సెలవు దినం ఆదివారం సోషల్ మీడియాలోకి ఓ అత్యంత ఆసక్తికరమైన ఫొటో ఒకటి వచ్చి చేరింది. క్షణాల్లోనే తెగ వైరల్ అయిపోతోంది. అయినా ఆ ఫొటోలో ఏముందంటే… పెద్దగా ఏమీ లేదు గానీ… ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తన వ్యక్తిగత శత్రువుగా భావిస్తూ మోదీపై అవాకులు, చెవాకులు పేల్చే బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్, మోదీతో కలిసి ఫొటో దిగారట. ఆ ఫొటోను ఆయనే తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు. ఇప్పుడు ఆ పోస్టు తెగ వైరల్ అయిపోతోంది,.
ఈ ఫొటోకు ప్రకాశ్ రాజ్ క్యాప్షన్ కూడా పెట్టారు. “ఆయనను ఎయిర్ పోర్టులో కలిశాను. అయితే మా మధ్య మాటలేమీ పెగల్లేదు” అంటూ ప్రకాశ్ రాజ్ తెలిపారు. పోనీ ఏ ఎయిర్ పోర్టు అన్నవిషయాన్ని కూడా ఆయన వెల్లడించలేదు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచి బీజేపీతో వైరంతో సాగిన ప్రకాశ్ రాజ్ ఎన్నికల్లో ఏకంగా బెంగళూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికలో ప్రకాశ్ రాజ్ ఓడిపోయారు. అప్పటి నుంచి ‘జస్ట్ ఆస్కింగ్’ పేరిట మోదీ తీసుకుంటున్న నిర్ణయాలను సోషల్ మీడియా వేదికగా నిరసిస్తూ వస్తున్నారు. తాజాగా ఆదివారం నాటి మోదీతో తాను దిగిన ఫొటోకు యాడ్ చేసిన క్యాప్షన్ లోనూ ప్రకాశ్ రాజ్ ‘జస్ట్ ఆస్కింగ్’ అన్నహ్యాష్ ట్యాగ్ ను తగిలించేశారు.
ఈ ఫొటోను చూసిన వారిలో చాలా మంది అది నిజమైన ఫొటోనేనని నమ్మారు. మోదీని తిడుతూ ఆయనతో ఫొటో ఎలా దిగారంటూ ప్రకాశ్ రాజ్ పై విమర్శలు సంధించారు. అయితే అసలు విషయానికి వస్తే… మోదీతో ప్రకాశ్ రాజ్ ఫొటోనే దిగలేదు. ఏదో ఎయిర్ పోర్టులో తాను వెళుతున్న మార్గానికి అత్యంత సమీపంలో మోదీకి చెందిన నిలువెత్తు కటౌట్ కనిపిస్తే… దాని పక్కన్నే నిలబడ్డ ప్రకాశ్ రాజ్… మోదీతో ఫొటో దిగినట్లు కలరింగ్ ఇచ్చారు. ఈ విషయాన్ని గ్రహించిన నెటిజన్లు ప్రకాశ్ రాజ్ ను ఓ ఆటాడుకుంటున్నారు.
This post was last modified on September 21, 2025 2:14 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…