సెలవు దినం ఆదివారం సోషల్ మీడియాలోకి ఓ అత్యంత ఆసక్తికరమైన ఫొటో ఒకటి వచ్చి చేరింది. క్షణాల్లోనే తెగ వైరల్ అయిపోతోంది. అయినా ఆ ఫొటోలో ఏముందంటే… పెద్దగా ఏమీ లేదు గానీ… ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తన వ్యక్తిగత శత్రువుగా భావిస్తూ మోదీపై అవాకులు, చెవాకులు పేల్చే బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్, మోదీతో కలిసి ఫొటో దిగారట. ఆ ఫొటోను ఆయనే తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు. ఇప్పుడు ఆ పోస్టు తెగ వైరల్ అయిపోతోంది,.
ఈ ఫొటోకు ప్రకాశ్ రాజ్ క్యాప్షన్ కూడా పెట్టారు. “ఆయనను ఎయిర్ పోర్టులో కలిశాను. అయితే మా మధ్య మాటలేమీ పెగల్లేదు” అంటూ ప్రకాశ్ రాజ్ తెలిపారు. పోనీ ఏ ఎయిర్ పోర్టు అన్నవిషయాన్ని కూడా ఆయన వెల్లడించలేదు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచి బీజేపీతో వైరంతో సాగిన ప్రకాశ్ రాజ్ ఎన్నికల్లో ఏకంగా బెంగళూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికలో ప్రకాశ్ రాజ్ ఓడిపోయారు. అప్పటి నుంచి ‘జస్ట్ ఆస్కింగ్’ పేరిట మోదీ తీసుకుంటున్న నిర్ణయాలను సోషల్ మీడియా వేదికగా నిరసిస్తూ వస్తున్నారు. తాజాగా ఆదివారం నాటి మోదీతో తాను దిగిన ఫొటోకు యాడ్ చేసిన క్యాప్షన్ లోనూ ప్రకాశ్ రాజ్ ‘జస్ట్ ఆస్కింగ్’ అన్నహ్యాష్ ట్యాగ్ ను తగిలించేశారు.
ఈ ఫొటోను చూసిన వారిలో చాలా మంది అది నిజమైన ఫొటోనేనని నమ్మారు. మోదీని తిడుతూ ఆయనతో ఫొటో ఎలా దిగారంటూ ప్రకాశ్ రాజ్ పై విమర్శలు సంధించారు. అయితే అసలు విషయానికి వస్తే… మోదీతో ప్రకాశ్ రాజ్ ఫొటోనే దిగలేదు. ఏదో ఎయిర్ పోర్టులో తాను వెళుతున్న మార్గానికి అత్యంత సమీపంలో మోదీకి చెందిన నిలువెత్తు కటౌట్ కనిపిస్తే… దాని పక్కన్నే నిలబడ్డ ప్రకాశ్ రాజ్… మోదీతో ఫొటో దిగినట్లు కలరింగ్ ఇచ్చారు. ఈ విషయాన్ని గ్రహించిన నెటిజన్లు ప్రకాశ్ రాజ్ ను ఓ ఆటాడుకుంటున్నారు.
This post was last modified on September 21, 2025 2:14 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…