Political News

మోదీ ఈ సారీ బాంబు పేల్చుతారా..?

2016, నవంబర్ 8… రాత్రి 8 గంటల సమయంలో ప్రధాన మంత్రి హోదాలో నరేంద్ర మోదీ ప్రత్యక్షమయ్యారు. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ఆయన ఓ సంచలన ప్రకటన చేశారు. ఆ తర్వాత జనం ఏ మేర ఇబ్బందులు పడ్డారో మనందరికీ తెలిసిందే. అప్పటికి ప్రధానిగా మోదీ పదవి చేపట్టి కేవలం ఏడాదిన్నర మాత్రమే అవుతోంది. అది గతం అయితే 11 ఏళ్లకు పైగా ప్రధానిగా అనుభవం సాధించిన మోదీ… ఈ రోజు (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు దేశ ప్రజలను ఉధ్దేశించి ప్రసంగించనున్నారు. గతానుభవం నేపథ్యంలో ఆదివారం నాటి మోదీ ప్రసంగం అమితాసక్తి నెలకొంది.

ఇప్పటిదాకా జీఎస్టీ పన్ను అమలులో పలు శ్లాబ్ లు ఉండేవి. అయితే ఆదివారం అర్థరాత్రి నుంచి ఆ శ్లాబ్ లన్నీ రద్దు అయ్యి కేవలం మూడంటే మూడు శ్లాబ్ లు మాత్రమే కొనసాగనున్నాయి. ఈ మేరకు కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోద ముద్ర కూడా వేసింది. పేద, మధ్య తరగతి ప్రజలకు భారీ ఊరట కల్పించేలా నిత్యావసర వస్తువులను 5 శాతం జీఎస్టీలోకి తీసుకువచ్చారు. మోదీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఎన్డీఏకు ఈ పరిణామం ఎంతో మేలు చేస్తుందన్న విశ్లేషణలు వినిపించాయి.

మరి ఆదివారం సాయంత్రం మోదీ చేసే ప్రసంగంలో జీఎస్టీ శ్లాబ్ ల ఊరట అంశాన్ని మాత్రమే ప్రస్తావిస్తారా? లేదంటే… 2016నాటి లాగా మరేదైనా కొత్త అంశాన్ని బాంబులా పేలుస్తారా? అన్న విషయంపై అయితే ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆయా రంగాలకు చెందిన ఏ ఇద్దరు నిపుణులు కూడినా ఇదే విషయంపై చర్చ జరుగుతోంది. మోదీ చేసే పనులన్నీ దాదాపు సీక్రెట్ గానే ఉంటాయి. మోదీ నోట నుంచి బయటకు వచ్చేదాకా వాటి గురించి మరెవరికీ తెలియని విధంగా వ్యవహారం నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 5 గంటలకు మోదీ తన ప్రసంగాన్ని మొదలుపెట్టేదాకా ఆయన చెప్పబోయే విషయం ఏమిటన్నది మాత్రం ఊహించడం కష్టమేనని చెప్పాలి.

Satya

Recent Posts

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

3 minutes ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

46 minutes ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

2 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

8 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

8 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

8 hours ago