సెలవు దినం ఆదివారం సోషల్ మీడియాలోకి ఓ అత్యంత ఆసక్తికరమైన ఫొటో ఒకటి వచ్చి చేరింది. క్షణాల్లోనే తెగ వైరల్ అయిపోతోంది. అయినా ఆ ఫొటోలో ఏముందంటే… పెద్దగా ఏమీ లేదు గానీ… ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తన వ్యక్తిగత శత్రువుగా భావిస్తూ మోదీపై అవాకులు, చెవాకులు పేల్చే బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్, మోదీతో కలిసి ఫొటో దిగారట. ఆ ఫొటోను ఆయనే తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు. ఇప్పుడు ఆ పోస్టు తెగ వైరల్ అయిపోతోంది,.
ఈ ఫొటోకు ప్రకాశ్ రాజ్ క్యాప్షన్ కూడా పెట్టారు. “ఆయనను ఎయిర్ పోర్టులో కలిశాను. అయితే మా మధ్య మాటలేమీ పెగల్లేదు” అంటూ ప్రకాశ్ రాజ్ తెలిపారు. పోనీ ఏ ఎయిర్ పోర్టు అన్నవిషయాన్ని కూడా ఆయన వెల్లడించలేదు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచి బీజేపీతో వైరంతో సాగిన ప్రకాశ్ రాజ్ ఎన్నికల్లో ఏకంగా బెంగళూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికలో ప్రకాశ్ రాజ్ ఓడిపోయారు. అప్పటి నుంచి ‘జస్ట్ ఆస్కింగ్’ పేరిట మోదీ తీసుకుంటున్న నిర్ణయాలను సోషల్ మీడియా వేదికగా నిరసిస్తూ వస్తున్నారు. తాజాగా ఆదివారం నాటి మోదీతో తాను దిగిన ఫొటోకు యాడ్ చేసిన క్యాప్షన్ లోనూ ప్రకాశ్ రాజ్ ‘జస్ట్ ఆస్కింగ్’ అన్నహ్యాష్ ట్యాగ్ ను తగిలించేశారు.
ఈ ఫొటోను చూసిన వారిలో చాలా మంది అది నిజమైన ఫొటోనేనని నమ్మారు. మోదీని తిడుతూ ఆయనతో ఫొటో ఎలా దిగారంటూ ప్రకాశ్ రాజ్ పై విమర్శలు సంధించారు. అయితే అసలు విషయానికి వస్తే… మోదీతో ప్రకాశ్ రాజ్ ఫొటోనే దిగలేదు. ఏదో ఎయిర్ పోర్టులో తాను వెళుతున్న మార్గానికి అత్యంత సమీపంలో మోదీకి చెందిన నిలువెత్తు కటౌట్ కనిపిస్తే… దాని పక్కన్నే నిలబడ్డ ప్రకాశ్ రాజ్… మోదీతో ఫొటో దిగినట్లు కలరింగ్ ఇచ్చారు. ఈ విషయాన్ని గ్రహించిన నెటిజన్లు ప్రకాశ్ రాజ్ ను ఓ ఆటాడుకుంటున్నారు.
This post was last modified on September 21, 2025 2:14 pm
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…