేనని చెప్పాలి.
This post was last modified on September 21, 2025 2:28 pm
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…