సెలవు దినం ఆదివారం సోషల్ మీడియాలోకి ఓ అత్యంత ఆసక్తికరమైన ఫొటో ఒకటి వచ్చి చేరింది. క్షణాల్లోనే తెగ వైరల్ అయిపోతోంది. అయినా ఆ ఫొటోలో ఏముందంటే… పెద్దగా ఏమీ లేదు గానీ… ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తన వ్యక్తిగత శత్రువుగా భావిస్తూ మోదీపై అవాకులు, చెవాకులు పేల్చే బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్, మోదీతో కలిసి ఫొటో దిగారట. ఆ ఫొటోను ఆయనే తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు. ఇప్పుడు ఆ పోస్టు తెగ వైరల్ అయిపోతోంది,.
ఈ ఫొటోకు ప్రకాశ్ రాజ్ క్యాప్షన్ కూడా పెట్టారు. “ఆయనను ఎయిర్ పోర్టులో కలిశాను. అయితే మా మధ్య మాటలేమీ పెగల్లేదు” అంటూ ప్రకాశ్ రాజ్ తెలిపారు. పోనీ ఏ ఎయిర్ పోర్టు అన్నవిషయాన్ని కూడా ఆయన వెల్లడించలేదు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచి బీజేపీతో వైరంతో సాగిన ప్రకాశ్ రాజ్ ఎన్నికల్లో ఏకంగా బెంగళూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికలో ప్రకాశ్ రాజ్ ఓడిపోయారు. అప్పటి నుంచి ‘జస్ట్ ఆస్కింగ్’ పేరిట మోదీ తీసుకుంటున్న నిర్ణయాలను సోషల్ మీడియా వేదికగా నిరసిస్తూ వస్తున్నారు. తాజాగా ఆదివారం నాటి మోదీతో తాను దిగిన ఫొటోకు యాడ్ చేసిన క్యాప్షన్ లోనూ ప్రకాశ్ రాజ్ ‘జస్ట్ ఆస్కింగ్’ అన్నహ్యాష్ ట్యాగ్ ను తగిలించేశారు.
ఈ ఫొటోను చూసిన వారిలో చాలా మంది అది నిజమైన ఫొటోనేనని నమ్మారు. మోదీని తిడుతూ ఆయనతో ఫొటో ఎలా దిగారంటూ ప్రకాశ్ రాజ్ పై విమర్శలు సంధించారు. అయితే అసలు విషయానికి వస్తే… మోదీతో ప్రకాశ్ రాజ్ ఫొటోనే దిగలేదు. ఏదో ఎయిర్ పోర్టులో తాను వెళుతున్న మార్గానికి అత్యంత సమీపంలో మోదీకి చెందిన నిలువెత్తు కటౌట్ కనిపిస్తే… దాని పక్కన్నే నిలబడ్డ ప్రకాశ్ రాజ్… మోదీతో ఫొటో దిగినట్లు కలరింగ్ ఇచ్చారు. ఈ విషయాన్ని గ్రహించిన నెటిజన్లు ప్రకాశ్ రాజ్ ను ఓ ఆటాడుకుంటున్నారు.
This post was last modified on September 21, 2025 2:14 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…